India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరంగల్ జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలోని 13 మండలాల్లో వర్షపాతం 3.3 మి.మీ. నమోదైనట్లు తెలిపింది. జిల్లా మొత్తంలో వర్ధన్నపేట 35.2 మి.మీ. అధిక వర్షపాతం ఉన్నట్లు పేర్కొంది. రాయపర్తి మండలంలో స్వల్పంగా వర్షం కురువగా మిగతా మండలాల్లో వర్షం లేదని ప్రకటించారు.

వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల షెడ్యూల్ను జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ సోమవారం విడుదల చేశారు. ఈనెల 21న ఏవీవీ కళాశాలలో ఉ.8 నుంచి మ.2 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్ కాశీబుగ్గలోని అర్బన్ బ్యాంకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో 8, 11, 12వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 12న స్క్రూటినీ చేసి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 14న విత్ డ్రా అనంతరం తుది జాబితా ఉంటుంది.

వన మహోత్సవ లక్ష్య సాధనకు అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. వన మహోత్సవంపై సోమవారం శాఖల సమీక్ష నిర్వహించారు. 2025-26లో జిల్లాలో 31 లక్షల 4 వేల 272 మొక్కలు నాటే లక్ష్యానికి భాగంగా ఇప్పటివరకు 10.87 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. వాటిలో 9.08 లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్ చేయగా, 5.61 లక్షల మొక్కలు ఇంటింటికి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి 133 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ సత్య శారద వెల్లడించారు. దరఖాస్తుల్లో ఎక్కువ మొత్తంలో రెవెన్యూ శాఖకు సంబంధించి 49 దరఖాస్తులు రాగా, 34 దరఖాస్తులు గృహనిర్మాణ శాఖకు, మిగతా 50 వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని ఆయా శాఖకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటా గురువారం రూ.2,430 పలకగా.. ఈరోజు రూ.2,470 పలికింది. అలాగే పసుపు నిన్న
రూ.12,259 ధర రాగా నేడు రూ.12,459 ధర వచ్చింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.6,300 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,550 ధర వచ్చిందని అధికారులు తెలిపారు.

వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో అన్ని మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల, రేషన్ కార్డుల వేరిఫికేషన్, భూ భారతి దరఖాస్తుల పరిస్కారం, వనమహోత్సవంలో నాటిన మొక్కలు, సీజనల్ వ్యాధులపై సమీక్షించారు.

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పథకం అమలు, లబ్ధిదారుల శిక్షణ, ఆర్ధిక సహకారం, టూల్ కిట్ల పంపిణి తదితర అంశాలపై సమీక్షించారు. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి గురువారం వివిధ రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు తరలివచ్చాయి. ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430 పలకగా.. పసుపు రూ. 12,259 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.5,800 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,600 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. .

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇంకా 50 శాతం యూరియా జిల్లాకు రావాల్సి ఉందని వ్యవసాధికారులు చెబుతున్నారు. అయితే నారుమళ్లలో వరి నారు ముదిరిపోతోందని రైతులు దిగులు చెందుతున్నారు. సకాలంలో యూరియా అందజేస్తే వరి నాట్లు వేసుకుంటామని రైతులు అంటున్నారు. యూరియా అందక వర్షాలు పడక నారు మళ్లలోనే వరినారు ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పర్వతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం ఎవరూ పట్టించుకోకపోవడంతో సిమెంట్ పెచ్చులూడి లోపల ఉన్న ఇనుప చువ్వలు బయటకు తేలుతున్నాయి. ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరి కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. పలువురు గ్రామస్థులు శిథిలావస్థకు చేరిన విగ్రహాన్ని చూసి “హే మహాత్మా” అని వాపోతున్నారు.
Sorry, no posts matched your criteria.