News March 7, 2025
GET READY: నేడు ఉదయం 11 గంటలకు..

ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటికే క్రికెట్ ఫీవర్ మొదలైంది. హైదరాబాద్లో జరిగే తొలి రెండు మ్యాచ్లకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదల కానున్నాయి. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీని ఉచితంగా ఇస్తామని SRH ప్రకటించింది. 23న రాజస్థాన్, 27న లక్నోతో ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్లు ఆడనుంది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News March 9, 2025
రూ.40వేల కోట్లతో అమరావతి పునర్నిర్మాణం

AP: రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఈ నెల 12-15 మధ్య అట్టహాసంగా తిరిగి ప్రారంభం కానున్నాయి. ₹48వేల కోట్లతో 73 పనులకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. వీటిలో ₹40వేల కోట్ల విలువైన 62 పనులకు టెండర్లు పిలవగా, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఏజెన్సీలు ఖరారయ్యాయి. రేపటి సమీక్షలో సీఎం CBN వీటికి ఆమోదముద్ర వేయనున్నారు. ఈ పనుల కోసం వరల్డ్ బ్యాంక్, ADB, హడ్కోల ద్వారా GOVT ₹31వేల కోట్ల రుణం తీసుకోనుంది.
News March 9, 2025
అడుగంటిన నీరు.. ఎండుతున్న పైరు

వేసవి ఇంకా ముదరకముందే TGలో పంటలు ఎండుతున్నాయి. గతేడాది కృష్ణా, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉండటం, ప్రాజెక్టులు సైతం కళకళలాడటం, భూగర్భజలాలు పెరగడంతో అన్నదాతలు వరిసాగు గణనీయంగా పెంచారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితి దిగజారింది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఖాళీ అయ్యాయి. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లు అడుగంటాయి. దీంతో నీరందక పైర్లు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.
News March 9, 2025
APలో మరో 2 ఎయిర్పోర్టులు?

AP: అమరావతి, శ్రీకాకుళంలో 2 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటి ప్రీ-ఫీజిబిలిటీని పరిశీలించేందుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించింది. శ్రీకాకుళం నగరానికి 70కి.మీ దూరంలో సముద్ర తీరానికి సమీపంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదిస్తోంది. అటు రాజధానిలో ఎక్కడ నిర్మించాలనేది కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని ప్రభుత్వం పేర్కొంది.