India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
T20 వరల్డ్ కప్ సూపర్-8లో రోహిత్ సేన అఫ్గానిస్థాన్తో తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా లీగ్ దశలో న్యూజిలాండ్కు షాకిచ్చిన అఫ్గాన్ను భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. దీంతో భారత జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు లీగ్ దశలో విఫలమైన కింగ్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
AP: సీఎం చంద్రబాబునాయుడు నేడు అమరావతిలో పర్యటించనున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. తర్వాత అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారు. అధికారుల భవన సముదాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారు.
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలతో రోజుకు 2వేల మంది చిన్నారులు మరణిస్తున్నారని యూఎస్-హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది. 2021లో వాయు కాలుష్యంతో 81 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. రక్తపోటు తర్వాత వాయుకాలుష్యమే మరణాలకు రెండో ప్రధాన కారకంగా ఉందని వెల్లడించింది. దీనిని నియంత్రించకపోతే తదుపరి జనరేషన్పై ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.
యూరో ఛాంపియన్షిప్ 2024లో గ్రూప్-ఏలోని అతిథ్య జర్మనీ జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. హంగేరీతో జరిగిన మ్యాచులో 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. మరో వైపు ఇదే గ్రూప్లోని స్కాట్లాండ్, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. అంతకుముందు క్రొయేషియా, అల్బేనియా మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగానే ముగిసింది. దీంతో క్రొయేషియా గ్రూప్-బీలో చివరి స్థానంలో కొనసాగుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘సికందర్’ సినిమా షూటింగ్లో త్వరలోనే పాల్గొంటానని హీరోయిన్ రష్మిక తెలిపారు. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ నటిస్తున్నారు. తాజాగా సల్మాన్ షూటింగ్కు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. త్వరలోనే తానూ షూటింగ్లో జాయిన్ అవుతానని రష్మిక రీట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్కు విడుదల చేసే యోచనలో టీమ్ ఉంది.
యూజీసీ-<<13472127>>నెట్<<>> తరహాలోనే నీట్ పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘నెట్ రద్దు లక్షలాది విద్యార్థుల విజయం. ఇది అహంకారపూరిత మోదీ ప్రభుత్వానికి పరాభవం. మోదీజీ.. నీట్ పరీక్షను ఎప్పుడు రద్దు చేస్తారు? నీట్ పరీక్షలోనూ పేపర్ లీకేజీకి మీరే బాధ్యత తీసుకొండి’ అని Xలో పేర్కొన్నారు. ఈ లీకేజీలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తారా అని ప్రియాంక ప్రశ్నించారు.
కర్ణాటకలో సంచలనంగా మారిన అభిమాని రేణుకాస్వామి <<13457717>>హత్య<<>> అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు మరో నిందితుడికి దర్శన్ రూ.30 లక్షలు అప్పగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. స్వయంగా నటుడు దర్శన్ ఈ విషయాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నాయి. ఈ హత్య కేసులో దర్శన్తో సహా 17 మంది నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు ముందు అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
1876: గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు చందాల కేశవదాసు జననం
1939: భారత మాజీ క్రికెటర్ రమాకాంత్ దేశాయ్ జననం
1958: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జననం
1984: సినీ నటి నీతూ చంద్ర జననం
1987: భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణం
2001: ప్రపంచ శరణార్థుల దినోత్సవం
ఒడిశా అసెంబ్లీలో తానే ప్రతిపక్ష నేతగా ఉంటానని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారు. పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. బీజేడీ ఎమ్మెల్యేలంతా తనను బీజేడీ సభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. 24 ఏళ్ల పాటు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ ఇటీవల అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. 78 సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో PM మోదీకి తనకు మధ్య పోరు నెలకొందని ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఏక్నాథ్ షిండేను పక్కన పెట్టి ఎన్నికలకు సన్నద్ధం కావాలని సవాల్ చేశారు. శివసేన నిజమైన సింబల్(బాణం)ను వాడకుండా BJP ఎన్నికలు గెలవాలని పార్టీ అవిర్భావ వేడుకల్లో అన్నారు. మరోవైపు NDAలో చేరుతారనే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. తమను అంతం చేయాలనుకున్న పార్టీతో చేరేది లేదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.