India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి సత్యాగార్డెన్లో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలంలో ఏకంగా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మెదక్, NZB, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.
కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 7ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. బీబీపేట PS పరిధిలో తల్లి ఇంట్లో లేని సమయంలో 15 ఏళ్ల కుమార్తెపై తండ్రి దేవరాజు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి రాగానే జరిగిన విషయాన్ని ఆమె చెప్పగా PSలో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పును వెలువరించారు.
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్ట్లో భాగంగా సాధన స్వచ్ఛంద సంస్థ సిబ్బంది నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుని బుధవారం కలిశారు. బాల్య వివాహాలు లేని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. జిల్లా కోఆర్డినేటర్ మధుసూదన్, నవీపేట్, బోధన్, భీమ్గల్ మండలాల సోషల్ మొబిలైజర్ చరణ్ సింగ్, సాయి చరణ్ గౌడ్, నిరీక్షణ ఉన్నారు.
రైతుల శ్రేయస్సు దృష్ట్యా నిజామాబాద్ మార్కెట్ యార్డులో డైరెక్ట్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి తెలిపారు. మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు బుధవారం నుంచి మార్కెట్ యార్డులో కొనుగోళ్లను ప్రారంభించామన్నారు. అన్ని సీజన్లలో రైతులు నేరుగా కొనుగోలు కేంద్రంలో పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశము ఉంటుందన్నారు రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్ను అప్ డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు.
డ్రంకన్ డ్రైవ్ పట్టుబడిన ముగ్గురికి జైలు, 15 మందికి జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ తీర్పు చెప్పారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన కోటగల్లీకి చెందిన శ్రీనివాస్, ఖిల్లా రోడ్కు చెందిన ఎండీ అఖిల్కు రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. అలాగే 15 మందికి రూ. 36,200 జరిమానా విధించినట్లు వివరించారు.
➔NZB: పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
➔నిజామాబాద్: ‘నన్ను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా’
➔నిజామాబాద్: పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసం.. ఐదుగురికి రిమాండ్
➔నిజామాబాద్: ఇద్దరి హత్య కేసులో సంచలన తీర్పు: ప్రాసిక్యూటర్ రాజేశ్వర్
➔నిజామాబాద్: పోలింగ్ కేంద్రం వివరాలతో అభ్యర్థుల SMS ప్రచారం
పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించినట్లు నిజామాబాద్ 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో ఈనెల 15న కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నారనే సమాచారం మేరకు పెట్రో కారులో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా కొంత మంది వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టారు. దీనిపై కేసు నమోదు చేసి ఐదుగురిని కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ వివరించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు వాసి మంగళి కొత్తపల్లి అఖిల్(26) <<15506966>>రోడ్డు ప్రమాదంలో<<>> చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం పల్సర్ బైక్పై అఖిల్ కామారెడ్డి నుంచి ఊరికి బయల్దేరాడు. అంతంపల్లి శివారులోని చైతన్యనగర్ కాలనీ వద్ద 44వ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు కిందకి వేగంగా దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టి చనిపోయాడు. మృతుడికి భార్య, ఏడాది వయసు గల కూతురు ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే నియోజకవర్గాలు చాలా పెద్ద పరిధి కలిగి ఉంటుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలుస్తూ ప్రచారం చేయడం పెద్ద సవాలే. అయితే ఇప్పుడు అభ్యర్థులు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొత్తగా పోలింగ్ వివరాలు తెలుపుతూ.. తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని SMSరూపంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మీకు మెసేజ్లు వస్తున్నాయా..? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.