Nizamabad

News December 24, 2024

కామారెడ్డి: ఉద్యోగంలో చేరే లోపే విషాదం

image

HYD నానక్‌రాంగూడ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఐరేని <<14964716>>శివాని<<>>(21) మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం నిజాంసాగర్ నవోదయలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళానానికి హాజరయింది. అయితే ఆమె ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించారు. 4 నెలల్లో విధుల్లో చేరాల్సి ఉండగా ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులు ఆమె నేత్రాన్ని LV ప్రసాద్ కంటి ఆసుపత్రికి డొనేట్ చేశారు.

News December 24, 2024

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి

image

రాయదుర్గం PS పరిధిలో శివాని అనే యువతి సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. CBITలో బీటెక్ 4వ ఏడాది చదువుతున్న శివాని KMR జిల్లా నిజాంసాగర్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది. హాస్టల్‌కు వెళ్లేందుకు స్నేహితుడు వెంకట్ రెడ్డి బైక్ పై ఎక్కి నార్సింగి సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో శివాని మృతిచెందగా వెంకట్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

News December 24, 2024

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయి: MLC కవిత

image

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దాన్ని బీజేపీ నడిపిస్తున్నదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మరోసారి రుజువయ్యిందని స్పష్టం చేశారు.

News December 23, 2024

NZB: ‘చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలి’

image

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విషాహారం తిని గురుకులాల్లో 57 మంది పిల్లలు చనిపోయారని, వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.30,000 బాకీ పడ్డారని వాటిని కూడా చెల్లించాలన్నారు.

News December 23, 2024

నిజామాబాద్ కలెక్టరేట్‌లో క్రిస్మస్ వేడుకలు

image

తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి సందేశాన్ని అందించే ఈ క్రిస్మస్ వేడుకను క్రైస్తవులు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

News December 23, 2024

NZB: పదవులు శాశ్వతం కాదు.. గుర్తుపెట్టుకో రేవంత్: KA పాల్

image

తన మద్దతుతోనే రేవంత్ సీఎం అయ్యారని, ముఖ్యమంత్రి తనను వాడుకొని వదిలేశారని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. సోమవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పదవులు శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో రేవంత్’ అని అన్నారు. తెలంగాణలో రేవంత్ ట్యాక్స్ వసూలవుతోందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలవి పచ్చి అబద్ధాలు అని విమర్శించారు.

News December 23, 2024

NZB: విధులకు గైర్హాజరుపై మంత్రి ఫైర్

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులపై మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. నిత్యం 50 శాతం మంది డాక్టర్లు కూడా ఆసుపత్రిలో పనిచేయడానికి రాకపోతే.. సూపరింటెండెంట్‌గా ఏం చేస్తున్నారని ప్రతిమారాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లాలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ భవనాన్నిమంత్రి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.

News December 23, 2024

NZB: 90% ఖాళీలను భర్తీ చేస్తున్నాం: మంత్రి దామోదర్ రాజ నర్సింహ

image

ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా ప్రతి చోటా సరిపడే వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా 90% వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచుతూ, అనేక రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు.

News December 22, 2024

NZB: మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయం: మంత్రి

image

ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆదివారం రెంజల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో ముందుకెళ్తున్నామన్నారు.

News December 22, 2024

కామారెడ్డి: ఫలితాలు విడుదల

image

శనివారం నిర్వహించిన కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. స్టెనో 14, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ 42, రికార్డ్ అసిస్టెంట్  పరీక్షకు 78 మంది పరీక్షలకు హాజరయ్యారు. 40% మార్కులు పొందిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపల్ జడ్జ్ వరప్రసాద్ తెలిపారు. 2వ స్టేజి పరీక్షలు ఈ నెల 28న జరుగుతాయని ఫలితాలకు కోర్టు వెబ్సైట్ చూడాలని సూచించారు.