India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా కల్లూరు కల్లూరుతిమన్ దొడ్డిలో 33.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 32.5 డిగ్రీలు, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 29.8 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగులలో 29.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ లో 29.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
విదేశాలలో పాలమూరు మామిడి పండ్లు విక్రయించడానికి అనుమతులు వచ్చాయి. ఎగుమతులు చేయడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ నర్సయ్య వెల్లడించారు. దేశంలో మన మామిడి పండ్లను మంచి గుర్తింపు ఉందని, శాస్త్రవేత్తలు సూచించిన విధానాలను పాటిస్తూ.. మామిడి రైతులు నాణ్యత ప్రమాణాలు ఎగుమతి పెంచాలని సూచించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు శనివారం చేరుకున్నారు. రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ ఉన్నత అధికారులు తదితరులు ఉన్నారు.
పెంపుడు కుక్కలను పెంచుతున్న యజమానులు వాటికి ప్రతి సంవత్సరం రేబీస్ వ్యాధి నివారణకు తప్పనిసరిగా టీకాలను వేయించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శనివారం వడ్డేపల్లి ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ప్రపంచ రేబిస్ దినోత్సవం పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణకు టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు రోప్ వే ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి రోప్వే ప్రతిపాదన స్థలాన్ని, జాఫర్ బావిని పరిశీలించారు.
జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు SIలపై వేటు పడింది. ఓ si సస్పెండ్ కాగా.. మరో పోలీస్ హెడ్క్వార్టర్కు అటాచ్ చేశారు. మహిళా కానిస్టేబుల్తో అసభ్యప్రవర్తన కారణంగా జగిత్యాల జిల్లా రాయికల్ si అశోక్ను sp సస్పెండ్ చేశారు. కోరుట్ల SI శ్వేతను హెడ్క్వార్టర్కు అటాచ్ చేస్తూ మల్టీజోన్ 1 IG ఉత్తర్వుల జారీచేశారు. భార్యా, భర్తల గొడవలో భర్త శివప్రసాద్ను SI శ్వేత కొట్టడంతో శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. బస్సు సూర్యాపేట నుంచి కోదాడ వెళుతోంది. గుడిబండకు చెందిన అలివేలు అనే గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. బస్సు డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమై బస్సును పక్కకి నిలిపారు. మహిళా ప్రయాణికులు ఆమెకు సుఖప్రసవం చేశారు. మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య అనే వృద్ధుడు ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి చొరబడ్డారు. నక్సలైట్లమని బెదిరించి రూ.35 వేలను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఝాన్సీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
నిజామాబాద్లో ఎరుపెక్కిన ఆకాశం ఆకట్టుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 5:45 నిమిషాల నుంచి 6:30 గంటల వరకు నీలిరంగులో ఉండాల్సిన ఆకాశం ఒక్కసారిగా ఎరుపు రంగులోకి మారింది. ఎరుపు వర్ణం పులుముకున్న ఆకాశాన్ని తెల్లవారుజామున వాకింగ్, ఇతర పనులకు వెళ్లే వారు ఆసక్తిగా వీక్షించారు. పలువురు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.
Sorry, no posts matched your criteria.