India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి (కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్) జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన పట్టభద్రులు ఫారమ్-18, ఉపాధ్యాయులు ఫారమ్-19 ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని వారన్నారు.. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని వారు పేర్కొన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే నేటి నుంచి మొదలుకానుంది. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వే చేయాల్సిన ఇళ్లను లిస్టింగ్ చేశారు. 1273 మంది ఆశాలు, 2182 మంది అంగన్వాడీలు, 537 మంది పీఎస్లు, 1837 మంది టీచర్లు ఇందులో పాల్గొనున్నారు. జిల్లాలో మొత్తం 3,245 బ్లాక్లు ఉండగా, 3,343 మంది ఎన్యూమరేటర్లు ఉన్నారు. 370 మంది సూపర్వైజర్లు ఇందులో పాల్గొంటారు.
లింగంపేట మండల కేంద్రంలో ఉన్న నాగన్న బావిని ఇవాళ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నాగన్న బావిని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని, కాటేజీలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. బావిలో ఉన్న చెత్తను తొలగించాలని, సమీపంలో మొక్కలు నాటి సంరక్షించాలని వారు సూచించారు. అనంతరం బావి చూడడానికి వచ్చిన పాఠశాల చిన్నారులతో పురాతన బావి దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు.
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడీ ప్రాంతంలో ఉన్న ఓ మెడికల్ షాప్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి బైక్పై వచ్చిన ముగ్గురు మెడికల్ షాప్ తాళం పగులగొట్టి లోనికి చొరబడి రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇది అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన తాడూరి లింబాద్రి (58) గురువారం రోజు రాత్రి గుండెపోటుతో మరణించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు గత కొన్ని సంవత్సరాలుగా దోహాలో ఉపాధి నిమిత్తం జీవనం కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గాయపడిన ఓ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు HYD కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపారు. కామారెడ్డికి చెందిన జీడి సిద్దయ్య (70) వికారాబాద్ నుంచి రైలులో వస్తు విద్యానగర్ రైల్వే స్టేషన్లో దిగుతుండగా కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి NZB జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల ప్రచార సందడి రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. పట్టభద్రులను కలుస్తూ నవంబర్ 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. సోమవారం నాటికి ఉమ్మడి జిల్లాలో 24,187 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. మరి మీరు అప్లై చేశారా? కామెంట్ చేయండి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన మందనం గంగాధర్ DSP విధులకు రిటైర్మెంట్ ప్రకటించారు. త్వరలో పట్టభద్రుల MLC అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుసగా 12 PSలకు ఆయన SHOగా విధులు నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) NVదుర్గా ప్రసాద్ హైదరాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా నిజామాబాద్ డైట్ కళాశాల లెక్చరర్ పి.అశోక్ ను నియమించారు.
తెలంగాణ అధికార పర్యటనలో భాగంగా ఈ నెల 5,6,7 తేదీల్లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో పాల్గొనేందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెళ్లారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా వారి పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు వీరికి ఘన స్వాగతం పలికారు.
Sorry, no posts matched your criteria.