India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో సోమవారం వెలుగుచూసింది. బాలిక(6)పై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆదివారం అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ మీటర్లు లేని BPL కుటుంబాలకు NPDCL రూ.825కే విద్యుత్ కనెక్షన్ ఇవ్వనుంది. ఈ నెల 15 వరకు నేరుగా విద్యుత్ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 500 వాట్ల విద్యుత్ వాడే వారు విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తు ఫీజు – రూ.25, డెవలప్మెంట్ ఛార్జీ – రూ.600, సెక్యూరిటీ డిపాజిట్ – రూ.200 కలిపి మొత్తంగా రూ.825వసూలు చేయనున్నారు.
కామారెడ్డి జిల్లాలో అధిక వర్షప్రభావం కొనసాగుతున్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు భారీగా పొట్టేతిన వరద* ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో కూలిన ఇండ్లు, నీట మునిగిన పంట పొలాలు* శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 40 గేట్లు ఎత్తివేత* పోచారం ప్రాజెక్ట్ వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ* ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఏడ్ల పోలాల అమావాస్య* కామారెడ్డి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు*
శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్లో నీటిమట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో అటల్ మిషన్ ఫర్ రిజువేనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అమలుపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సోమవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు.
*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచికొట్టిన వాన *NZB, KMR ప్రాజెక్టులకు పోటెత్తిన వరద *NZB రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి *KMR డెంగ్యూతో వ్యక్తి మృతి *ACBకి పట్టుబడ్డ ఇన్ఛార్జ్ అర్వో నరేందర్ సస్పెండ్ *బిక్కనూర్ వరద నీటిలో చిక్కిన వారిని కాపాడిన పోలీసులు *డిచ్పల్లి: వివాహితది ఆత్మహత్య కాదు.. హత్య *బాన్సువాడ ప్రేయసిన హత్య చేసిన ప్రియుడు.
నర్సు కేసును బాన్సువాడ పోలీసులు చేదించారు. టౌన్ సీఐ కృష్ణ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. బీర్కూర్ మండలం బరంగెడ్దికి చెందిన మమత, ప్రశాంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని మమత ఒత్తిడి తేవడంతో ప్రశాంత్ గురువారం ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. అతడిపై కేసు నమోదు చేశామన్నారు.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100, 87126 86133కు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందవచ్చని కామారెడ్డి జిల్లా SP సింధూ శర్మ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అలాగే వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటలకు 35,417 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లో గా 825 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMCలకు గాను, ప్రస్తుతం 62.144 TMCల నీరు చేరినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.