RangaReddy

News April 11, 2026

RR: ALERT బాబోయ్ ఎండలు.. బయటకు రావద్దు!

image

RR జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రొద్దుటూరు, మహేశ్వరంలో 40.8, కేశంపేట 40.7, యాచారం, మొయినాబాద్ 40.6, షాబాద్ 40.5, చిలుకూరు 40.4, కందుకూరు, రాచలూరు 40.1, చౌదరిగూడెం 40.2, మంచాల, బోడకొండ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన అధికారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News April 10, 2026

ప్రత్యేక ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైళ్ల ఏర్పాటు

image

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు HYD నుంచి అయోధ్య, కాశీ, వైష్ణో దేవి, దక్షిణ భారతదేశ క్షేత్రాలను సందర్శించేలా 4 ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ టూర్లలో ప్రయాణం, హోటల్ వసతి, మూడు పూటలా భోజనం, గైడ్, భద్రతా సౌకర్యాలు కల్పిస్తుండగా, టికెట్ ధరలు రూ. 14,500 నుంచి రూ. 34,100 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల వారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

News April 8, 2026

ఆమనగల్లు: WOW.. వరి నాటుతున్న రాహుల్ గాంధీ, సీఎం

image

ఆమనగల్లు మండలం చింతలపల్లికి చెందిన చిత్రకారుడు రూపం వెంకట్‌రెడ్డి వేసిన చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైతు కుటుంబానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డికి రైతుల కష్టాలు తెలుసని, రైతు భరోసా పథకాన్ని రైతులందరికీ ఓకే సారీ అందించి ఆదుకోవాలని కోరుతూ రాహుల్ గాంధీ, సీఎం, రైతులతో కలిసి వరి నాటుతున్నట్లు చిత్రం రూపొందించారు. చిత్రకారుడి చిత్రాన్ని రైతులు స్వాగతిస్తూ హర్షిస్తున్నారు.

News April 5, 2026

రంగారెడ్డి: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ!

image

రంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు SBI RSETI సువర్ణావకాశం కల్పిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఏప్రిల్ 13 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో పాటు కోర్సు పూర్తయ్యాక ఉచితంగా టూల్‌కిట్ అందిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 7981951167, 9963562266 నంబర్లలో సంప్రదించాలన్నారు.

News April 4, 2026

రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

image

రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.

News April 4, 2026

సరూర్‌నగర్: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల వివరాలను సంఘం కార్యదర్శి గోపి వెల్లడించారు. 16 ఏళ్లు పైబడిన వారు, అలాగే అండర్-20 పురుషులు, మహిళా విభాగాల్లో ఈ క్రీడలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News April 2, 2026

RR: గ్రామసభలు ప్రజా సమస్యల కోసమా? ప్రచారం కోసమా?

image

గ్రామ సమస్యలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం జరగాల్సిన గ్రామసభలు పక్కదారి పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను చర్చించాల్సింది పోయి, అధికారులు కేవలం ప్రభుత్వ పథకాలకు ‘డప్పు’ కొట్టడానికే పరిమితమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలకు అందాల్సిన పథకాలు పైరవీకారుల పాలవుతున్నాయని, అధికారులు అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

News April 1, 2026

రంగారెడ్డి: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

News April 1, 2026

రంగారెడ్డి: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

News April 1, 2026

HYD: రూ.2,501 కోట్ల ఆస్తి పన్ను వసూలు

image

క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో 2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,501.25 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. భారీ బకాయిదారులకు వడ్డీపై 90 శాతం రాయితీ, ఓటీఎస్ సదుపాయాన్ని వివరించడం, ఇతరత్రా చర్యలతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే వంద కోట్లకు పైగా ఆస్తి పన్ను జీహెచ్ఎంసీ ఖజానాకు చేరినట్లు సమాచారం. కాగా, సరైన లెక్కలు నేడు స్పష్టం కానున్నాయి.