Warangal

News September 27, 2024

వరంగల్ పోలీస్ కమీషనరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపుజీ జయంతి వేడుకలు

image

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పరిపాలన భవనం ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News September 27, 2024

HNK: ‘మహనీయులకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం’

image

బాపూజీ లాంటి మహనీయులకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఎంపీ కావ్య పాల్గొన్నారు. బాపూజీ లాంటి నాయకులు చేసిన పోరాటాల నుండి ప్రతీ ఒక్కరూ స్ఫూర్తి పొందాలని సూచించారు.

News September 27, 2024

పర్యాటకానికి కేరాఫ్ మన ఓరుగల్లు!

image

ఉమ్మడి వరంగల్‌‌కు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. టూరిస్ట్ డే సందర్భంగా జిల్లాలోని ప్రాంతాలను ఈరోజు గుర్తు చేసుకుందాం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పతో పాటు వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, లక్నవరం, బొగత, పాండవుల గుట్ట, పాకాల, భద్రకాళి ఆలయం, మల్లూరు, భీమునిపాదం మొదలైనవి. అడవులు, కాకతీయులు ఏలిన ప్రాంతం కావడంతో పర్యాటకం వెలుగొందుతోందని చెప్పొచ్చు.మరి మీకు ఎక్కువగా వెళ్లిన ప్రాంతాన్ని కామెంట్ చేయండి.

News September 27, 2024

మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి: పెద్ది

image

గత ప్రభుత్వంలో నర్సంపేటకు మంజూరు చేసిన మిర్చి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి శుక్రవారం పెద్ది బహిరంగ లేఖను రాశారు. నర్సంపేటకు మంజూరైన మిర్చి పరిశోధన కేంద్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో రైతులకు అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు.

News September 27, 2024

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి నిన్నటిలాగే రూ.16,500 ధర పలికింది. అలాగే తేజ మిర్చి గురువారం రూ.18,300 ధర పలకగా నేడు రూ. 19,200కి పెరిగింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.17వేలు ధర రాగా నేడు కూడా అదే ధర వచ్చింది. ధరలు స్వల్పంగా పెరగడంతో రైతన్నలకు ఊరట లభించినట్లు అయింది.

News September 27, 2024

వరంగల్: పడిపోయిన కొత్త పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు కొత్త పత్తి భారీగా తరలి వచ్చింది. అయితే ధర మాత్రం గురువారంతో పోలిస్తే నేడు తగ్గింది. నిన్న కొత్త పత్తి క్వింటాకు రూ.7,070 పలకగా నేడు రూ.7,025కి పడిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. పత్తి ధరలు రోజురోజుకూ తగ్గిపోతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

News September 27, 2024

18 నుంచి LLB రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ విశ్వవిద్యాలయ ఐదేళ్ల LLB (రెండో సెమిస్టర్) పరీక్ష టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ BSL సౌజన్య విడుదల చేసారు. మొదటి పేపర్ అక్టోబర్ 18న, 2వ పేపర్ అక్టోబర్ 22న, 3వ పేపర్ అక్టోబర్ 24న, 4వ పేపర్ అక్టోబర్ 26న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు. వివరాలను విశ్వవిద్యాలయ వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.

News September 27, 2024

కేయూ LLB సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్

image

KU మూడేళ్ల LLB (2వ సెమిస్టర్) & 5 సం.ల (6వ సెమిస్టర్) పరీక్ష టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సౌజన్య విడుదల చేసారు. మొదటి పేపర్ అక్టోబర్ 17న, 2వ పేపర్ అక్టోబర్ 19న, 3వ పేపర్ అక్టోబర్ 21న, 4వ పేపర్ అక్టోబర్ 23న, 5వ పేపర్ అక్టోబర్ 25న, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య జరుగుతాయన్నారు. వివరాలు www.kakatiya.ac.in లో చూడవచ్చన్నారు.

News September 27, 2024

BREAKING: ములుగు జిల్లాలో అటవీ అధికారులపై దాడి

image

ములుగు జిల్లాలో దారుణం జరిగింది. తాడ్వాయి రేంజ్ పరిధి దమరవాయి అటవీ ప్రాంతంలో కొందరు అక్రమంగా చెట్లను నరికి వేస్తుండగా అటవీశాఖ అధికారులు వినోద్, శరత్ చంద్ర, సుమన్ అడ్డుకున్నారు. దీంతో వారిపై JCB ఓనర్ సూరజ్ రెడ్డి మరో ఇద్దరితో కలిసి విచక్షణా రహితంగా ఇనుప రాడ్లతో దాడి చేశాడని అటవీ అధికారులు చెప్పారు. వారి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అటవీ అధికారులు చెప్పారు.

News September 27, 2024

వరంగల్: 274 మందికి డీఎస్సీ కౌన్సెలింగ్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 274 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్జీటీ ఉద్యోగాల నియామకానికి నేటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నేటి నుంచి అక్టోబర్ 5 వరకు హనుమకొండలోని డీఈవో ఆఫీసులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు చెప్పారు. అర్హులు వారి సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.