India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్కం చెరువు పరిసరాల్లో వరద పోటెత్తడానికి గల కారణాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్షించారు. వరద ముంచెత్తడానికి కారణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. చెరువుకు వచ్చే వరద పెద్ద మొత్తంలో ఉండి, బయటకు వెళ్లే ఔట్ ఫ్లో ఆ స్థాయిలో లేకపోవడంతో సమస్య తలెత్తుతుందని అధికారులు తెలిపారు. మల్కం చెరువు చుట్టూ వరద నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను హైడ్రా కమిషనర్ సూచించారు.
బాలాపూర్ మండలం మల్లాపూర్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులను మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం పాలన కొనసాగుతుందని, రంగారెడ్డి జిల్లాలో 12 వేల కొత్త రేషన్ కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు.
నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ను సందర్శించారు. వాటర్ లాగింగ్స్, కూలిన చెట్లకు సంబంధించి అందిన ఫిర్యాదుల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వాటర్ లాగింగ్స్కు సంబంధించిన 164 ఫిర్యాదుల అందినట్లు ఆయన వివరించారు.
ఆగస్టు 11న జరిగే జాతీయ నులిపురుగుల దినోత్సవంలో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని RR కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో DMHO వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఆల్బెండజోల్ మాత్రలు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. లేదంటే నులిపురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత ఏర్పడతాయన్నారు.
రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ(DEET)ను ప్రారంభించిందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో DEET పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రైవేట్ రంగంలో నిరంతర ఉపాధి లక్ష్యంగా ప్రారంభించిన DEETలో వెంటనే నమోదు చేసుకోవాలన్నారు.
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొంగరకలాన్లోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 82 ఫిర్యాదులకు వచ్చాయని, వాటిని పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా చంద్రారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొంగరకలాన్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించగా, ప్రస్తుతం ప్రతిమా సింగ్ మెటర్నిటీ సెలవుల్లో ఉండడంతో చంద్రారెడ్డిని జిల్లా అదనపు కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.
రంగారెడ్డి జిల్లాలో జనాభా శరవేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు,11,92,081 మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 35,23,219కు చేరింది. జిల్లా పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 13 ఏళ్లలో జనాభా 48 లక్షలకు చేరిందని అంచనా.
కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటివరకు తులసీ రామ్, చాకలి బొజయ్య, నారాయనమ్మ, స్వరూప (56)తో కలిపి నలుగురు మృతి చెందారు. కల్తీ కల్లు తాగడంతో నిన్న సాయంత్రం నుంచి అస్వస్థతకు గురై 19 మంది ఆస్పత్రిలో చేరారు. బాధితులందరినీ నిమ్స్కు తరలించగా.. చికిత్స పొందుతూ కాసేపటి క్రితం ఆమె మృతి చెందింది. మృతుల సంఖ్య పెరగుతుండటంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.