India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

NZB సెక్యూరిటీ కౌన్సిల్ (NSC), పోలీస్ ఆధ్వర్యంలో ‘నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ – 2026’ పేరుతో ఈ నెల 20-28 వరకు నిర్వహించబోయే క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, యోగా పోటీల్లో పాల్గొనేవారు. 11-17 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. క్రికెట్ కోసం: 9533256063, 9502929737, వాలీబాల్: 9440711635, బాస్కెట్ బాల్: 9440404424, కబడ్డీ: 98667 70889, యోగా: 9848420803 సంప్రదించాలన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సిరికొండ మండలంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎవరైతే జిల్లా నాయకులు, మండల రైతులు ప్రజలు, సర్పంచులు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లాలో విగ్రహాల ప్రతిష్టాపన, డీజేలు, ఊరేగింపులు, డ్రోన్ల వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మంత్రి నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2:45 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్లో బేగంపేటకు తిరుగు పయనవుతారు.

అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ టీచర్లు కొత్త ఫోన్ల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర స్థాయి అండర్ -17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో నిజామాబాద్ రెజ్లర్లు 9 మెడల్స్ సాధించారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో టి.వెంకటేష్ గోల్డ్ మెడల్, బి.రోజా సిల్వర్ మెడల్, జి.గణేష్ సిల్వర్ మెడల్ సాధించగా ప్రవీణ్, మహేందర్, సృజన, రాజేశ్వరి, గంగాధర్, అంబాదాస్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు కోచ్ కం మేనేజర్గా వ్యవహరించిన దేవేందర్, బిందు తెలిపారు.

జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మచ్చర్లలో అత్యధికంగా 43.2 డిగ్రీలు, భీంగల్ 43.0, మోస్రా 42.9, NZB 42.8, మంచిప్ప, మల్కాపూర్, ఆలూర్, పెర్కిట్ 42.7, మెండోరా, జక్రాన్పల్లి 42.6, మోర్తాడ్, గూపన్ పల్లి 42.5, ఇస్సపల్లి 42.4, వేల్పూర్, రేంజల్ 42.3,సాలూర, కోటగిరి, నవీపేట, ఏర్గట్లలో 42.2, ఎడపల్లి 42.1, బాల్కొండ, కోరట్పల్లి 42.0, లక్మాపూర్, కులాస్పూర్,ధర్పల్లి 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మచ్చర్లలో అత్యధికంగా 43.2 డిగ్రీలు, భీంగల్ 43.0, మోస్రా 42.9, NZB 42.8, మంచిప్ప, మల్కాపూర్, ఆలూర్, పెర్కిట్ 42.7, మెండోరా, జక్రాన్పల్లి 42.6, మోర్తాడ్, గూపన్ పల్లి 42.5, ఇస్సపల్లి 42.4, వేల్పూర్, రేంజల్ 42.3,సాలూర, కోటగిరి, నవీపేట, ఏర్గట్లలో 42.2, ఎడపల్లి 42.1, బాల్కొండ, కోరట్పల్లి 42.0, లక్మాపూర్, కులాస్పూర్,ధర్పల్లి 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నిజామాబాద్ ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. హెచ్పీవీ టీకాలు, డెంగీ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులు సూచించారు.

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో SSC, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి అశోక్ తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలు, టైమ్ టేబుల్ సిద్ధంగా ఉన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.