India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వరంగల్ జిల్లా మామునూరు శివారులో గురువారం రాత్రి వాహనం ఢీకొని కానిస్టేబుల్ విజయేందర్ మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్లో విజయేందర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకతీయ యూనివర్సిటీ జంతు శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ అనిమల్ బయోటెక్నాలజీ అంశంపై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ రీతూ శర్మ హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా బయోటెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు.
అడవి బిడ్డల అభివృద్ధికి అటవీశాఖ సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు. పెసా చట్టంపై జాతీయ సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్థానిక ఆదివాసీ గిరిజన ప్రజల అభివృద్ది అవసరాల కోసం గ్రామ సభలు తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా చూడాలని కోరారు. ఏజెన్సీ ప్రజల కనీస అవసరాలకు ఆటంకాలు కలిగించకుండా అటవీ, పర్యావరణ శాఖను సమన్వయం చేయాలని చేయాలని కేంద్రానికి సీతక్క విజ్ఞప్తి చేశారు.
1.చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ..
2.చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం జిల్లా ఎస్పీ..
3.తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర కీలకం..
4.సిసి రోడ్డు పనులకు శంకుస్థాపనలు..
5.పొగాకు వినియోగాన్ని మానుకోవాలి జిల్లా కలెక్టర్..
6.సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యం ఎమ్మెల్యే..
7.అక్రిడేషన్ గడువు మూడు నెలల పెంపు డీపీఆర్వో..
8.తీజ్ వేడుకల్లో పాల్గొని స్టెప్పు లేచిన ఎమ్మెల్యే..
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు చట్టలకు లోబడి న్యాయం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్వర్యంలో నేర సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ప్రధాన కేసుల దర్యాప్తు వాటి పురోగతి, కేసుల్లోని నిందితుల అరెస్టులో ఆలస్యం అవ్వడంలో గల ప్రధాన కారణాలపై పోలీస్ కమిషనర్ స్టేషన్ వారిగా పోలీస్ అధికారులతో సమీక్ష జరిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ 341 రకం మిర్చి నిన్నటి లాగే నేడు రూ.16,500 ధర పలికింది. అలాగే తేజ మిర్చి నిన్న రూ.18,400 ధర పలకగా నేడు రూ. 18,300 కి తగ్గింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.16 వేలు ధర రాగా నేడు రూ.17 వేల ధర వచ్చింది. టమాటా మిర్చికి బుధవారం రూ.25 వేల ధర రాగా ఈరోజు రూ. 24 వేలకి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు.
సికింద్రాబాద్లోని ఓ లాడ్జిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భూపాలపల్లి పట్టణంలోని జవహర్ నగర్కు చెందిన అక్షయ్(24) గతేడాది నగరానికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట సొంతూరుకు వెళ్లి తిరిగి మంగళవారం రాత్రి మార్కెట్ PS పరిధి బండిమెట్లోని లాడ్జిలో రూం తీసుకున్నాడు. బుధవారం ఉదయం మిత్రులు, కుటుంబసభ్యుల్లో తనకు ఇష్టమైన వాళ్ల ఫొటోలను వాట్సాప్ స్టేటస్ పెట్టి ఉరేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటి లాగే ఈరోజు తటస్థంగా ఉంది. బుధవారం రూ.7,500 పలికిన క్వింటా పత్తి ధర ఈరోజు సైతం అదే ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే నేడు మార్కెట్కు కొత్త పత్తి తరలిరాగా ధర సైతం నిన్న, మొన్నటితో పోలిస్తే కొంత తగ్గింది. నేడు కొత్త పత్తి క్వింటాకు రూ.7,070 పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.
చిరుతపులి చర్మం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడులో జరిగింది. ఓఎస్డీ గితే మహేశ్ బాబాసాహెబ్ వివరాలు.. ఛత్తీస్గఢ్ నుంచి జాడి మహేందర్ అనే వ్యక్తి చిరుతపులి చర్మం అమ్మకానికి వస్తున్నాడని పక్కా సమాచారం వచ్చింది. ఈ మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ, ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి, పోలీసు సిబ్బంది చంద్రుపట్ల క్రాస్ వద్ద అతడిని పట్టుకుని కేసు నమోదు చేశారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ(KMC)లో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తించేందుకు 68 అసిస్టెంట్ ప్రొఫెసర్, 4 సీఏఎస్ ఆర్ఎంఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.రాంకుమార్ రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ.1.25 లక్షలు, సీఏఎస్ ఆర్ఎంఓకు రూ.52 వేలు వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 3 వరకు కాలేజీలో సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.