Warangal

News September 19, 2024

NSPT: అక్రమ అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు

image

నర్సంపేట నియోజకవర్గంలో మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి జిల్లా ప్రజల ఆకాంక్షను కెసిఆర్ నెరవేర్చారని, నాటి అభివృద్ధిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునేందుకు కుటిల యత్నాలకు పాల్పడుతుందని ‘X’లో మండిపడ్డారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News September 19, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో 341 రకం మిర్చి నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగింది. నిన్న ఈ మిర్చికి రూ.16,500 ధర రాగా.. నేడు రూ.17 వేలు పలికింది. అలాగే తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.18,000 ధర రాగా ఈరోజు రూ.18,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా నేడు రూ.17 వేలు వచ్చిందని వ్యాపారులు తెలిపారు.

News September 19, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,850

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. బుధవారం రూ.7,810కి పడిపోయింది. నేడు కొంత పెరిగి రూ. 7850 అయిందని వ్యాపారులు తెలిపారు. పత్తి ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు. .

News September 19, 2024

KU: 26 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు

image

KU పరిధిలో డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 4 వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలన్నారు.

News September 19, 2024

వరద ప్రభావిత పరిస్థితులపై మంత్రి సీతక్క సమీక్ష

image

మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత పరిస్థితులు, చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను జిల్లాలో వరదల చర్యలపై పలు వివరాలను సీతక్క అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్.

image

> MLG: ఏటూరునాగారంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
> WGL: గణపతి నిమర్జనం ట్రాక్టర్ ను ఢీకొన్న అంబులెన్స్
> MLG: అడవి పందులను హతమార్చిన ముగ్గురి అరెస్ట్
> JN: ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మరంలో మంటలు
> MLG: గడ్డి మందు తాగి యువకుడు మృతి
> MHBD: పెళ్లి కావట్లేదని యువతి మృతి
> MLG: అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
> VKP: విష జ్వరంతో మహిళ మృతి
> WGL: నర్సంపేటలో ఉరి వేసుకుని ఒకరి మృతి

News September 18, 2024

దేవదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష

image

ప్రముఖ ఆలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.కులవృత్తులు, మహిళాసంఘాల సభ్యులకు దేవాదయ శాఖ తరఫున ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News September 18, 2024

వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.5,700 పలకగా, సూక పల్లికాయ (పచ్చిది) రూ. 6,300, పచ్చి పల్లికాయ రూ.4,350 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి నిన్నటిలాగే నేడు కూడా రూ.13,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు పసుపు రాలేదని పేర్కొన్నారు.

News September 18, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మహేశ్ కుమార్ గౌడ్

image

వరంగల్ జిల్లా కేంద్రంలోని భద్రకాళి అమ్మవారిని టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పాల్గొన్నారు.

News September 18, 2024

MHBD: పెళ్లి కావట్లేదని యువతి మృతి

image

పెళ్లి కావట్లేదని మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన MHBD జిల్లాలో జరిగింది. డోర్నకల్ ASI కోటేశ్వర రావు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం తోడేళ్లగూడేనికి చెందిన కళ్యాణి(21) ఏడాది క్రితం డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో కళ్యాణికి కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. వివిధ కారణాలతో కుదరట్లేదు. దీంతో మనస్తాపానికి గురై ఎలుకమందు తిని ఆత్మహత్య చేసుకుంది.