India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యశారదా దేవి పాల్గొన్నారు. భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత తహశీల్దార్లకు కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ జి సంధ్యా రాణి తదితరులున్నారు.
ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటింటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లితండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు, ఫోన్ ఎక్కువగా వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, వరంగల్ జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.
ఈనెల 27న WGL జిల్లాలో BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 BRS కైవసం చేసుకోగా.. ములుగు, BHPL కాంగ్రెస్ గెలిచింది. 2023లో అది కాస్తా తారుమారుగా జనగామ, స్టే.ఘ మాత్రమే BRS, మిగతావన్నీ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు BHPL MLA కాంగ్రెస్ నుంచి BRSలో, ఇప్పుడు స్టే.ఘ MLA BRS నుంచి కాంగ్రెస్లో చేరారు. ఈ సభతో జిల్లాలో మళ్లీ BRS ఊపందుకోనుందా? కామెంట్
జిల్లాలో మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
వరంగల్ జిల్లాలో జాతీయ రహదారి 163 భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో సంగెం, పర్వతగిరి, గీసుకొండ, నెక్కొండ మండలాల్లోని గ్రామాల్లో 38. 20 కిలో మీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరంగల్(D) నల్లబెల్లి(M) మూడు చెక్కలపల్లిలో శనివారం బానోత్ కొమ్మలు(36) అనే వ్యక్తి <<16081736>>హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మొక్కజొన్న చేనులో కొమ్మలు మృతదేహం లభ్యమైంది. ఆయన శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టత రావాల్సి ఉంది.
వరంగల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో బానోతు కొమ్మలును గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి కత్తితో పొడిచి పరారయ్యారని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హన్మకొండ జిల్లా దామెర మండలంలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బతో తాపీ మేస్త్రీ మల్లేశం(46) మృతి చెందారు. ఓ ఇంటి దాబాపై పనిచేస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మృతి చెందాడని మల్లేశం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI అశోక్ తెలిపారు. వేసవి దృష్ట్యా కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని SI సూచించారు
గొర్రెకుంట, ఇతర ప్రాంతాల్లో పలు బేకరీలలో ఫుడ్ సేఫ్టీ, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బేకరీలలో నాణ్యమైన పదార్థాలనే వినియోగదారులకు విక్రయించాలని సూచించారు. కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యత లేని పదార్థాలను తయారీలో వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిరుద్యోగ సమస్యను పారద్రోలడానికి ఇలాంటి జాబ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంత్రి కొండా సురేఖ నియామక పత్రాలను అందించారు. అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరై సంపూర్ణంగా వినియోగించుకోవడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.
Sorry, no posts matched your criteria.