India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MHBD జిల్లా పరిధిలోని సబ్ డివిజన్కు చెందిన పోలీస్ వాహనాల పనితీరు నిర్వహణను అడిషనల్ ఎస్పీ చెన్నయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు వాహనాలను నిరంతరంగా ప్రజాసేవలకు వినియోగించాల్సి ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లను ఆదేశించారు.
వరంగల్ <<14142693>>MGMలో అంబులెన్స్<<>> అందుబాటులో లేకపోవడం అమానుషమని మాజీ మంత్రి KTR అన్నారు. గురువారం జ్వరంతో మృతి చెందిన గీతిక(6)ను తరలించేందుకు అంబులెన్స్ లేకపోవడంపై ఆయన ‘X’లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది అవమానం అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రులను మరణ ఉచ్చులుగా మార్చడమే గాక.. రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూడా అధ్వానంగా ఉందన్నారు. ఇది కాంగ్రెస్, CM రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమని మండిపడ్డారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని గాడిన పెట్టేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీలు, అడపా దడపా మంత్రుల రివ్యూలతో ఎంజీఎంలో అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ ఏర్పడుతోంది. ఇప్పటికే ఎంజీఎంలో పదికి పైగా ఫిర్యాదుల పెట్టేలను ఏర్పాటు చేశారు. వాటిని కలెక్టర్ స్వయంగా తెరిచి సమస్యలు తెలుసుకోనున్నారు. ఓపీ కౌంటర్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. బుధవారం రూ.7,810కి పడిపోయింది. గురువారం కొంత పెరిగి రూ. 7,850 చేరగా నేడు మళ్లీ తగ్గి రూ.7,825 అయిందని అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.
కేయూ కాంట్రాక్టు లెక్చరర్ శ్రీధర్ కుమార్ లోథ్పై మరో మహిళ పార్ట్ టైమ్ లెక్చరర్ ఫిర్యాదు చేశారు. బదిలీ విషయంలో వేధిస్తూ అడ్డుకుంటున్నాడని తెలుగు డిపార్ట్మెంట్ లెక్చరర్ అన్నపూర్ణ అతడిపై గురువారం రిజిస్ట్రార్కు ఫిర్యాదు ఇచ్చారు.కాగా ఈ నెల 16న తెలుగు డిపార్ట్మెంట్ HOD జ్యోతి తనను శ్రీధర్ కుమార్ లోథ్ మానసికంగా వేధిస్తున్నాడని రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే అతడికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి కొండా సురేఖతో నేతలు చర్చించారు.
> JN: మట్కా నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు
> WGL: దాడి చేసిన రౌడీ షీటర్ల అరెస్టు
> HNK: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
> MLG: రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు
> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష
> MLG: ఎంజీఎం ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన!
> MHBD: అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్కు దేహశుద్ధి!
> WGL: మహిళలకు పలు అంశాలపై అవగాహన సదస్సు
గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 17న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల అంశాన్ని తీసుకువెళ్లారు.
వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రయాణికులకు రైల్వే అధికారులు సింగల్ యూజ్ ప్లాస్టిక్పై అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు వరంగల్ రైల్వేస్టేషన్లో బాటిల్ క్రషింగ్ మిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటర్ బాటిల్స్ లాంటివి ఈ యంత్రంలో పడవేస్తే, తుక్కు తుక్కుగా మారుస్తుందని అధికారులు రైల్వే ప్రయాణికులకు తెలిపారు.
హనుమకొండలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఆధునిక సైన్స్ వనరుల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ పి.ప్రావీణ్య సైన్స్ సెంటర్ అధికారులను ఆదేశించారు. రీజనల్ సైన్స్ సెంటర్ను జిల్లా అధికారులతో కలిసి నేడు ఎమ్మెల్యే పరిశీలించారు. సైన్స్ సెంటర్కు కావాల్సిన ఆధునిక సైన్స్ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు.
Sorry, no posts matched your criteria.