India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యం వ్యాపారంలోకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రానున్నారా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం గణనీయంగా పడిపోయింది. భూములపై పెట్టుబడి పెట్టే వారు కూడా కరవయ్యారు. ఉమ్మడి WGL జిల్లాలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. డబ్బు ఉన్న వ్యక్తులు మద్యం వ్యాపారం వైపు చూస్తున్నారు.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వని నేపథ్యంలో ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్ రాగానే నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాలో మొదటి విడత గీసుగొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి మండలాలకు ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. 11న నామినేషన్లకు చివరి తేదీ కాగా, 23న పోలింగ్ జరగనుంది.
వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 23, 27 తేదీల్లో, అలాగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నవంబర్ 4, 8 తేదీల్లో జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 317 గ్రామ పంచాయతీల్లో గల 2,754 వార్డులకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు(రిజిస్ట్రేషన్) వంద శాతం పూర్తి చేసినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1191 ప్రథమ సం., 959 ద్వితీయ సం. మొత్తం 2,150 మందికి గాను 2150 మంది విద్యార్థులు, 187 మంది సిబ్బంది పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలిపారు. ముఖ గుర్తింపు హాజరు రిజిస్ట్రేషన్లో వరంగల్ జిల్లా ముందంజలో ఉందన్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో భూభారతి అమలుపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ పారా మెడికల్ కళాశాలలో రెండు కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఈసీజీ డిప్లొమాలో 30 సీట్లు, డిప్లొమా డయాలసిస్లో 30 సీట్లు ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 28 వరకు నర్సంపేట మెడికల్ కాలేజీలో దరఖాస్తులను చేసుకోవచ్చని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం ఎనుమాముల మార్కెట్ యార్డులో పరిశీలించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్లు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, నీటి, టాయిలెట్ సౌకర్యాలను పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలో హైకోర్టు తీర్పు కొంత మోదం.. కొంత ఖేదం కలిగించే దిశగా వినిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించింది. దాదాపు ముఖ్యమైన ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అధికార పార్టీ నాయకులకు రిజర్వేషన్ పెంపుతో అవకాశం దక్కలేదు. దీంతో తీర్పు వ్యతిరేకంగా వస్తే తమకే మంచిదని భావిస్తున్నారు. రిజర్వేషన్లు పునరుద్ధరిస్తే బరిలో ఉండొచ్చట.
ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను వరంగల్ ఇంటర్మీడియేట్ కార్యాలయంలో పూర్తి స్థాయి తనిఖీ నిర్వహించి ఆమోదించనున్నట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. డీఐఈఓ ఆమోదం పొందిన సిబ్బందికి ప్రత్యేక యూనిక్ ఐడీ జారీ చేయనున్నారని, వీటి కోసం అన్ని వివరాలు కచ్చితంగా నమోదు చేయాలన్నారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGFI) ఆధ్వర్యంలో ఈనెల 7న హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(JNS)లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు క్రీడా పోటీల నిర్వహణ జిల్లా కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు అండర్-19 రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. పూర్తి వివరాలకు 98488 76765ను సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.