Nizamabad

News July 25, 2024

నిజామాబాద్: నేటి వార్తల్లోని ముఖ్యంశాలు

image

* కామారెడ్డి జిల్లాలో ఉరేసుకొని తల్లి, కుతూరు సూసైడ్*VIDEO: మంజీరా నదిలో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపరులు*భట్టి మాటలన్నీ ఉత్త మాటలే: ఎమ్మెల్యే ధన్పాల్*NZB: బడ్జెట్ అభూత కల్పన, అబద్దాల పుట్ట: వేముల*బోధన్ నిజాం షుగర్స్ ను తిరిగి తెరిపిస్తాం: డిప్యూటీ CM *అంకాపూర్ పచ్చి బుట్టలకు భారీ డిమాండ్*శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. @61 ఇయర్స్..!

News July 25, 2024

కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఉరేసుకొని తల్లి, కూమార్తె SUICIDE

image

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డోంగ్లి మండల కేంద్రానికి చెందిన మలన్ బాయి (46), ఆమె కుమార్తె మనీషా (23) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 25, 2024

మాచారెడ్డి: కరెంట్ షాక్‌తో మహిళ మృతి

image

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. అంకిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోగల మఠం రాళ్ల తండాకు చెందిన ప్రమీల తన పొలానికి సద్ది గంప తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. గంపపై ఉన్న గొడుగుకు విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమీల విద్యాదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు.

News July 25, 2024

టీయూ పరిధిలో ప్రశాంతంగా పీజీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఇంటిగ్రేటెడ్ పీజీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు 9వ రోజైన గురువారం ప్రశాంతంగా జరిగాయని టీయూ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఉదయం జరిగిన పరీక్షకు 71 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అయితే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 187 మంది విద్యార్థులకు గాను 169 మంది విద్యార్థులు హాజరయ్యారని, 18 మంది విద్యార్థులు గైరాజరయ్యారని తెలిపారు.

News July 25, 2024

నిజామాబాద్: DEECET ఫలితాలు విడుదల

image

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (D.ED) కళాశాలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న ఆన్‌లైన్‌లో నిర్వహించిన DEECET-2024 పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఫలితాల కోసం https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ, వెబ్‌ ఆప్షన్ల నమోదు తేదీలను త్వరలో ప్రకటిస్తారని ఆయన వివరించారు.

News July 25, 2024

బోధన్ నిజాం షుగర్స్‌ను తిరిగి తెరిపిస్తాం: డిప్యూటీ CM

image

తెలంగాణకు గర్వకారణమైన బోధన్‌లోని నిజాంషుగర్స్‌ను తిరిగి తెరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం షుగర్స్‌ను తెరిపించేందుకు కనీస శ్రద్ధ చూపించలేదని, కానీ తాము త్వరలోనే ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News July 25, 2024

నిజమాబాద్: తాళం వేసిన ఇంట్లో 13 తులాల బంగారం చోరీ

image

నిజామాబాద్ నగరంలోని హమాల్వాడిలో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉండే పెంటయ్య ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో కలిసి బయటకు వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు బీరువాలో ఉన్న సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. గురువారం ఉదయం చోరీ ఘటన బయటపడగా మూడో టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

News July 25, 2024

కామారెడ్డి: నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 2005- 2006 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. అర్హత గల విద్యార్థులు సెప్టెంబర్ 16లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News July 25, 2024

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. @61 ఇయర్స్..!

image

ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిపై రాష్ట్రంలో నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నేటితో 61 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న అప్పటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేయగా, 1978లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రజలకు తాగు, సాగు నీరు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది.

News July 25, 2024

పార్లమెంట్ వద్ద నిరసన.. పాల్గొన్న ZHB ఎంపీ

image

బడ్జెట్‌లో రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని పార్లమెంటు ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై బడ్జెట్‌లో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పాల్గొనగా.. వీరి వెంట జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ సైతం పాల్గొని ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపారు.