India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బుధవారం వర్ధన్నపేటలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద సినీ ఫక్కీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. నందనం భారతమ్మ అనే వృద్ధురాలిని నమ్మించి ఓ వ్యక్తి రూ.3లక్షలు దోచుకెళ్లాడు. కాగా, నిందితుడి ఫోటోను వర్ధన్నపేట పోలీసులు విడుదల చేశారు. అతడి వివరాలు తెలిపితే రూ.10వేల నగదు ఇస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ రావు తెలిపారు.
భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
హనుమకొండ పోస్టల్ కాలనీలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ఇంటిపై సుబేదారి పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేస్తున్నారని పోలీసుల తెలిపారు. ఇందులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్స్, రూ.2,450 నగదు స్వాధీనపరచుకున్నామని ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంక్ & డ్రైవ్లో పట్టుబడిన 17 మందిని బుధవారం కోర్టులో హాజరు పరిచారు. ఇందులో 16 మందికి మేజిస్ట్రేట్ అబ్బోజు వేంకటేశం రూ.18,000 జరిమానా విధించారు. ఒక్కరికి జైలు శిక్ష పడగా పరకాల సబ్ జైలుకి పంపించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరికీ రూ.1000 ఫైన్ విధించినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటా ధర రూ.28వేలు, సింగిల్ పట్టికి రూ.28,011 పలికింది. దీపిక మిర్చి క్వింటా ధర రూ.12,500, 1048 రకం మిర్చికి రూ.10వేలు, 5531 మిర్చికి రూ.9వేలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు. .
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM సరిపోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన ఎండి.విలాయాత్ అలి(25) ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో సత్తాచాటాడు. 489.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 86వ ర్యాంక్, జోనల్ స్థాయిలో Bc-E కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించాడు. తనకు డిప్యూటీ కలెక్టర్ వచ్చే అవకాశం ఉందని విలాయత్ తెలిపారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను.. తల్లితండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్-1లో రాష్ర్టస్థాయిలో రానిచ్చినట్లు పేర్కొన్నాడు.
ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో BRS సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సభకు మీరు వెళ్తున్నారా?
రాయపర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఈ పథకం అందేలా నిరంతరం పనిచేస్తున్నామని, ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాన్ని అందించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన వాచ్మెన్ కుమారుడు గ్రూప్-1 ఆఫీసర్గా ఎంపికయ్యాడు. మామునూరుకు చెందిన జయ-రవికుమార్ దంపతుల కుమారుడు రాహుల్ ఇటీవల TGPSC విడుదల చేసిన గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో 555వ ర్యాంక్, మల్టీ జోన్-1 SC కేటగిరీలో 23వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 2023-2024లో టీజీపీఎస్సీ నిర్వహించిన ఏవో, జేఏఓ ఎగ్జామ్లో రాహుల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ)గా ఎన్నికయ్యారు.
Sorry, no posts matched your criteria.