India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. మాక్లూర్(M) మదన్ పల్లె 9.2°C, కోరాట్ పల్లి 9.6, బెల్లాల్ 9.7, చిన్న మావంది 12.6, నిజామాబాద్ 13.7, సాలురా, తుంపల్లి, పొతంగల్ 13.9, మోస్రా, బాల్కొండ, డిచ్పల్లి, ఏర్గట్ల 14.4, మెండోరా 14.5, కమ్మర్పల్లి 14.6, జకోరా, వేల్పూర్, కోటగిరి 14.7, వేంపల్లి, భీమ్గల్, కోనసముందర్, జానకంపేట్ 14.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నిజామాబాద్లోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై మాస్టర్ ట్రైనర్లు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

సిద్దిపేటలో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీల కోసం జిల్లా జట్టు ఎంపికలు ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కార్యదర్శి విజయ్ కాంతారావు తెలిపారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో అండర్-14, 16, 18 విభాగాల్లో బాలురు, బాలికలకు ఎంపికలు ఉంటాయి. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అండమాన్కు అజాద్ హిందూ పేరు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి NZB మాజీ MP, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ల డిమాండ్ను సపోర్ట్ చేస్తోందన్నారు. తమకున్న నెట్వర్క్తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని లేఖలో పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ప్రోగ్రాంలో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

మేయర్ పదవీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో నిజామాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, BJP తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తమదే మేయర్ పీఠం అంటూ ఇరు పార్టీల నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ముందే పూర్తిస్థాయిలో BJP, కాంగ్రెస్ హడావుడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి సుమారు 700, బీజేపీ నుంచి 500 వరకు ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడంతో గెలిచే వారి కోసం సర్వేలు చేపట్టారు.

నిజామాబాద్ గంగస్థాన్లోని కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి కాసేపు విద్యార్థులకు ఉపాధ్యాయురాలిగా మారి ఆకట్టుకున్నారు. తరగతి గదిలో స్వయంగా బోర్డుపై తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠాలను రాసి బాలికలకు బోధించారు. విద్యార్థినుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పలు ప్రశ్నలు వేసి వారిని ఉత్సాహపరిచారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కలెక్టర్ పాఠాలు చెప్పడంతో హర్షం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ గంగస్థాన్లోని కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి కాసేపు విద్యార్థులకు ఉపాధ్యాయురాలిగా మారి ఆకట్టుకున్నారు. తరగతి గదిలో స్వయంగా బోర్డుపై తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠాలను రాసి బాలికలకు బోధించారు. విద్యార్థినుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పలు ప్రశ్నలు వేసి వారిని ఉత్సాహపరిచారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కలెక్టర్ పాఠాలు చెప్పడంతో హర్షం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ గంగస్థాన్లోని కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి కాసేపు విద్యార్థులకు ఉపాధ్యాయురాలిగా మారి ఆకట్టుకున్నారు. తరగతి గదిలో స్వయంగా బోర్డుపై తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠాలను రాసి బాలికలకు బోధించారు. విద్యార్థినుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పలు ప్రశ్నలు వేసి వారిని ఉత్సాహపరిచారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కలెక్టర్ పాఠాలు చెప్పడంతో హర్షం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేజీబీవీ(KGBV) విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చొని ఆసక్తిగా చెస్ ఆడారు. అనంతరం ఆమె ఉపాధ్యాయురాలిగా మారి బోర్డుపై తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠాలను బోధించి విద్యార్థినులను ఆశ్చర్యపరిచారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసి వారిలో ఉత్సాహం నింపారు. కలెక్టర్ సరళత్వం, విద్యార్థినులతో మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుంది.
Sorry, no posts matched your criteria.