India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలోని పలు చోట్ల నేడు పొగమంచు కమ్ముకుంది. ఈ క్రమంలోనే నెక్కొండ మండలంలో ఈరోజు తెల్లవారుజామున పొలం పనులకు, స్కూళ్లకు, అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. అలాగే మధ్యాహ్నం సమయంలో భానుడు సైతం తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని, ఎండ దంచి కొడుతుందని ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో విచిత్ర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.
ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను పరిశీలించి, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి ఆమె స్వయంగా అర్జీలను స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,305 ధర పలికింది. గతవారం రూ.2,400కు పైగా పలికిన మొక్కజొన్న ధర ఈవారం తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. అలాగే చాలా రోజుల తర్వాత ఈరోజు మార్కెట్కు కొత్త పసుపు తరలిరాగా.. రూ.7,607 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోల్లు-అమ్మకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
తీగరాజుపల్లి వద్ద గల SRSP కాలువలో పడి మేచరాజుపల్లికి చెందిన ముగ్గురు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన జరగడం రెండోసారి కావడంతో జిల్లా ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని అక్కడక్కడ SRSP కాలువ పక్కన గల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు,స్థానికులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గొంతులో పల్లీ ఇరుక్కుని MHBD జిల్లా గూడురు మండలంలో <<15703711>>బాలుడు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. నాయకపల్లికి చెందిన వీరన్న, కల్పనలకు ఇద్దరు కూతుళ్ల తర్వాత 3వ సంతానం కొడుకు అక్షయ్(18 నెలలు). ఈనెల 7న బాలుడు పల్లి గింజను మింగాడు. దగ్గడం గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు. MGMలో చికిత్స పొందుతూ శ్వాస ఆడక ఆదివారం మృతి చెందాడు.
WGL జిల్లాలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం మామునూరులో దాదాపు రూ.2కోట్లకు పైనే ధర పలుకుతున్నట్లు రియల్ వర్గాలు చెబుతున్నాయి. భూ నిర్వాసిత గ్రామాల రైతులు మాత్రం ఎకరాకు రూ.5 కోట్లు ఇవ్వాలని, తమ గ్రామం నుంచే హైవే వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
వరంగల్లో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.160 నుంచి రూ.170 వరకు ధర పలకగా.. విత్ స్కిన్ కేజీ రూ.140, లైవ్ కోడి రూ.100 పలుకుతోంది. సిటీకి పల్లెలకు రూ.10-20 తేడా ఉంది. గత 2 వారాల క్రితం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చాలా మంది మటన్, చేపల దుకాణాల వైపు మొగ్గుచూపగా మళ్లీ వారం రోజుల నుంచి చికెన్ అమ్మకాలు పెరిగాయని, షాపు నిర్వాహకులు చెబుతున్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో శనివారం ఈ ఏడాది మొదటి లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మల గీతాంబ, సీఎహ్.రమేశ్ బాబు పాల్గొని వివిధ కోర్టుల నుంచి 17 బేంచిలను ఏర్పాటు చేసి మొత్తం 17,542 కేసులు పరిష్కరించారని తెలిపారు. అనంతరం కేసులు ఉన్నవారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
మహిళల అభివృద్ధి దేశ పురోగతి సాధ్యమవుతుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని ఫంక్షన్ హాల్లో జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. మానవునిగా ఆలోచిస్తే మహిళ, పురుష లింగ అసమానత్వం ఉండదని, మహిళ పట్ల అసభ్య ప్రవర్తన జరగదని కలెక్టర్ అన్నారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి, వరంగల్ ఎంపీ డా.కడియం కావ్యలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్గా అప్గ్రేడ్ చేయాలని కోరుతూ ఎంపి కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. అలాగే నష్కల్ నుంచి హసన్పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి నూతన రైల్వే బైపాస్ లైన్లను ORR చుట్టూ అలైన్మెంట్ చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.