RangaReddy

News November 30, 2025

రంగారెడ్డి: అన్నా.. ఏమైనా డబ్బులు ఉన్నాయా!

image

రంగారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం వ్యవసాయ భూమి, ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. వచ్చేనెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో నగదు సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కాగా, అన్నా.. సర్పంచ్ రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఏమైనా డబ్బులు ఉన్నాయా..! నేను గెలిస్తే నీవు గెలిచినట్టే అని పంచాయతీ పోటీదారులు అప్పులు చేస్తున్నారు.

News November 30, 2025

RR: రూ.2వేల కోట్లకు పైగానే ఖర్చు

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు రూ.2 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంది. చిన్న గ్రామంలో నాలుగు పార్టీల మద్దతుదారులు పోటీ చేస్తే రూ.2 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఈ మొత్తం కొంత తగ్గే అవకాశం ఉన్నా.. జనరల్ బీసీ స్థానాల్లో అంతకుమించి పెరుగుతోంది.

News November 30, 2025

RR: రూ.2వేల కోట్లకు పైగానే ఖర్చు

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు రూ.2 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంది. చిన్న గ్రామంలో నాలుగు పార్టీల మద్దతుదారులు పోటీ చేస్తే రూ.2 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఈ మొత్తం కొంత తగ్గే అవకాశం ఉన్నా.. జనరల్ బీసీ స్థానాల్లో అంతకుమించి పెరుగుతోంది.

News November 30, 2025

RR: రూ.2వేల కోట్లకు పైగానే ఖర్చు

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు రూ.2 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంది. చిన్న గ్రామంలో నాలుగు పార్టీల మద్దతుదారులు పోటీ చేస్తే రూ.2 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఈ మొత్తం కొంత తగ్గే అవకాశం ఉన్నా.. జనరల్ బీసీ స్థానాల్లో అంతకుమించి పెరుగుతోంది.

News November 28, 2025

గచ్చిబౌలిలో RS బ్రదర్స్ షోరూమ్ ప్రారంభం

image

RS బ్రదర్స్ 16వ షోరూమ్‌ను గచ్చిబౌలిలో మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. కుటుంబంలోని అన్ని తరాల వారి అవసరాలను ప్రతిబింబిస్తూ.. వివాహ వేడుకలకు అవసరమైన కొనుగోళ్లకు గమ్యంగా, సర్వాంగ సుందరంగా ముస్తాబైన షోరూం ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రారంభోత్సవంలో ఛైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు, ఎండీ రాజమౌళి, ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

News November 28, 2025

RR: నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు

image

గ్రామపంచాయతీ ఎన్నిక నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు ఇవే..
– నామినేషన్ పత్రాలను నిర్దిష్ట సమయంలో దాఖలు చేయకపోవడం
– నిర్దేశించిన చోట అభ్యర్థులు, ప్రతిపాదించే వారు సంతకాలు చేయకపోవడం
– ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే
– ఆస్తులు,అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా పొందుపర్చకపోవడం
– చట్ట ప్రకారం అవసరమైన డిపాజిట్ నగదును చెల్లించకపోవడం ప్రధాన అంశాలు.

News November 28, 2025

కాంగ్రెస్ తీరు.. రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్: BRS

image

‘రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్’ అన్నట్టుగా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తోందని రంగారెడ్డి జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి ప్రజలపై భారీ పన్నుల భారాన్ని మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన తుర్కయంజాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్నారు.

News November 28, 2025

శంషాబాద్: విమానంలో ప్రయాణికురాలితో అసభ్య ప్రవర్తన

image

విమానంలో మహిళ ప్రయాణికురాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పోలీసుల వివరాలు.. బుధవారం జైపూర్ నుంచి ఇండిగో విమానం శంషాబాద్‌కు వస్తుండగా.. పక్క సీట్లో కూర్చున్న మహిళ ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఎయిర్ లైన్స్ అధికారులు ఆర్జీఐఏ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News November 28, 2025

HYD: నేడు, రేపు డిగ్రీ కోర్సుల తుది కౌన్సిలింగ్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది దశ కౌన్సిలింగ్ ఈరోజు, రేపు నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా యూజీ కోర్సుల భర్తీకి సంబంధించింది. ప్రస్తుతం రైతు కోటాలో 22 సీట్లు, రైతు కూలీల కోటాలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News November 28, 2025

శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

image

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.