Nizamabad

News January 21, 2025

NZB: రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

image

రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. జండాగల్లికి చెందిన నర్సయ్య (43) భార్య, అత్తామామ వేధింపులు భరించలేక మంగళవారం ఉదయం రైలు కిందపడి పడి ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య డయల్ 100కు సమాచారం అందించడంతో స్పందించిన రైల్వే సిబ్బంది అతడిని కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు.

News January 21, 2025

గణతంత్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి: NZB కలెక్టర్

image

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News January 21, 2025

NZB: గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య

image

నిజామాబాద్ నగర శివారులోని గూపన్ పల్లి స్మశాన వాటిక సమీపంలోని పులాంగ్ వాగు వద్ద దారుణంగా హత్యకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సౌత్ రూరల్ సీఐ, ఎస్సై ఆరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడిని ఎక్కడైన హత్య చేసి పులాంగ్ వాగులో పారేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

News January 21, 2025

NZB: క్యారమ్స్‌తో కంటిచూపు మెరుగు: జిల్లా జడ్జి

image

క్యారమ్స్‌పై ఆడేటప్పుడు దృష్టికోణం క్యారమ్స్‌పై ఉండటం వల్ల కంటి చూపు మెరుగు పడుతుందని నిజామాబాద్ జిల్లా జడ్జీ సునీత కుంచాల అన్నారు. సోమవారం ఆమె జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశం హాల్లో క్యారమ్స్ పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్యారమ్స్ ఆడి మాట్లాడుతూ.. మనుషుల నిత్య జీవితంలో ఆట పాటలు ఉంటేనే సంతోషాలు వెల్లివిరుస్థాయన్నారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

News January 21, 2025

NZB: నేటి నుండి 24 వరకు ప్రజా పాలన వార్డు సభలు

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఈ నెల 21 నుంచి 24 వరకు వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగరంలోని 60 డివిజన్లలో 7 బృందాలు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు దశల వారీగా ఈ సభలు నిర్వహిస్తారని కమిషనర్ చెప్పారు. ఇందులో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 20, 2025

రుద్రూర్: పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించాలి: కలెక్టర్

image

పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సోమవారం ఆయన రుద్రూర్‌లో సందర్శించారు. రుద్రూర్ బస్టాండ్ వెనుక వైపు ఉన్న భూములకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News January 20, 2025

NZB: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

image

నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో దూకి శివరాం(62) మృతి చెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. NZB జిల్లా ఎడపల్లి(M) జానకంపేటకు చెందిన శివరాం పెద్దకొడుకు 2 ఏళ్ల కింద మరణించారు. మనస్తాపంతో శివరాం ఇంటి వద్ద రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు కాపాడారు. సోమవారం బాసర గోదావరిలో దూకారు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. శివరాం చిన్నకొడుకు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.

News January 20, 2025

తెలంగాణాలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత: TPCC ఛీఫ్

image

తెలంగాణాలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నూతన క్రీడా విధానంపై మెల్బోర్న్ అధికారులతో చర్చించామన్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

News January 20, 2025

నిజామాబాద్‌లో ప్రజావాణి రద్దు

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున తిరిగి జనవరి 27 నుంచి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.

News January 20, 2025

NZB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వీరే!

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకునే వారి వివరాలు ఇవే. HM కేటగిరీలో బాలచంద్రం(రాకాసిపేట్), శ్రీనివాస్ (పెర్కిట్), SAల్లో కృష్ణారెడ్డి (గూపన్పల్లి), అరుణశ్రీ(కంజర), ఆరోగ్యరాజ్ (గుండారం), సతీశ్ కుమార్ వ్యాస్(బినోల), గోవర్ధన్ (మామిడిపల్లి), హన్మంత్ రెడ్డి (జానకంపేట్), SGTల్లో శ్రీనివాస్(వేంపల్లి), రాధాకృష్ణ (నర్సాపూర్), సాయిలు (కొత్తపల్లి) ఉన్నారు.