India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2022, 2023లో వచ్చిన జంపన్న వాగు వరదలను, వాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం వరదల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే ప్రతి మండలానికి ఫ్లడ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రెండు నెలల ముందే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ముందస్తుగా అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి సీతక్క అన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఆదివారం వరంగల్ నగరంలోని బీఆర్ నగర్, బృందావన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, పద్మా నగర్, సాయి గణేశ్ కాలనీలో క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వరదలో మహిళ మృతదేహం కొట్టుకు వచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మండల వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. దీంతో మండల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
అల్పపీడన ద్రోణితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అన్నారు. విద్యుత్ పోల్సు ముట్టుకోరాదని తెలిపారు. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండవద్దన్నారు. సహాయం కొరకు 040-21111111 మరియు 9000113667 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్లో మంత్రి సురేఖ పోస్ట్ చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు జలమయమయ్యాయి. మహబూబాబాద్, ములుగు, తొర్రూరు, ఏటూరునాగారం, బయ్యారం, గార్ల, కొత్తగూడ తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. వాగులు, చెరువుల దగ్గర అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఉమ్మడి WGL జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాష్ట్రంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. ఇనుగుర్తిలో 298 మి.మీ వర్షపాతంలో రాష్ట్రం ఎక్కువ రైన్ పాల్ ప్రాంతాల్లో రెండోదిగా ఉంది. దంతాలపల్లిలో 294, మల్యాలలో 294, మరిపెడలో 291, పెద్ద నాగరంలో 288, అయ్యగారి పల్లిలో 286, చిన్న గూడూరులో 285, కల్లెడ(పర్వతగిరి)లో 266, MHBDలో 266, రెడ్లవాడ(నెక్కొండ)లో 259, తాడ్వాయిలో 250, తొర్రూరులో 250మి.మీల కురిసింది.
> JN: ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ శాఖ డీఈ
> HNK: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం
> MLG: పస్రా-తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై వాగు ప్రవాహం
> MLG: బొగత జలపాతం సందర్శన నిలిపివేత
> JN: వేప చెట్టు కొమ్మ నుంచి నీరు
> WGL: పలు రైళ్ల రద్దు
> MHBD: అంధకారంలో ఏజెన్సీ గ్రామాలు
> BHPL: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
> MLG: ప్రయాణికులను వాగు దాటించిన ఎస్సై
భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తక్షణ స్పందన నిమిత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య శనివారం తెలిపారు. భారీ వర్షాలకు సంబంధించి బాధితులు కంట్రోల్ రూమ్లోని టోల్ ఫ్రీ నెంబర్ 18004251115ను సంప్రదించవచ్చని తెలిపారు. బాధితులకు అండగా ఉండేందుకు కంట్రోల్ రూమ్లో సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ కలెక్టర్ ఆదేశాలమేరకు, వరంగల్ MRO కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటుచేసినట్టు MRO మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. అదేవిధంగా వరంగల్ మండలంలో ముంపు ప్రాంతాలైన ఏనుమాముల, శ్రీనగర్ బాలాజీ నగర్, చాకలి ఐలమ్మ నగర్, హంటర్ రోడ్ ప్రాంతం, సాయినగర్, NTRనగర్ లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలో 18004253424, 701362828, 9948225160 వివరాలు తెలపాలన్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ విద్యుత్ శాఖ డీఈ ఏసీబీకి చిక్కారు. అధికారుల ప్రకారం.. 33 కేవీ లైన్ షిఫ్టింగ్ కొరకు కుంభం ఎల్లయ్య అనే రైతు వద్ద విద్యుత్ శాఖ డీఈ హుస్సేన్ రూ.20,000 లంచం అడిగాడు. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.