India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకతీయ యూనివర్సిటీ స్టేషన్ పరిధి గోపాల్పూర్ శివసాయి కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వేలేరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ శివసాయి కాలనీలో ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువచ్చి ఏడాదిగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, కేయూ పోలీసులతో కలిసి ఆ గృహంపై దాడి చేసి ఆమెను అరెస్టు చేశారు.
ప్రభుత్వం HYD రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ధీర వనిత ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
కాలం చెల్లిన వాహనాలను నడిపితే సంబంధిత వాహనదారులపై తగిన చర్యలు తీసుకుంటామని జనగామ ఏసీపీ పార్థసారధి వాహనదారులను హెచ్చరించారు. మంగళవారం రాత్రి నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డెన్ చర్చిలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, సహజ వనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రేపు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అడవుల సంరక్షణకై ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అటవీ సంపద సంరక్షణకు, వన్యప్రాణుల పరిరక్షణకు ఉద్యోగులు చేస్తున్న కృషిని ప్రశంసించారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారని, పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక, ఈ పోరాటానికి ప్రపంచ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉందని కేటీఆర్ ఓ ప్రత్యేక ఫొటోను ట్వీట్ చేశారు.
వంగరలోని ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేడు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అన్ని విభాగాలను సందర్శించి వాటికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు.
మేడారం జాతరకు శాశ్వత అభివృద్ధి పనుల ప్రతిపాదన సిద్ధం చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీతతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మేడారం జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. గద్దెల ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహించాలన్నారు.
వరంగల్ నగరంలో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. మంగళవారం నిమజ్జనానికి సంబంధించిన చెరువులను, పరిసర ప్రాంతాలను సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి నందిరాం నాయక్, CI గోపి, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిస్తున్నాయి. మార్కెట్లో ఈరోజు క్వింటా పత్తి ధర నిన్నటి లాగే రూ.7,700 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధర మరింత పెరిగేలా వ్యాపారులు చొరవ తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పైడిపల్లికి చెందిన స్వాతికి అదే గ్రామానికి చెందిన నిరంజన్తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత నుంచి ఆమె భర్త, అత్త కట్నం తీసుకురమ్మని వేధించేవారు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగినా వేధించడం మానకపోయేసరికి ఈ నెల 5న గడ్డి మందు తాగింది. MGMలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.