India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంగారెడ్డి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జిల్లాలోని కందుకూరు, షాబాద్ మండలాల్లో ఎస్సీ మహిళలకు రిజర్వ్డ్ కావడంతో అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంది.
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో నోడల్, పోలింగ్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, పోలీసులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించిన అధికారులు పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలను బీజేపీ పరిగణలోకి తీసుకుంటోంది. బూత్ స్థాయి నుంచి కార్యకర్తల వరకు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే అభ్యర్థికి పార్టీ తరఫున బీఫామ్ అందజేయనుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని గ్రామ, మండల స్థాయిలో బరిలో నిలవాలని భావించే ఆశావాహుల పేర్లను నమోదు చేసుకుంటోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఖరారైన రిజర్వేషన్లపై ఆయా పార్టీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు ఉత్సాహం చూపుతుండగా.. MPTC, ZPTC స్థానాల నుంచి పోటీ చేసే వారి పేర్లను సేకరించి పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. కాగా, కోర్టు తీర్పు తర్వాత ముందుకెళ్లాలని పార్టీలు యోచిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 7,94,653 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళలు 3,95,216 ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావాహులు ఇప్పటికే ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆత్మీయంగా అక్కా.. అమ్మా.. అమ్మమ్మా అంటూ పలకరిస్తూ మచ్చిక చేసుకునేందుకు పాట్లుపడుతున్నారు.
గడచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం ఇలా ఉంది. అత్యధికంగా అత్తాపూర్లో 50 మి.మీ, రాజేంద్రనగర్ 40.8, శాస్త్రిపురం 32, శివరాంపల్లి 31.3, ప్రొద్దుటూరు 31, రాజేంద్రనగర్ 30, మాణికొండ 25.5, శంకర్పల్లి 25.3, ఖాజాగూడ 25, నల్లవెల్లి 17.8, ఆరుట్ల 18, ధర్మసాగర్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం 15.5, బాలాపూర్ 14.5, మొయినాబాద్లో 13 MM వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ వర్షం అక్కడక్కడా కురిసింది.
హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమతుల్ని పునరుద్ధరించామని హెచ్ఎండీఏ వెల్లడించింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. 2022లో ఆదిత్య కేడియా మంచిరేవులో 9.19 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతిని జారీ చేసిందని చెప్పారు. కోర్టు తీర్పుతో పలు మార్పులు, పరిశీలనలు చేసి అనుమతులు పునరుద్ధరించారు.
మినిస్టర్ క్వార్టర్స్లో డబుల్ బెడ్ రూం పట్టాలు పంపిణీ చేశారు. శుక్రవారం మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్పేట-134, బహుదూర్పురా-294, బండ్లగూడ-155, చార్మినార్-209, సైదాబాద్లో 206 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన అనంతనం పట్టాలు పంపిణీ చేసినట్లు పొన్నం తెలిపారు.
నవరాత్రులను పురస్కరించుకొని 11 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని మధురాపూర్ గ్రామంలో అమ్మవారికి 11రోజుల పాటు అలంకరణలో ఉపయోగించిన 11 చీరలకు వేలంపాటను నిర్వహించారు. వేలం పాటలో 11 చీరలను రూ.13,55,149కు గ్రామస్థులు దక్కించుకున్నారు. గతంలో వినాయకుడి లడ్డును కూడా రూ.12 లక్షలు దక్కించుకోవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.