News June 22, 2024

వైసీపీది బాధ్యతారాహిత్యం: సత్యకుమార్

image

AP: సభాపతి స్థానానికి అయ్యన్నపాత్రుడు అన్ని విధాలా అర్హులని మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..’ అల్లరిని అరికట్టే ప్రిన్సిపల్‌గా అయ్యన్న వ్యవహరించాలి. ఆయన అనుభవం కొత్త సభ్యులకు మార్గదర్శకం కావాలి’ అని అన్నారు. సభాపతి బాధ్యతలు చేపట్టే ముఖ్యమైన ఘట్టానికి YCP హాజరుకాకపోవడం సరికాదని అన్నారు. ఇది ఆ పార్టీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు.

News June 22, 2024

‘కల్కి’పై భారీగా పెరిగిన ఇంట్రెస్ట్.. PAYTMలో 1M వెయిటింగ్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రిలీజైన రెండు ట్రైలర్లు ప్రేక్షకుల్లో మూవీపై మరింత ఇంట్రెస్ట్‌ను పెంచేశాయి. దీంతో PAYTMలో టికెట్ బుకింగ్ కోసం వెయిట్ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కేవలం పేటీఎంలోనే 10 లక్షల మంది ‘కల్కి’ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారత సినీ చరిత్రలో ‘కల్కి’ సినిమాకి మాత్రమే ఈ ఘనత దక్కిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

News June 22, 2024

రేప్ కేసుల్లో అబార్షన్‌కు యూఏఈ అనుమతి

image

రేప్ కేసుల్లో బాధితులైన మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించే కీలక తీర్మానాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆమోదించింది. అక్రమ సంబంధం లాంటి కేసుల్లోనూ ఈ మినహాయింపు ఇవ్వనుంది. మహిళల ఆరోగ్యం దృష్ట్యా 120 రోజుల్లోపు గర్భాన్ని మాత్రమే తొలగించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వారికి ప్రభుత్వమే వైద్య సదుపాయం అందించనుంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయనుంది.

News June 22, 2024

వైసీపీ దేవుడి స్క్రిప్ట్ వ్యాఖ్యలకు సీఎం కౌంటర్

image

AP: వైనాట్ 175 అన్న వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘2019లో మాకు 23 సీట్లు వస్తే దేవుడి స్క్రిప్ట్ అంటూ హేళన చేశారు. ఇప్పుడు మాకొచ్చిన 164 సీట్లు కలిపితే 11 వస్తుంది. 1631 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేశారు. ఆ అంకెలు కలిపితే 11 వస్తుంది. ఇది దేవుడి స్క్రిప్ట్ అని అనడం లేదు. ఓడిన వాళ్లను హేళన చేయాల్సిన అవసరం లేదు. YCP వాళ్లు సభలో ఉంటే అర్థమయ్యేది’ అని చెప్పుకొచ్చారు.

News June 22, 2024

బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరు? నేతల వ్యాఖ్యలకు అర్థమేంటి?

image

TG: రాష్ట్రంలో కాషాయ దళపతి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ బీజేపీలోని నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొత్త నీరు, కొత్త నాయకత్వం అవసరమంటూ ఈటల కామెంట్ చేయగా.. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్నవారికే పగ్గాలు ఇవ్వాలని రాజాసింగ్ అన్నారు. దీంతో వీరిద్దరూ చీఫ్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రఘునందన్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం.

News June 22, 2024

అందుకే కన్నీళ్లు పెట్టుకున్నా: సీఎం చంద్రబాబు

image

AP: గతంలో నాపై బాంబు దాడి జరిగినా కన్నీళ్లు పెట్టలేదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నా సతీమణిని వైసీపీ నేతలు అవమానించారని చెప్పారు. ‘ఆమెనే కాకుండా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అందుకే నా జీవితంలో మొదటిసారి ఆడబిడ్డల గురించి ఆ మాటలు విని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా’ అని అసెంబ్లీలో సీఎం వివరించారు.

News June 22, 2024

సభలో అవమానాన్ని గుర్తు చేసుకున్న సీఎం

image

AP: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గతంలో సభలో తనను అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ‘నా గురించి, నా కుటుంబం గురించి నీచంగా మాట్లాడారు. వారిపై యాక్షన్ తీసుకోకపోగా నిరసన తెలియజేయడానికి మైక్ అడిగితే ఇవ్వలేదు. అయినా రికార్డ్ కోసం స్టేట్‌మెంట్ ఇచ్చా. ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను తప్ప మళ్లీ అడుగుపెట్టను అని చెప్పా’ అంటూ అప్పటి కామెంట్స్‌ను మరోసారి ఆయన చదివి వినిపించారు.

News June 22, 2024

66 ఏళ్లొచ్చినా అయ్యన్న ఫైర్ బ్రాండే: సీఎం చంద్రబాబు

image

AP: స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి CM చంద్రబాబు అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపారు. ‘ఓ BC నేత సభాధ్యక్ష స్థానంలో కూర్చోవడం ఆనందంగా ఉంది. NTR పిలుపుతో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశారు. ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చారు. 66 ఏళ్లొచ్చినా పాలిటిక్స్‌లో ఆయన ఫైర్ బ్రాండే. గత ఐదేళ్లలో రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నారు’ అని కొనియాడారు.

News June 22, 2024

ఆ ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్

image

ఆఫీస్‌కు లేటుగా వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులు 9amకి కార్యాలయంలో ఉండాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్‌ను కలుపుకొని 9.15amలోపు ఆఫీస్‌లోని బయోమెట్రిక్‌లో హాజరు వేయకపోతే హాఫ్ డే CLలో కోత విధించనుంది. ఆఫీస్‌కి రాలేకపోతే ఒకరోజు ముందే సమాచారమివ్వాలని సూచించింది. దానికి CL వర్తిస్తుందని చెప్పింది.

News June 22, 2024

పక్షుల్ని కాపాడేందుకు దోమల్ని పంపుతున్నారు.. ఎందుకంటే?

image

హవాయి దీవుల్లో కనిపించే హనీక్రీపర్ పక్షులను కాపాడేందుకు అధికారులు మగదోమలను పంపుతున్నారు. అదేంటంటారా? దోమల ద్వారా సంక్రమించే ఏవియన్ మలేరియా బారిన పడి ఈ పక్షులు చనిపోతున్నాయట. ఇప్పటికే 33 జాతులు అంతరించిపోయాయి. దీంతో దోమల సంతానోత్పత్తిని నిరోధించే ఓల్బాచియా అనే బ్యాక్టీరియాను కలిగిన మగ దోమలను హెలికాప్టర్ల ద్వారా విడుదల చేస్తున్నారు. వీటితో కలిసిన ఆడ దోమలు గుడ్లను పొదగలేవు.