Nizamabad

News January 2, 2025

మాచారెడ్డి: రెసిడెన్షియల్ కోసం ఫేక్ ఆధార్..

image

రెసిడెన్షియల్ కోసం మీసేవ నిర్వాహకుడు డూప్లికేట్ ఆధార్ క్రియేట్ చేసిన ఘటన మాచారెడ్డి మండలం ఘన్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన ముహమ్మద్ షరీఫ్ ఫిలిప్పీన్ దేశానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం మీసేవ నిర్వాహకుడి సాయంతో డూప్లికేట్ ఆధార్ తయారు చేశారు. భార్యాభర్తల ఆధార్ నంబర్ సేమ్ ఉండడంతో RI రమేశ్ PSలో ఫిర్యాదు చేశారు.

News January 2, 2025

NZB: ఎస్సీ వర్గీకరణ వద్దని న్యాయమూర్తికి నివేదిక అందజేత

image

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం దళిత కళ్యాణ్ సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ జస్టిస్ షమీం అక్తర్ కమిటీకి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దౌలత్ చక్రే మాట్లాడుతూ.. అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీలను ఐక్యమత్యంగా ఉండకూడదనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేసిందన్నారు. 15% ఉన్న రిజర్వేషన్లను 22 % కు పెంచాలని డిమాండ్ చేశారు.

News January 2, 2025

రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

 జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా చర్యలు పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు.

News January 2, 2025

NZB: జస్టిస్ షమీం అక్తర్‌ను కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు

image

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎస్సీ వర్గీకరణ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ శమీమ్ అక్తర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. జిల్లా కేంద్రానికి అధికారిక పర్యటన నిమిత్తం చేరుకున్న సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూలు జగన్ మోహన్ గౌడ్, బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్ ప్రభుత్వ అతిధి గృహంలో కలిసి పూలమాలలు అందజేశారు.

News January 2, 2025

NZB: సమగ్ర నివేదిక సమర్పిస్తాం: జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్

image

ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని ఏకసభ్య కమిషన్ ఛైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అన్ని ఉమ్మడి జిల్లాలలో అందరి అభిప్రాయాలను సేకరించిన మీదట ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

News January 2, 2025

ఆర్మూర్: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

image

చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన ఆలూర్ మండలం దేగాం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఆర్మూరు సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేశవ్ గంగాధర్ అనే వ్యక్తి ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి 6 నెలల క్రితం బతుకుదెరువు కోసం వచ్చాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నీటి కాలువలో చేపలు పట్టడానికి వెళ్లగా ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. 

News January 2, 2025

NZB: బీసీ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

image

నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాదులోని ఆమె నివాసంలో బుధవారం బీసీ మహాసభల పోస్టర్‌‌ను ఆవిష్కరించారు. శాతవాహన యూనివర్సిటీ నాయకులు మహేశ్ మాట్లాడుతూ..ఈ నెల 3వ తేదీన సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఇంద్ర పార్క్ వద్ద బీసీ మహా సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీలోని అన్ని కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రమేష్, అన్వేష్, శివ, పవన్, ప్రేమ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

News January 2, 2025

జైలుకు వెళ్లి వచ్చిన వారు క్రైం రేటు పెరిగిందంటున్నారు: షబ్బీర్ ఆలీ

image

జైలుకు వెళ్లి వచ్చిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో నేరాలు పెరిగాయని, క్రైం రేటు పెరిగిందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నేరాలు అధికంగా జరిగాయని ఆరోపించారు. ఒక మహిళ అయి ఉండి లిక్కర్ వ్యాపారం చేసి అందరిని తాగుబోతులుగా మార్చి క్రైమ్ రేట్ పెంచారని విమర్శించారు.

News January 2, 2025

NZB: నేడు జిల్లాకు ఏకసభ్య కమిషన్

image

ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ గురువారం ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం జిల్లాకు వస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై వినతులను అందివచ్చని సూచించారు. తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టీస్ డాక్టర్ షమీమషమీమ్ అక్తర్ తో కూడిన ఏక సభ్య కమిషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చారు.

News January 1, 2025

కామారెడ్డి: ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చైతన్య రెడ్డి

image

కామారెడ్డి ఏఎస్పీగా చైతన్య రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం ఆమెను కామారెడ్డి ఏఎస్పీగా నియమించింది. ఈ మేరకు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు.