India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేటి ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగింది. మొత్తం 20,101 మంది పిల్లలకు లక్ష్యంగా, 19,546 మందికి పోలియో వ్యాక్సిన్ వేసి 97 శాతం రికార్డు సాధించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.సాంబశివరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పక వేయించాలన్నారు.
వరంగల్ జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటైంది. నిన్నటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న జిల్లా నేటి నుంచి పదో వసంతంలోకి అడుగు పెట్టింది. కాగా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత అభివృద్ధి పనులు జరిగాయని కొందరు.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మరికొందరు అంటున్నారు. గ్రామీణ రోడ్లు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, హాస్టళ్లు సరిగా లేవని చెబుతున్నారు. మీ జిల్లా అభివృద్ధి అయ్యిందా కామెంట్ చేయండి.
జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు 8 నెలలుగా కోడిగుడ్ల బిల్లులు అందడం లేదు. మొత్తం 344 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 13,725 మంది విద్యార్థులు చదువుతుండగా వారికి ప్రతి రోజూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు భోజనం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.3 వేల వేతనం చెల్లిస్తోంది. భోజనానికి బిల్లులను తరగతుల వారీగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విడుదల చేస్తోంది.
పర్వతగిరి మండల కేంద్రంలోని పర్వతాల శివాలయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ జీవే రాముడు దర్శించుకున్నారు. పూజారి హర్షవర్ధన్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన కల్లెడకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్ రావు.. రాములుకు ఆలయ విశిష్ఠతను తెలియజేశారు. ఆలయంతో పాటు పరిసరాలను పరిశీలించారు. రాములు పర్యటన సందర్భంగా ఎస్సై ప్రవీణ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్కు శుక్రవారం చిరు ధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మక్కల ధర పెరగగా, పల్లికాయ ధర తగ్గింది. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,130 ధర పలకగా.. ఈరోజు రూ.2,160 చేరింది. సూక పల్లికాయకు గురువారం రూ.6,500 ధర రాగా.. నేడు రూ.5,900కి పడిపోయింది. పచ్చి పల్లికాయకు నిన్న రూ.4,000 ధర పలకగా.. శుక్రవారం రూ.4,100 అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. దీపిక రకం మిర్చికి రూ.14 వేలు వచ్చింది.
ఆర్టీఐ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందని డీఐఈవో డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం వరంగల్లోని ఏవీవీ జూనియర్ కాలేజీలో ఆర్టీఐపై నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలను అయన పరిశీలించారు. సమాచార హక్కు చట్టం-2005 అనేది ప్రజలకు సమాచారాన్ని పొందడంలో వజ్రాయుధంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి 20 ఇండ్లు పూర్తయినందున ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం చిరుధాన్యాలు ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,140 ధర పలకగా.. ఈరోజు రూ.2,130 చేరింది. సూక పల్లికాయకు నిన్న రూ.6,610 ధర రాగా.. గురువారం రూ.6,500 వచ్చింది. పచ్చి పల్లికాయకు బుధవారం రూ.4,100 ధర పలకగా.. ఈరోజు రూ.4వేలు అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.
ఆర్టీఐ ద్వారా సుపరిపాలన అనే అంశంపై వరంగల్ జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో సమాచార హక్కు చట్టం-2005పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. రంగశాయిపేట, కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించి విద్యార్థులకు బహుమతులను అందించారు. సమాచార హక్కు చట్టం-2005 ప్రజలకు సమాచారాన్ని పొందడంలో అస్త్రంగా ఉపయోగపడుతుందన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నామినేషన్లకు మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు మాత్రం ఇంకా నామినేషన్ల దాఖలుకు ముందుకు రావడం లేదు. పార్టీల అభ్యర్థులు తేలకపోవడం, మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో పెండింగ్లో ఉండటంతో అభ్యర్థులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మొదటి రోజు జిల్లాలో నామినేషన్లు తక్కువగానే రానున్నాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తేజా మిర్చి(ఏసీ) క్వింటాకు రూ.14,700 ధర పలకగా.. ఈరోజు రూ.14,500కి తగ్గింది. 341 రకం మిర్చి(ఏసీ)కి నిన్న రూ.16,200 ధర వస్తే.. నేడు రూ.16,300 అయ్యింది. మరోవైపు వండర్ హాట్(WH) ఏసీ మిర్చికి బుధవారం రూ.16 వేలు ధర వస్తే.. గురువారం రూ.16,800 అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.