India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNR వారు అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, జర ఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనే పదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు వరద నీరు 192 కి.మీ ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘పాకాల’ వాగు.. ప్రవాహ క్రమేణా ‘మున్నేరు’గా మారి ఏపీలోని కంచికచర్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతం సముద్రంలో కలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంత రైతులకు, ప్రజలకు పాకాల నీరు జలవనరుగా ఉంది.
రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మైనర్లతో పాటు ఎలాంటి లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే వారిపై చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో మైనర్లను ప్రోత్సహించిన, వాహనాలు అందజేసినా యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
తెలంగాణ ప్రజలను కోటీశ్వరులుగా చూడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆశయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలనలో ఏ అధికారి, నాయకుడికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా డబ్బులు అడిగితే 80961 07107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీతలో భాగంగా నల్లమట్టి కావాల్సిన వారు నక్కలగుట్ట ఇరిగేషన్ సర్కిల్-2 కార్యాలయంలో సంప్రదించాలని ఈఈ శంకర్ తెలిపారు. ఒక క్యూబిక్ మీటరు మట్టికి రూ.71.83 డీడీ తీసి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాల కోసం సహాయ కేంద్రం నంబర్ 94406 38401ను సంప్రదించాలన్నారు. నల్లమట్టి పంట పొలాలకు ఎరువులా ఉపయోగపడుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వేయి స్తంభాల గుడి, కాకతీయ కళా తోరణం, ఖిలా వరంగల్, కోటలు, పలు గ్రామాల్లో వారు నిర్మించిన శివాలయాలు, ఇతర దేవాలయాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాగా, నేడు అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం.
మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందుకు 949ఎకరాలు అవసరమవగా 696ఎకరాలు సేకరించారు. మరో 253ఎకరాల కోసం 3గ్రామాలను ఒప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడి భూముల ధరలు అమాంతం పెరగడంతో ఎకరాకు రూ.5కోట్లు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్టు అంశం పట్టాలు తప్పినట్లేనా అని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. సమస్యను క్లియర్ చేసి త్వరగా నిర్మించాలని కోరుతున్నారు.
KCR సెంటిమెంట్ జిల్లాలైన KNR, WGL జిల్లాల మధ్యలో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. 50వేలకు పైగా వాహనాలు వస్తాయనే అంచనాతో 169ఎకరాలు సభకు, మిగతాదంతా(1,331) పార్కింగ్కు కేటాయించారు. 300 LED స్క్రీన్లు, 15లక్షల మజ్జిగ, 15లక్షల వాటర్ ప్యాకెట్లు, తాత్కాలిక ఆస్పత్రి, అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఓరుగల్లులోని చూడదగ్గ పర్యాటక ప్రాంతాల్లో ఖిలా వరంగల్ ఒకటి. ఇక్కడ చూసేందుకు అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఖుష్ మహల్ ప్రత్యేకం. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఖుష్ మహల్ తుగ్లక్ పాలన కాలంలో నిర్మించారు. ఈ నిర్మాణంపై ఇప్పటికీ తుగ్లక్ నిర్మాణ శైలి జాడలు కనిపిస్తాయి. ఢిల్లీలోని ఘియాత్ అల్ దిన్ తుగ్లక్ సమాధి, ఖుష్ మహల్ మధ్య నిర్మాణ సారూప్యత ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ కట్టడాన్ని చూసారా.. కామెంట్ చేయండి.
కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మామునూర్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గుంటూరుపల్లికి చెందిన పెనుముచ్చు శ్రీనివాస్ (45) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. అతడి భార్య శ్వేత చూసి ఇంటి పక్కన ఉన్న వారికి సమాచారం ఇవ్వగా.. అప్పటికే చనిపోయాడు. శ్రీనివాస్ తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.