India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

WGL జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం తండా, చంద్రు తండాలు ఏకగ్రీవాలుగా నిలిచాయి. పదవుల పంపకాలు, వాటి మూల్యాల ఒప్పందాలు సైతం ముగిశాయి. రామోజీ తండా సర్పంచ్ భూక్యా సుశీల, ఉప సర్పంచ్గా భూక్యా తిరుపతి కాగా, చంద్రు తండాలో సర్పంచ్గా భూక్యా నీలా, ఉప సర్పంచ్గా మాలోతు నెహ్రూలను ఎంపిక చేసుకున్నారు. గ్రామాల అభివృద్ధికి ఇద్దరు తలా రూ.8 లక్షలు ఇచ్చేలా తీర్మానం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జిల్లాలో గ్రామ పంచాయతీల రెండో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఆదివారం నుంచి డిసెంబర్ 2 వరకు కొనసాగనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. నర్సంపేట, వరంగల్ డివిజన్ల పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి, సంగెం, గీసుగొండ మండలాల్లోని 117 సర్పంచ్, 1,008 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామని వివరించారు.

రాయపర్తి(M)మొరిపిరాల గ్రామస్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదర్శంగా నిలిచారు. గ్రామ కారోబార్గా విధులు నిర్వహిస్తున్న పెదగాని నాగరాజు గౌడును సర్పంచ్గా, పెందోట శ్రావణి, కుక్కల మహేందర్, కాయితోజు వరలక్ష్మి, చిలువేరు కృష్ణమూర్తి, మరాటి రవి, రాయారపు రమ్య, నేతావత్ గణేష్, నేతావత్ గంగమ్మను 8 వార్డు స్థానాలకు సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పాలకమండలిని ఘనంగా సన్మానించారు.

జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలి విడత నామినేషన్ల ప్రాసెస్ సజావుగా ముగిసిందని ఆమె పేర్కొన్నారు. మొదటి విడతలో వరంగల్ రెవెన్యూ డివిజన్లోని మూడు మండలాల పరిధిలో 91 గ్రామ పంచాయతీలు, 800 వార్డ్ సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణను శనివారం సాయంత్రంతో పూర్తయిందన్నారు.

హనుమకొండ జిల్లా ఐనవోలు నందనం గ్రామానికి చెందిన యువ ఆవిష్కర్త యాకర గణేష్ ప్రతిష్ఠాత్మక కర్మవీర్ చక్ర అవార్డ్స్లో బ్రాంజ్ మెడల్ను అందుకున్నారు. నవంబర్ 26న ఫరీదాబాద్లో యూ.ఎన్ భాగస్వామ్యంతో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. సాంకేతిక ఆవిష్కరణలు, పౌర చైతన్యం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నందుకు గణేష్ను సన్మానించారు.

ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారం సులభంగా చేరేందుకు రూపొందించిన టీఈ-పోల్ మొబైల్ యాప్ను వినియోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడిన ఆమె, గూగుల్ స్టోర్లో యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.

కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారుల అభిప్రాయాలను సేకరించామని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈరోజు వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశంలో బిల్లులోని సెక్షన్లు, క్లాజులపై విస్తృతంగా చర్చించారు. హాజరైన వాటాదారులు ప్రతి అంశంపై తమ సూచనలు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.