News February 4, 2025

HYDలో యాక్సిడెంట్‌.. మహబూబాబాద్‌ డాక్టర్ మృతి 

image

HYD మేడ్చల్ వద్ద రోడ్డు ప్రమాదంలో కంటైనర్ కింద పడి వైద్యుడు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్ పట్టణంలోని 9వ వార్డు శనిగపురం గ్రామానికి చెందిన యువ డాక్టర్ శ్రీ చరణ్ మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం ఉదయం మృతి చెందారు. శ్రీ చరణ్ ప్రస్తుతం HYD కిమ్స్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. డాక్టర్ మృతితో శనిగపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 4, 2025

వన్డే జట్టులోకి మిస్టరీ స్పిన్నర్

image

ఇంగ్లండ్‌తో ఈ నెల 6న ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని BCCI సెలక్ట్ చేసింది. 15మందితో జట్టును ఇప్పటికే ప్రకటించగా 16వ ప్లేయర్ యాడ్ అయ్యారు. ఇటీవల ముగిసిన T20 సిరీస్‌లో వరుణ్ 7.66RRతో 14 వికెట్లు తీశారు. ఫామ్‌లో ఉన్న వరుణ్‌ ఈ సిరీస్‌‌లో రాణిస్తే CTకి సైతం ఎంపిక చేయాలని BCCI భావిస్తోంది. చక్రవర్తిని CTకి ఎంపిక చేయాలని సీనియర్ ప్లేయర్లు సూచించిన విషయం తెలిసిందే.

News February 4, 2025

తొలిసారి గ్రామానికి శుద్ధ తాగునీరు!

image

స్వతంత్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా ఇంకా కొన్ని గ్రామాలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చుంచునా గ్రామ ప్రజలు ఎట్టకేలకు శుద్ధమైన తాగునీటిని పొందారు. దాదాపు 100 కుటుంబాలున్న ఈ మారుమూల ప్రాంతం చుట్టూ అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇన్నేళ్లు ఈ సమస్యను తీర్చలేకపోయారు. జల్ జీవన్ మిషన్ కింద అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో స్వచ్ఛమైన నీరు వారి చెంతకు చేరాయి.

News February 4, 2025

కొంపల్లి: సోదరి చిత్రపటానికి KCR నివాళి

image

కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ దశదిన కర్మకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సోదరి సకలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. నేడు కేసీఆర్ సహా BRS స్థానిక శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై, నివాళులర్పించారు.

error: Content is protected !!