India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. అక్టోబర్ తర్వాత వర్షాలు లేకపోవడం, యాసంగి పనులు మొదలు పెట్టడంతో నీటి వినియోగం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. HNK జిల్లాలో ఫిబ్రవరిలో 6.30 మీటర్ల లోతుకు నీరు పడిపోగా.. మార్చి చివరి నాటికి 7.16 మీటర్ల లోతుకు పడిపోయింది. WGL జిల్లాలో డిసెంబర్లో 4.18కు పడిపోగా.. మార్చి చివరి నాటికి 6.32 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.
హన్మకొండ జిల్లాకు చెందిన వేద పాఠశాల విద్యార్థి <<15990250>>నిర్మల్(D)లో మృతి<<>> చెందినవిషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. శాయంపేటకు చెందిన మణికంఠ 2ఏళ్ల క్రితం బాసరలోని వేద పాఠశాలలో చేరాడు. అయితే నిన్న గోదావరినదికి హారతి ఇవ్వడానికి నదిలోని బోరుబావి మోటార్ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. కాగా, మణికంఠ బర్త్ డే తర్వాతి రోజే ఈఘటన జరిగింది. మణికంఠ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి రోలి సింగ్తో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవల వరంగల్కు CGHS వెల్నెస్ సెంటర్ మంజూరైనప్పటికీ వైద్య అధికారులు, పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సేవలు నిలిచిపోయాయని రోలి సింగ్కు వివరించారు. CGHS వెల్నెస్ సెంటర్ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.
అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, టెక్స్టైల్ పార్క్ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల MLA అధ్యక్షతన జరిగిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇండస్ట్రీల్లో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
నిర్మల్ జిల్లా బాసర వేద భారతి విద్యాలయంలో కరెంట్ షాక్తో విద్యార్థి మృతిచెందాడు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్తో మృతిచెందటం ఆందోళనకరం. ఘటనపై బాసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్కు పుష్-పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారి పనుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైళ్లను నడపాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్కు పుష్-పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారి పనుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైళ్లను నడపాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
వరంగల్ జిల్లాలో విద్యార్థులు, యువతపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు, మేధావులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ముగియడంతో పిల్లల కదలికలు, అలవాట్లు, మొబైల్ వాడకంపై నిఘా పెట్టాలంటున్నారు. జిల్లాలో ఇప్పటికే గంజాయి, బోనోఫిక్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడుతున్నారని, వ్యసనంగా మారి అనర్థాలకు దారి తీయకముందే అదుపు చేయాలని కోరుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో రెన్యువల్ కాకుండా మిగిలిన 4 బార్లకు సంబంధించి మళ్లీ లైసెన్స్లు జారీ చేయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. అర్హులు, ఆసక్తి గలవారు ఈనెల 26 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 29న కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా బార్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.