India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ మహిళపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడగా ఆమె నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న మహిళను ముగ్గురు యువకులు డిచ్పల్లి వైపు తీసుకెళ్లారు. అనంతరం మరో యువకుడితో కలిసి మొత్తం నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి ఆర్టీసీ డిపోలో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆర్టీసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆర్టీసీ డీఎం, అసిస్టెంట్ డీఎంపై విచారణ చేపట్టారు. కామారెడ్డి జేఏసీ కన్వీనర్, న్యాయవాది జగన్నాథం, కోకన్వీనర్ సిద్దిరాములు రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంతో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించనున్న గ్రూప్ 2, 3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గ్రూప్ 3, గ్రూప్ 2 రాత పరీక్షలను పురస్కరించుకొని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం రేపు ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి బి.పి మధుసూదన్ రావు తెలిపారు. ఉద్యోగ మేళాలో క్యాషియర్, ప్యాకెర్స్, సేల్స్ అసోసియేట్స్, పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలకు అవకాశం ఉందని అన్నారు. జిల్లా కలెక్టరెట్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెన్త్, ఇంటర్ పాసై 18 నుంచి 26 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ అయ్యారు. ఆయనను సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి అసిస్టెంట్ డైరెక్టర్గా డిప్యుటేషన్ పై నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012 IPS బ్యాచ్కు చెందిన ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అనుమతించాలని దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిసింది.
NZB: ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ TDPMA ఆధ్వర్యంలో ఉమ్మడి NZB జిల్లాలో డిగ్రీ & పీజీ కళాశాలల నిరవధిక బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలపై హామీ ఇవ్వడంతో బంద్ విరమించారు. దీంతో నాలుగు రోజుల తర్వాత ఉమ్మడి NZB జిల్లా వ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీలు తెరుచుకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శంకరంపేట్ శివారులో జాతీయ రహదారి-161పై జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్నకొడప్గల్ వాసి సాయి గురువారం అమ్మతో కలిసి బైక్పై శంకరంపేట్కు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. ట్రాక్టర్ను ఢీకొన్నాడు. చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు.
దసరా సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రూ.1.69 కోట్ల ఆదాయం వచ్చినట్లు RTC RM జానిరెడ్డి తెలిపారు. ఈనెల 1-17 వరకు ఆర్మూర్, బోధన్, నిజామాబాద్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల నుంచి ప్రత్యేక బుస్సులు నడిపినట్లు వెల్లడించారు. 6 డిపోల పరిధిలో ప్రతి ఒక్క ఉద్యోగి సమష్టిగా పనిచేయడంతో భారీ ఆదాయం వచ్చిందన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని MLA క్యాంప్ కార్యాలయం ఆవరణలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందించామని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
5 నెలల క్రితం కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరిన తూనికలు కొలతల శాఖ ఉద్యోగి గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన ఇది. జిల్లాలోని పెర్కిట్ కు చెందిన ఉద్యోగి పుచ్చల సుమన్ (35) గురువారం నిజామాబాద్ నుంచి ఆర్మూర్ కు బైకుపై వస్తుండగా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.