Warangal

News March 28, 2025

నర్సంపేట: ‘దొంతి’కి మంత్రి పదవి దక్కేనా..!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడు, నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి వస్తుందనే చర్చ కొన్ని రోజులుగా కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో దొంతికి కూడా మంత్రి పదవి వస్తుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన కలిసినట్లు తెలిసింది. ఇంత వరకు నర్సంపేట నియోజకవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి రాలేదు.

News March 28, 2025

వరంగల్ మార్కెట్‌కి వరుసగా నాలుగు రోజులు సెలవులు

image

వరంగల్ నగరంలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు ప్రభుత్వం వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ సమయంలో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. ఈనెల 29 అమావాస్య బంధు, 30 ఆదివారం, ఉగాది, సోమవారం రంజాన్,31 మంగళవారం రంజాన్ మరుసటి రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించబడింది. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2వ తారీకు ప్రారంభమవుతుందన్నారు.

News March 27, 2025

వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు

image

కృష్ణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్‌కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.

News March 27, 2025

WGL: ఈ వారంలో అధిక ధర పలికిన పత్తి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈరోజు అన్నదాతలకు మళ్ళీ ఊరటనిచ్చాయి. ఈ వారం మొదటి నుంచి పోలిస్తే ఈరోజు పత్తి ధర అధికంగా పలికింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,030, మంగళవారం రూ.7,045, బుధవారం రూ.7,010 పలికిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ధర రూ.7050 కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News March 27, 2025

సంగెం: బైకును ఢీ కొట్టిన లారీ.. బాలుడు మృతి

image

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గవిచర్లకి చెందిన గాలి చందు (17) బైక్‌పై ఆశాలపెళ్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంటైనర్ లారీ ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2025

WGL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం WGL, HNK, MLG, JN, BHPL, MHBD డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

News March 27, 2025

వరంగల్: డ్రగ్స్ వేర్ హౌస్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

వరంగల్ పట్టణంలో రంగశాయిపేట యూపీహెచ్‌సి ప్రాంగణంలో సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. అధికారులపై సిబ్బంది ఔషధాల స్టాక్, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించి, విధులకు గైరుహజరైన సూపర్వైజర్‌కు షో కాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 27, 2025

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో బుధవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి క్వింటాకి మంగళవారం రూ.10,800 ధర పలకగా.. నేడు రూ.10,500 పలికింది. అలాగే టమాటా మిర్చికి నిన్నటిలాగే రూ.28,000 ధర వచ్చింది. సింగిల్ పట్టికి నిన్న రూ.27వేలు రాగా నేడు రూ.29వేల ధర పలికింది. దీపిక మిర్చి నిన్న రూ.13,300 ధర రాగా నేడు రూ. 13వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News March 26, 2025

నల్లబెల్లి: మిషన్ భగీరథ పంప్ హౌస్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

నారక్కపేట గ్రామ పరిధిలోని మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పంప్ హౌస్ ద్వారా ప్రజలకు తాగునీరు అందించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. పైప్ లీకేజ్ మరమత్తు పనులు త్వరగా చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, మండల తహశీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

News March 26, 2025

WGL: WOW సూపర్ ఐడియా.. సమ్మర్ స్పెషల్ ఆటో  

image

మహబూబాబాద్ జిల్లాలో ఎండ వేడిని తట్టుకోవడానికి ఓ ఆటో యజమాని వినూత్నంగా ప్రయత్నించాడు. తన ఆటోలో పచ్చని చెట్లను అమర్చి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాడు. ఇది చూసిన ప్రయాణికులు ఆ ఆటోను ఎక్కడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. పచ్చని చెట్లు లేకపోవడం వలనే ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అందరూ చెట్లను పెంచాలని ఆటోడ్రైవర్ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాడు.  

error: Content is protected !!