India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
న్యూ ఇయర్ వేడుకలను ఈ ఏడాది ఘనంగా జరుపుకునేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి నుంచే ఆటపాటలతో ఉత్సాహంగా గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక బేకరీలు, స్వీట్స్ షాపులతో పాటు చికెన్, మటన్ షాపులు కళకళలాడుతున్నాయి. మహిళలు రంగు రంగుల రంగవల్లులతో రేపు వాకిళ్లను అందంగా తీర్చిదిద్దేందుకు సంబంధించిన రంగులను కొనుగోలు చేస్తున్నారు.
బట్టలు ఆరేయడానికి వెళ్లి భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ 4వ టౌన్ పోలీసులు తెలిపారు. బోర్గాం(పి)కి చెందిన కాలూరి నిహారిక (32) దుస్తులు ఆరవేసేందుకు సోమవారం సాయంత్రం రెండంతస్తుల భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సాయం చేస్తానని నమ్మించి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఓ మహిళ NZB 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. SHO రఘుపతి వివరాల ప్రకారం.. భర్తతో గొడవ పడి నిర్మల్కు వెళ్లిన మహిళను గౌతమ్ ఈ నెల 17న NZBకి తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కాగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు SHO వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ముగ్గురు MLAలు శాసన సభలో తొలిసారి అడుగు పెట్టారు. KCR, రేవంత్ రెడ్డిని ఓడించిన KVR జాయింట్ కిల్లర్ గా అవతరించారు. జుక్కల్ MLA తోట JAN 26 న కౌలాస్ కోటపై తొలిసారి జాతీయ జెండా ఎగురవేసి కోట ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ ఏడాది చివర్లో.. అడ్లూర్ చెరువులో SI, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి మృతదేహాలు లభ్యమైన కేసు TG లోనే సంచలనంగా మారింది.
తన జోలికి వచ్చిన మహామహులు మట్టికరుచుకుపోయారని, అందుకే తన జోలికి వచ్చేందుకు ఎవరూ సాహసం చేయరని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం నిజామాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీ నినాదాన్ని ఎంచుకున్నాయన్నారు. తాము గెలిస్తే ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఉచిత వైద్యం, విద్య అందిస్తామన్నారు.
పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మేడిగడ్డ విషయంలో కేసీఆర్ను బద్నాం చేయాలన్న పిచ్చి ప్రయత్నంతో ఎస్సారెస్పీని ఎండబెట్టారన్నారు. ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు.
ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నిబంధనలు పాటిస్తూ..న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని జిల్లా SP సింధు శర్మ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. రోడ్లపై కేక్ కట్టింగ్, అల్లర్లకు పాల్పడడం వంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. డీజేలు వినియోగిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆరోజు రాత్రి బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.
నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ.. DEC 31న రాత్రి నిర్వహించే వేడుకలపై ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు పెడుతున్నట్లు NZB ఇన్ ఛార్జ్ సీపీ సింధు శర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలు అందరికీ ఆమోదయోగ్యంగా, అహ్లదకరంగా, ఆరోగ్యంగా హాని రహితంగా ఉండాలని కోరారు. ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.
ఉనికి కోసమే కాంగ్రెస్పై ఎమ్మెల్సీ కవిత అబద్ధపు మాటలు చేస్తున్నారని రాష్ట్ర సహకార యునియన్ లిమిటెడ్ ఛైర్మన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. మాయ మాటలు చెప్పడంలో కేసీఆర్ కుటుంబాన్ని మించిన వారు రాష్ట్రంలో లేరని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వ హయంలో క్రైమ్ రేట్ పెరిగిందో, తగ్గిందో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు సిద్ధమైతే మాతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇచ్చిన హామీల్లో 80% అమలు చేశామన్నారు.
ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే ఊరుకోబోమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో హైడ్రా పెట్టినట్టు నిజామాబాద్లో నిడ్రా పెడుతామని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం దారుణమన్నారు. బుల్డోజర్తో ప్రజల ఆస్తులు కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.