Nizamabad

News February 11, 2026

NZB: పోటీలో మొత్తం 714 మంది అభ్యర్థులు: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. బోధన్‌లో 162 మంది, ఆర్మూర్‌లో 153 మంది, భీంగల్‌లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.

News February 10, 2026

NZB: మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాల వివరాలివే!

image

నిజామాబాద్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల కోసం పంపిణీ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. నిజామాబాద్ నగరం కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బోధన్‌కు విజయ మేరీ హైస్కూల్, ఆర్మూర్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు భీంగల్‌కు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

News February 10, 2026

NZB: 488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో ఎన్నికల కోసం 488 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మొత్తం 3,48,116 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భద్రతా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

News February 10, 2026

NZB: ఎన్నికల విధులు.. పోలీసులకు సీపీ దిశా నిర్దేశం

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులకు సీపీ సాయి చైతన్య కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సిబ్బంది ప్రలోభాలకు లొంగకుండా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అదనపు డీసీపీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News February 10, 2026

NZB: రైలులో గుర్తుతెలియని మహిళ మృతి

image

నాందేడ్- మేడ్చల్ డెమో రైలులో ప్రయాణిస్తున్న ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. సుమారు 70 ఏళ్ల మృతురాలు సహజంగానే తుదిశ్వాస విడిచినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. అయితే ఆమెకు సంబంధించిన ఆనవాళ్లు ఏవి లేవన్నారు. మృతురాలిని గుర్తిస్తే నిజామాబాద్ రైల్వే ఎస్సై ఫోన్ నంబర్‌ను 8712658591 సంప్రదించాలని సూచించారు.

News February 10, 2026

NZB: ‘సైలెన్స్‌ పీరియడ్‌’ అమల్లో ఉంది!

image

ఎన్నికల నియమావళిలో భాగంగా సైలెన్స్ పీరియడ్ అమలులో ఉన్నందున ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎవరూ పత్రికా ప్రకటనలు జారీ చేయరాదని, పత్రికా సమావేశాలు నిర్వహించరాదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం ద్వారా అనుమతి కలిగిన అధికారులు మాత్రమే ఎన్నికల నిర్వహణపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి ఉందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

News February 10, 2026

NZB: సాయంత్రం 5 వరకు లైన్‌లో ఉన్నవారికి టోకెన్‌లు

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటల వరకు లైన్‌లో ఉన్న ఓటర్లకు టోకెన్‌లు అందజేస్తామని NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీపీ సాయి చైతన్య, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.

News February 10, 2026

NZB: రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు

image

రెంజల్ మండలం సాఠాపూర్‌లో సామియ ఫంక్షన్ హాల్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. సాఠాపూర్ నుంచి బోధన్ వైపు వస్తున్న బంతి అనే వ్యక్తి బైక్.. దేవయ్య, నాగేందర్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో గాయపడిన వారికి 108 సిబ్బంది గంగామణి, సతీశ్ ప్రథమచికిత్స చేసి, అనంతరం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News February 10, 2026

NZB: ఆటోల్లో ఎక్కించుకుని నగదు, ఫోన్లు దొంగతనం

image

నిజామాబాద్‌లో ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకొని వారి జేబులు కట్ చేసి నగదు, మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. షేక్ సలీమ్, షేక్ సద్దాం, షేక్ ఇమ్రాన్, షేక్ నయీం, సయ్యద్ వసీం పాషా, సయ్యద్ వహాబ్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

News February 10, 2026

NZB: ఆటోల్లో ఎక్కించుకుని నగదు, ఫోన్లు దొంగతనం

image

నిజామాబాద్‌లో ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకొని వారి జేబులు కట్ చేసి నగదు, మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. షేక్ సలీమ్, షేక్ సద్దాం, షేక్ ఇమ్రాన్, షేక్ నయీం, సయ్యద్ వసీం పాషా, సయ్యద్ వహాబ్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.