Nizamabad

News October 22, 2024

NZB: పలు హోటళ్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు, జరిమానాలు

image

నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న వంట గదులను గమనించి శుభ్రంగా ఉంచాలని హెచ్చరించి, ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించామన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్న శాతవాహన హోటల్ కు రూ.2000 జరిమానా విధించినట్లు చెప్పారు.

News October 22, 2024

NZB: తండ్రిని హత్య చేసిన కొడుకు.. సహజ మరణంగా చిత్రీకరణ

image

నవీపేట మండలంలో దారుణం జరిగింది. తండ్రి తీరుతో తనకు పెళ్లి కావటం లేదని కుమారుడు తండ్రిని హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతగిరికి చెందిన గౌరు అమృతం(55), అతని కుమారుడు మహిపాల్ ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న అమృతం మెడకు టవల్ బిగించి హత్య చేశాడు. కాగా అందరికి సహజ మరణంగా నమ్మించాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా బంధువులు మెడకు ఉన్న గాయాలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News October 22, 2024

కామారెడ్డి: ఉపాధ్యాయుడు SUICIDE

image

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ఓడపల్లి విజయ్ కుమార్(45) సోమవారం నిజామాబాద్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కుమార్ మాచారెడ్డి మండలం ఎల్లంపేట్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మానసిక స్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News October 22, 2024

NZB: వెజ్ మంచూరియాలో కోడిగుడ్డు పొట్టు

image

వెజ్ మంచురియాలో కోడిగుడ్డు పొట్టు వచ్చిన ఘటన నగరంలో సోమవారం చోటు చేసుకుంది. చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి సాయంత్రం అతిథి రెస్టారెంట్‌లో వెజ్ మంచూరియాను స్విగ్గీలో ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ ఇంటికి తెచ్చి ఇచ్చాడు. మంచూరియా తింటున్న క్రమంలో ఒక్కసారిగా కోడిగుడ్డు పొట్టు వచ్చింది. దీంతో కంగు తిన్న సదరు వ్యక్తి హోటల్ యజమానిని అడగ్గా గుడ్డు పొట్టే కదా అనడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

News October 22, 2024

రూ.8లక్షల కోట్ల అప్పుల ఊబిలో తెలంగాణ: మంత్రి జూపల్లి

image

గత ప్రభుత్వ బాధ్యతారహిత పాలన కారణంగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రతినెలా వడ్డీ రూపేణా రూ.6 వేల కోట్లను చెల్లించాల్సి వస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎనలేని ఆర్థికభారాన్ని భరిస్తూ తమ ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమాభివృద్ధి రంగాలకు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తుందన్నారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News October 21, 2024

నిజామాబాద్ జిల్లాలో కళాశాలల ఏర్పాటుకు చొరవ చూపుతా: జూపల్లి

image

నిజామాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజ్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేయించేలా, 20, 21 ప్యాకేజీల పనులను పూర్తి చేయించేలా చొరవ చూపుతానని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదికగా ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆధునికీకరణకు రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

News October 21, 2024

NZB: మరో కాంగ్రెస్ నాయకుడికి వరించిన పదవి

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నాయకుడికి సోమవారం రాష్ట్ర పదవి వరించింది. జిల్లా కేంద్రానికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌ను తెలంగాణ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యుడిగా నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రఘునందన్ రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఏదైనా కార్పొరేషన్ లేదా కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమిస్తారని గంగాధర్ ఆశాభావంతో ఉన్నారు.

News October 21, 2024

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన: మహేశ్ కుమార్

image

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో పయనింపజేయడానికి పార్టీలకు అతీతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

News October 21, 2024

NZB: ఆ ఎంపీలు చేసిందేమీ లేదు: మధు యాష్కీ

image

తన తరువాత ఎంపీ కవిత, ప్రస్తుత ఎంపీ అరవింద్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. సోమవారం ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. తాను 10 ఏళ్లపాటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు పాస్ పోర్ట్ కార్యాలయం, యూనివర్సిటీ, మెడికల్ కళాశాల తీసుకువచ్చానని, ఆ తర్వాత చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు.

News October 21, 2024

తెలంగాణ యూనివర్సిటీ VCగా టి.యాదగిరి బాధ్యతలు 

image

తెలంగాణ యూనివర్సిటీ నూతన VCగా సీనియర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోధన, బోధనేతర సిబ్బందిని ఉపయోగించుకొని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల సహకారంతో న్యాక్ గుర్తింపు తీసుకొచ్చి విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, కంట్రోలర్, ఆడి సెల్ డైరెక్టర్, డీన్స్, హెడ్స్ పాల్గొన్నారు.