News September 12, 2025
ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. ప్రజలకు సీఎం పిలుపు

AP: ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘పోషకాహారం తినాలి. రోజూ గంట వ్యాయామం చేయాలి. రాత్రి వేళల్లో వెంటనే నిద్రపోవాలి. నా కుటుంబానికి హెరిటేజ్ ద్వారా ఆదాయం వస్తుంది. అందుకే నాకు ఎలాంటి టెన్షన్ లేదు. పూర్తి దృష్టి ప్రజలపైనే ఉంది. రాత్రి వేళ ప్రశాంతంగా నిద్ర పడుతుంది. P-4తో పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా జీవిత ఆశయం’ అని వే2న్యూస్ కాన్క్లేవ్లో పేర్కొన్నారు.
Similar News
News March 31, 2026
స్పామ్ కాల్స్ను అడ్డుకోండిలా!

స్పామ్ కాల్స్, SMSలతో విసిగిపోయారా? వాటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ DND యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్లో మీ నంబర్ను రిజిస్టర్ చేసుకుంటే ఇలాంటి కాల్స్ను బ్లాక్ చేయవచ్చు. ఏయే ప్రమోషనల్ మెసేజ్లు రావాలో ఎంచుకోవచ్చు. స్పామ్ కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేసి, ట్రాక్ చేయొచ్చు. 2025లో ఇలాంటి 1,84,482 స్పామ్ కాల్స్ను ట్రాయ్ తొలగించింది. ఈ <
News March 31, 2026
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,49,290గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 ఎగబాకి రూ.1,36,850 పలుకుతోంది. ఇక వెండి ధర కేజీపై రూ.5వేలు తగ్గి రూ.2,50,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుంటాయి
News March 31, 2026
హార్ముజ్పై బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం

హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకలపై ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నిషేధం విధించిందని.. ఆంక్షలు విధించే ఇతర దేశాలకూ ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. అయితే ఎంత చెల్లించాలి? ఇండియా ఈ లిస్ట్లో ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా భారత నౌకలకు ఇరాన్ ఎలాంటి ఛార్జ్ చేయట్లేదని కేంద్రం ఇటీవల పేర్కొంది.


