India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని కాకతీయ సాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజు రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత ఆశయాలను లక్ష్యాలుగా ఎంచుకోవాలని సూచించారు. నిజామాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తన చుట్టూ ఉన్న వారిని చైతన్యం చేయాలని కోరారు.
అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త రమావత్ రమేశ్కు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం కామారెడ్డి ప్రధాన న్యాయమూర్తి వర ప్రసాద్ తీర్పునిచ్చారు. జిల్లాలోని సురాయిపల్లి తండాకు చెందిన రమేశ్ భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021 ఫిబ్రవరి 27న లింగంపేట్ బస్టాండ్లో కొట్టాడు. గాయపడినా ఆమె నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు విధించారు.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లోని ఆమె నివాసంలో శుక్రవారం జాగృతి విద్యార్థి నాయకుడు మునుకుంట్ల నవీన్ రూపొందించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్, భగవత్ యాదవ్, సునీల్ జోషి, రాజ్ కుమార్ యాదవ్, ఈశ్వర్ అజయ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ వ్యవస్థలో పని చేసేవారందరూ పబ్లిక్ సర్వెంట్లే అని నిజామాబాద్ ఇన్ఛార్జి సీపీ సింధూ శర్మ అన్నారు. శుక్రవారం డిచ్పల్లి 7వ పోలీస్ బెటాలియన్లో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్లో ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితులలోనూ ప్రజల మనోభావాలకు భంగపర్చకుండా ప్రజల మన్ననలను పొందాలని ఆమె ట్రైనింగ్ పొందిన కానిస్టేబుళ్లకు సూచించారు.
డిచ్పల్లిలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్లో శుక్రవారం 463 మంది SCTPCs (TGSP)లకు 2024 “దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్)” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధూ శర్మ హజరయ్యారు. 9 నెలల శిక్షణలో నేర్చుకున్నది శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగించాలని ఆమె సూచించారు. కమాండెంట్ పి.సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్లో శుక్రవారం దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ సింధుశర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లకు శిక్షణనిచ్చిన పోలీసులకు సీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు. టీజీఎస్పీ ద్వారా ఎంపికైన 463 మంది కానిస్టేబుళ్లు బెటాలియన్లో 9 నెలలు పాటు శిక్షణ పొందిన అనంతరం వారికి శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్లో నిర్వహించారు.
ముగ్గురు బాలికలు అదృశ్యమైన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి వరకు గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన SI వినయ్ కుమార్ విచారణ చేపట్టారు.
నిజామాబాద్ నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం సారంగాపూర్ వడ్డెర కాలనీలో వెలుగు చూసింది. కాలనీకి చెందిన దుబ్బాక సాయమ్మకు నలుగురు సంతానం. ముగ్గురికి వివాహం కాగా చిన్న కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. భర్త చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న 6వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొందరు చిన్న పిల్లలు పాములతో ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. ఈ ఘటన గురువారం నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయం ముఖ ద్వారం వద్ద చోటుచేసుకుంది. పీల స్కూల్ సమీపంలో పామును పట్టుకొని కొందరు పిల్లలు ఆటలాడుతూ తిరిగారు. కొంచెమైనా భయం లేకుండా పాముతో చెలగాటం ఆడుతూ సెల్ఫీలు దిగారు. పిల్లలపై స్థానిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి దీంతో చలి పంజాబీ విసురుతుంది. ఉదయం మంచు ఉగ్రరూపం ప్రదర్శిస్తుంటే రాత్రి చలి తాకిడి ఎక్కువవుతుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు డోంగ్లి 10.2, గాంధారి 11.2, జుక్కల్ 11.5, సర్వాపూర్ 12.7, మేనూర్ 12.9 కాగా నిజామాబాద్ జిల్లాలో మెండోరా 12.5, తుంపల్లి 13.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.