News July 2, 2024
రైళ్ల టైమ్ టేబుల్లో నో ఛేంజ్
రైళ్ల రాకపోకలకు సంబంధించి టైమ్ టేబుల్ వివరాల్లో ఎలాంటి మార్పు లేదని రైల్వే శాఖ వెల్లడించింది. డిసెంబర్ 31, 2024 వరకు ప్రస్తుతమున్న టైమ్ టేబులే కొనసాగుతుందని పేర్కొంది. కొత్త కాలపట్టికను మరింత సౌలభ్యంగా రూపొందించడం కోసం గడువును పొడిగించినట్లు పేర్కొంది. కాగా ఏటా రైళ్ల రాకపోకల సమయాలను తెలియజేస్తూ ఆ శాఖ ఓ టైమ్ టేబుల్ రిలీజ్ చేస్తుంది. అది జులై 1 నుంచి వచ్చే జులై 31 వరకు అమల్లో ఉంటుంది.
Similar News
News September 20, 2024
80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్ పోటీల్లో!
నైపుణ్యం సాధించేందుకు వయసుతో పని లేదనే విషయాన్ని గుజరాత్కు చెందిన 80 ఏళ్ల స్విమ్మర్ బకుల పటేల్ నిరూపించారు. 13 ఏళ్లకే పెళ్లవడం, పిల్లలు యుక్తవయసులో ఉండగానే భర్తను కోల్పోవడంతో ఆమె ఒంటరైపోయారు. భయాన్ని పోగొట్టేందుకు పటేల్ ఈతను ఎంచుకున్నారు. 58 ఏళ్ల వయసులో నదిలో మునిగి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా పట్టుదలతో ఈతలో ప్రావీణ్యం పొందారు. ఇప్పటికే 9 అంతర్జాతీయ విజయాలు సహా 530+ పతకాలు సొంతం చేసుకున్నారు.
News September 20, 2024
నందిగం సురేశ్ ఇంట్లో సోదాలు
AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పోలీసు కస్టడీలో ఆయన వెల్లడించిన సమాచారం ఆధారంగా గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన ఆయనకు కోర్టు తాజాగా మరో 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
News September 20, 2024
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ: నేడే తొలి మ్యాచ్
మాజీ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాళ్టి నుంచి జరగనుంది. నేడు తొలి మ్యాచులో రాత్రి 7 గంటలకు కోణార్క్ సూర్యాస్, మణిపాల్ టైగర్స్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ధవన్, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ తదితర మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, ఫ్యాన్ కోడ్ యాప్లో ఈ మ్యాచులను చూడవచ్చు.