India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనగామ కలెక్టర్ కార్యాలయంలో సీడీపీఓలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ లతో ఎస్ఎస్ఎఫ్పీ కార్య నిర్వహణపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లో టీచర్లు పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్ని గుర్తించి, ప్రతి 15 రోజులకోసారి సరైన పద్ధతిలో బరువులు, ఎత్తు కొలతలను తీసి ఆన్లైన్లో సరైన విధంగా నమోదు చేయాలన్నారు. సీడీపీఓలు రమాదేవి, మహేశ్ తదితరులున్నారు.
MHBD: బీఆర్ఎస్ ముఖ్య నేతల అక్రమ అరెస్ట్లను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రశ్నించే వారిపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుతూనే ఉంటామన్నారు.
MHBD: ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో షెడ్యూల్డ్ తెగల కోసం రాజ్యాంగపరమైన రక్షణలు, సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు, మహబూబాబాద్ జిల్లా వాసి జాటోత్ హుస్సేన్ నాయక్ సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు అంకితభావంతో పని చేయాలని హుస్సేన్ నాయక్ పిలుపునిచ్చారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర ఊరటనిచ్చింది. గత నాలుగు నెలలుగా మార్కెట్లో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు పత్తి అధిక ధర పలికింది. మార్కెట్లో సోమ, మంగళవారాలలో క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా బుధవారం రూ.7,800, గురువారం రూ.7,790కి చేరింది. కాగా, నేడు రూ.7,940 ధర రికార్డు స్థాయిలో పలికింది.
ప్యారిస్లో జరిగిన పారాలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జివాంజి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంస్య పథకం సాధించిన దీప్తిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, కోచ్లు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్లోని ఎనుమాముల మార్కెట్కు వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల తెలిపారు. ఈనెల 14న శనివారం వారాంతపు యార్డు బందు, 15న ఆదివారం కాగా, 16న సోమవారం వినాయక నిమజ్జనం సందర్భంగా, 17న మంగళవారం మిలాద్ ఉన్ నబీకి సెలవు ఉందన్నారు. తిరిగి 18న మార్కెట్ పున:ప్రారంభం అవుతుందన్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతోపాటు సుందరీకరణ చేపట్టడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ KUDA అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన రవీందర్(35) రేగొండ నుంచి కొత్తపల్లికి బైకుపై వెళ్తుండగా భూపాలపల్లి నుంచి వస్తున్న RTC బస్సు ఢీకొట్టింది. దీంతో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకీ చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో-చైర్మన్గా మంత్రి దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా ములుగు జిల్లాకు చెందిన సీతక్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవిలు నియమాకం అయ్యారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల MLAలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ MP కడియం కావ్య సంతాపం వ్యక్తం చేశారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ మాజీ సభ్యుడిగా సీతారాం ప్రజల పక్షాన పోరాడిన గొప్ప నాయకుడని ఎంపీ వివరించారు. ఏచూరి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వారు చెప్పారు.
Sorry, no posts matched your criteria.