India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. శనివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వర్ష ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై టెలీ కాన్ఫరెన్స్ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో రాజన్న ఆలయం రద్దీగా మారింది. అయితే దర్శనానికి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేయడంతో నీరు మురికిగా మారాయి. నీరు పచ్చబడినట్లు భక్తులకు కనిపించడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు స్పందించి పచ్చబడ్డ నీరు తొలగించాలని కోరుతున్నారు.
శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో రాజన్న ఆలయం రద్దీగా మారింది. అయితే దర్శనానికి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేయడంతో నీరు మురికిగా మారాయి. నీరు పచ్చబడినట్లు భక్తులకు కనిపించడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు స్పందించి పచ్చబడ్డ నీరు తొలగించాలని కోరుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 పురపాలికలకు అమృత్ 2.0 పథకం అమలుకు నిధులు కేటాయించారు. పురపాలికల్లో రక్షిత, సుస్థిర తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రెండేళ్ల కిందటే ప్రతిపాదన కార్యరూపం దాల్చగా, ఎన్నికల కోడ్ కారణంగా పనులు ప్రారంభం కాలేదు. కొత్త సర్కార్ పథకం కార్యాచరణకు ఆమోదం తెలపడంతో అవాంతరాలు తొలగిపోయాయి. టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో ఇక పనులు ప్రారంభం కానున్నాయి.
WGL-హసన్పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ SEP 23- OCT 8, విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ SEP 25 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ SEP 23 నుంచి OCT 7 వరకు అంతరాయం కలగనుంది.
ములుగు జిల్లాలో సెప్టెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని సమాచారం. అందులో భాగంగా అధికార యంత్రాంగం సీఎం పర్యటనకు సమాయత్తమవుతున్నారు. జిల్లా అభివృద్ధిపై సమీక్ష, సమావేశాలు, పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో సీఎం పాల్గొననున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలిసింది.
> MLG: రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి > MHBD: హైడ్రా తరహాలో మాడ్రాను ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యే > WGL: మార్కెట్లో తగ్గిన పత్తి మిర్చి, ధరలు > MLG: జిల్లాలో పర్యటించిన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క > HNK: టిమ్స్ ఆస్పత్రి వ్యయం పెంపుపై విచారణకు సీఎం ఆదేశం > MHBD: శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> WGL: కిడ్నీ వ్యాధితో బాధపడుతూ యువ రైతు మృతి
> MHBD: ఇంట్లో భారీగా నగదు అపహరణ
> BHPL: మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
> MLG: గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్, కేసు నమోదు
> BHPL: ఇసుక తరలిస్తున్న లారీ, ట్రాక్టర్ పట్టివేత
> HNK: జిల్లా కేంద్రంలో కారు బీభత్సం.. పలువురికి గాయాలు
> WGL: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు
> MHBD: బట్టల షాపులో చోరీ
తెలంగాణలో న్యాయ కోర్సు LLM కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కోరుతున్నారు. రాష్ట్రంలో శుక్రవారంతో LLM కౌన్సెలింగ్ పూర్తి కానుంది. కానీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని LLB విద్యార్థులకు ఇటీవలే ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి అవ్వగా, ఫలితాలు వెలువడలేదు. దీంతో తామంతా నష్టపోతామని వాపోతున్నారు. కేయూ LLB ఫలితాలు వచ్చిన తర్వాతే LLM సీట్లు కేటాయించాలని అధికారులను కోరుతున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈరోజు కొత్త పత్తి తరలివచ్చింది. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి అనంతరం వచ్చే ఈ పత్తి ఈసారి నెల ముందుగానే మార్కెట్కు వచ్చింది. అయితే రైతులు ఆశించిన విధంగానే ధర వచ్చింది. ఈ క్రమంలో క్వింటా కొత్త పత్తి ధర రూ.7011 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. రేపటి నుంచి మార్కెట్కి వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.