RangaReddy

News October 1, 2025

రంగారెడ్డి: ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలి: కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని రాజకీయ నేతల ఫొటోలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News September 30, 2025

రంగారెడ్డి జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు

image

రంగారెడ్డి జిల్లాలో 21 జడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్‌లో రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ 11న ఫలితాలు ప్రకటించనున్నారు. జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు ఉండగా.. 4,668 వార్డులు ఉన్నాయి. కాగా, రంగారెడ్డి జిల్లాలో ఫేజ్-1,2 విడతల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

News September 29, 2025

RR జెడ్పీ పీఠం అధిరోహించేది ఇక్కడి మహిళే..!

image

రంగారెడ్డి జిల్లాలో మొత్తం 21 ZPTC, 230 MPTC స్థానాలు, 526 GPలకు, 4668 వార్డ్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది RR జెడ్పీ కుర్చీకి ఎస్సీ మహిళా రిజర్వేషన్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కందుకూరు, షాబాద్ ZPTCలు SC మహిళలకు కేటాయించగా, చేవెళ్ల, శంకర్‌పల్లిలో SC జనరల్, చౌదరిగూడ, నందిగామ, అబ్దుల్లాపూర్‌మెట్‌కు జనరల్ కేటాయించడంతో ZP ఛైర్‌పై వీరిలో ఎవరు కూర్చుంటారో వేచి చూడాలి.

News September 28, 2025

రంగారెడ్డి జిల్లా పరిషత్‌లకు రిజర్వేషన్లు ఖరారు

image

రంగారెడ్డి జిల్లా పరిషత్‌లకు రిజర్వేషన్లు దాదాపు ఖరారయ్యాయి. జిల్లాలో 21 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. వీటిలో 9 చొప్పున బీసీలకు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఐదు స్థానాలను జనరల్ కేటగిరిలో, నాలుగు స్థానాలు ఎస్సీలకు, మూడు స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. అబ్దుల్లాపూర్ మెట్, చౌదరిగూడ, నందిగామ, శంషాబాద్, ఆమనగల్లు స్థానాలు జనరల్ కేటగిరీకి కేటాయించినట్లు తెలిసింది.

News September 28, 2025

RR: జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్

image

జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రిజర్వేషన్లకు సంబంధించి మహిళా రిజర్వేషన్ కోసం లాటరీ పద్ధతిన కేటాయింపు నిర్వహించారు. సంబంధిత రిజర్వేషన్ స్థానాల కేటాయింపు వివరాలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు.

News September 28, 2025

HYD: పునరావాస కేంద్రాలకు 1,467 మంది తరలింపు

image

మూసీ వరద బాధితుల కోసం 10 ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మలక్ పేట, అంబర్ పేట, గోషామహల్ సర్కిళ్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలకు ఇప్పటివరకు 1,467 మంది బాధితులను తరలించినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News September 28, 2025

రంగారెడ్డి జిల్లా వర్షపాతం ఇలా

image

రంగారెడ్డి జిల్లా వర్షపాతం ఇలా ఉంది. మొగలిగిద్దలో 21 మి.మీ, నందిగామ 15.3, షాద్‌ నగర్ 14.5, షాబాద్ 14, సంగెం 13.5, కాసులాబాద్ 10.8, రాజేంద్రనగర్ 9.8, ప్రొద్దుటూరు 9.5, మణికొండ 9, కొందుర్గ్ 8.3, ఖాజాగూడ 8, రాయదుర్గం, ఎల్బీనగర్ 7.5, చిల్కూర్ 7.3, కేతిరెడ్డిపల్లి 7, రెడ్డిపల్లె, మొయినాబాద్ 6.5, చందనవెల్లి 6.3, అలకాపురి 6, శాస్త్రిపురం 5.3, పెద్దఅంబర్‌పేట్‌లో 5 మి.మీ వర్షపాతం నమోదైంది.

News September 26, 2025

HYD: ప్రేమించిన యువతికి పెళ్లి.. యువకుడి సూసైడ్

image

హయత్‌నగర్ PS పరిధిలో అనిల్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. మెదక్ జిల్లాకు చెందిన అనిల్ సామానగర్‌లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి మరో యువకుడిని పెళ్లి చేసుకుందని తన పుస్తకంలో రాసి ఆత్మహత్య చేసుకొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 25, 2025

HYD: రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో MURDER

image

HYDలో మరో దారుణం వెలుగుచూసింది. మియాపూర్ PS పరిధి నాగార్జున ఎన్‌క్లేవ్‌లోని రఫా రీహాబిలిటేషన్ సెంటర్‌లో మర్డర్ జరిగింది. డ్రగ్స్‌కు బానిసైన సందీప్‌(39) ఇక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. ఇదే సెంటర్‌లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన నల్గొండ జిల్లాకు చెందిన సులేమాన్, బార్కస్ వాసి ఆదిల్‌తో గొడవ జరిగింది. ఇరువురు కలిసి సందీప్‌‌ను కొట్టి చంపేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 24, 2025

రాజేంద్రనగర్‌లో కత్తితో గొంతుకోసి హత్య

image

రాజేంద్రనగర్‌లో బుధవారం ఉదయం ఓ వ్యక్తి డెడ్‌బాడీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏసీపీ శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు వెల్లడించారు. కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని, ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్వక్తి బండ్లగూడకు చెందిన మీనాస్ ఉద్దీన్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.