News July 8, 2024

నేడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసు విచారణ

image

AP: మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజున పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం‌ను ధ్వంసం చేసినట్లు, అడ్డొచ్చిన టీడీపీ ఏజెంటుపై దాడి చేసినట్లు పిన్నెల్లిపై ఆరోపణలున్నాయి. తర్వాతి రోజు విధుల్లో ఉన్న సీఐని రాయితో కొట్టినట్లు కూడా కేసు ఉంది. ఈ కేసుల్లో పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు ఈరోజు, రేపు నెల్లూరు జైలులో పోలీసులు ఆయన్ను విచారించనున్నారు.

News July 8, 2024

నేటి నుంచి ఉచితంగా ఇసుక.. ఇలా బుక్ చేసుకోండి!

image

AP: నేటి నుంచి 20 జిల్లాల్లోని 120 స్టాక్ పాయింట్ల ద్వారా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇసుక డిపోకు వెళ్లి లారీ, ట్రాక్టర్, మినీ ఆటోల్లో తీసుకెళ్లొచ్చు. ఇసుక తవ్వినందుకు, లోడ్ చేసినందుకు, డిపోల వరకు తరలించినందుకు లేబర్, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సగటున రోజుకు ఒక వినియోగదారుడికి 20 టన్నులే పంపిణీ చేస్తారు. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది.

News July 8, 2024

భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు (T20ల్లో)

image

35 బాల్స్- రోహిత్ శర్మ vs శ్రీలంక (2017)
45 బాల్స్- సూర్యకుమార్ యాదవ్ vs శ్రీలంక (2023)
46 బాల్స్- కేఎల్ రాహుల్ vs వెస్టిండీస్ (2016)
46 బాల్స్- అభిషేక్ శర్మ vs జింబాబ్వే (2024)
48 బాల్స్- సూర్యకుమార్ యాదవ్ vs ఇంగ్లండ్ (2022)
48 బాల్స్- యశస్వి జైస్వాల్ vs నేపాల్ (2023)

News July 8, 2024

ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం

image

AP: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ 210 బీటెక్, 2 ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది. అత్యధికంగా రూ.1.05 లక్షలు, అత్యల్పంగా రూ.40 వేల చొప్పున ఫీజును నిర్ణయించింది. ట్యూషన్, అఫిలియేషన్, మెడికల్, గేమ్స్ ఇతర ఖర్చులు ఇందులోకే వస్తాయి. వసతి, రవాణా, మెస్, రిఫండబుల్ ఇతర ఫీజులు వీటిలో చేర్చలేదు. అదనంగా వసూలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

News July 8, 2024

నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో 4 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు HYD వాతావరణ శాఖ తెలిపింది. నేడు NZB, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, MBNR, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా నిన్న అత్యధికంగా ఆదిలాబాద్(D) చాప్రాలో 4.5cmల వర్షపాతం నమోదైంది.

News July 8, 2024

కృష్ణమ్మను తాకిన గోదారి

image

AP: గోదావరి నీళ్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణమ్మ ఒడికి చేరాయి. విజయవాడ సమీపంలోని ఫెర్రీ వద్ద నిన్న సాయంత్రం గోదావరి జలాలు కృష్ణానదిలో కలిశాయి. ఈ నెల 3న పోలవరం సమీపంలోని పట్టిసీమ వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు పంపులను ఆన్ చేసి నీటిని కుడి కాలువలోకి విడుదల చేశారు. 5 రోజుల ప్రయాణం తర్వాత ఆ నీళ్లు కృష్ణమ్మను చేరాయి. దీంతో కృష్ణా డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 8, 2024

నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

image

తెలంగాణలో తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 15 వరకు జరగనుంది. మొత్తం 173 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 70,307 అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం గమనార్హం. పలు కాలేజీలు కొన్ని బ్రాంచీల్లో సీట్లను పెంచేందుకు AICTE అనుమతి పొందడంతో 2, 3 విడతల కౌన్సెలింగ్ వరకు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

News July 8, 2024

నేడు ఇంధన శాఖపై శ్వేతపత్రం

image

AP: రాష్ట్ర ఇంధన శాఖ పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు విద్యుత్ రంగంపై నేడు వైట్‌ పేపర్‌ను విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు తీసుకునే చర్యల గురించి సీఎం చంద్రబాబు చెబుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. 2019కి, నేటికి చోటుచేసుకున్న వ్యత్యాసాన్ని ప్రధానంగా వివరించనున్నారని పేర్కొన్నాయి.

News July 8, 2024

నేడు విజయవాడకు సీఎం రేవంత్, మంత్రులు

image

TG: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75వ జయంతి సభకు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

News July 8, 2024

కమల్ హాసన్‌ రాగానే గూస్‌బంప్స్ వచ్చాయి: శంకర్

image

సేనాపతి గెటప్‌తో కమల్ హాసన్‌ను చూడగానే ఒళ్లు జలదరించిందని దర్శకుడు శంకర్ తెలిపారు. ‘భారతీయుడు తర్వాత చాలా సినిమాలు తీశాను. కానీ లంచం గురించి వార్తలు చూసినప్పుడల్లా ఆ సినిమాయే గుర్తొచ్చేది. భారతీయుడు-2 స్టార్ట్ అయ్యాక సేనాపతి గెటప్‌లో ఆయన్ను చూస్తే గూస్‌బంప్స్ వచ్చాయి. ఆడియన్స్‌ కూడా అదే అనుభూతిని పొందుతారు. ఆయనలాంటి నటుడు దొరకడం మా అదృష్టం’ అని పేర్కొన్నారు.