India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి దామోదర్ రెడ్డి మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. గతేడాది జులైలో బదిలీపై రాగా ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. దామోదర్ రెడ్డి బదిలీ కాగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్కు డీవైఎస్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జ్ మెదక్ డీఈఓగా ఉన్న ప్రొ.రాధాకిషన్ కు డైట్ ప్రిన్సిపల్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. తాజాగా డీవైఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. KCR, హరీశ్రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపింది. ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టొద్దని అదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని స్పష్టిం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ YSR సీఎంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అపూర్వ సేవలు అందించారని కొనియాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ వంటి పథకాలతో పేదలకు పెద్దన్నగా నిలిచారని గుర్తుచేశారు. YSR లేని లోటు కాంగ్రెస్కి తీరనిదని కొనియాడారు.
ఖమ్మం కాల్వొడ్డు, మున్నేరు వద్ద గణేష్ నిమజ్జన ఘాట్లను మంగళవారం అదనపు కలెక్టర్ శ్రీజ, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. శోభాయాత్ర, నిమజ్జన సమయాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రహదారిపై అడ్డుగా వైర్లు, చెట్టు కొమ్మలు లేకుండా చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, మార్గాలు, బారికేడింగ్ తదితర అంశాలపై చర్చించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు 29 గేట్ల ద్వారా 1.25లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 29 వరద గేట్ల నుంచి కాకుండా ఇందిరమ్మ కాల్వ ద్వారా 18 వేలు, కాకతీయ కాల్వ ద్వారా 4500 క్యూసెక్కులు వెరసి మొత్తం 1,51,897 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా 1090 (76.894TMC) అడుగులకు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 1న ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో అత్యధిక వర్షపాతం 105.8 mm వర్షపాతం నమోదయింది. ఆ తర్వాత ఇచ్చోడ లో 102.0mm, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ధరిలో 101.0mm వర్షపాతం నమోదయింది. ఈరోజు కూడా జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని.. ప్రజలు జాగ్రత్త వహించాలని వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడిని మొదటిసారి 1954లో స్వాతంత్ర్య సమరయోధుడు సింగరి శంకరయ్య ప్రతిష్టించారు. సమాజ ఐక్యతకు బాలగంగాధర్ తిలక్ పిలుపు నుంచి ప్రేరణపొంది దీనిని రూపొందించారు. మహా గణపతిని ప్రతిష్ఠించినప్పుడు ఎత్తు కేవలం అడుగు మాత్రమే. బడా గణేశ్ను ఎందరో ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో బడా గణేశ్కు NTR పూజలు చేసిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
రాచకొండ పోలీసులు గణపతి నిమజ్జనాల వేళ ప్రజలకు సూచనలు చేశారు.
✓ కరెంటు తీగలు జాగ్రత్త
✓ వాహనం రివర్స్ చేయొద్దు
✓ డ్రైవర్ మద్యం తాగి ఉండకూడదు
✓ పిల్లలు వాహనం వెంబడి రాకూడదు
✓ ప్రతి వాహనానికి ఇన్చార్జ్లు ఉండాలి
✓ పెద్ద విగ్రహాలకు ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
✓ క్రేన్ దగ్గర దూరం పాటించాలి
లండన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
లండన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.