India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత క్రికెట్ దిగ్గజం ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పినా క్రేజ్ తగ్గలేదని మరోసారి రుజువైంది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న FIFA ఇన్స్టాలో ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫొటోను షేర్ చేస్తూ ‘తలా ఫర్ ఏ రీజన్ 7’ అని రాసుకొచ్చింది. ధోనీని అభిమానులు ‘తలా’ అని పిలుస్తారని తెలిసిందే. కాగా ఏకంగా FIFA అలా పోస్టు చేయడంతో ‘ధోనీ రేంజ్ ఇది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
AP: గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్ల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిపై ఎలాంటి ఫొటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదని ఉత్తర్వులిచ్చింది. పాస్ పుస్తకాల జారీలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్యదర్శులు, HODలకు స్పష్టం చేసింది.
TTD ఈవో జే.శ్యామలారావు అధికారులకు కీలక సూచనలు చేశారు. కాలినడక భక్తులకు 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. APSRTC, టూరిజం కోటా దర్శన టికెట్లు నిరుపయోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు కచ్చితమైన దర్శన సమయాలు తెలిసేలా నారాయణగిరి షెడ్ల వద్ద ఎలక్ట్రానిక్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.
AP: పార్వతీపురం మన్యం జిల్లా సోమినాయుడువలస గేటు వద్ద గూడ్స్ రైలు నుంచి నాలుగు బోగీలు విడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపేశారు. కాసేపటికి మరమ్మతులు చేసి రైలును అక్కడి నుంచి పంపించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
AP: నూతన మంత్రివర్గ సభ్యులకు సచివాలయంలో ఛాంబర్లను కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. బ్లాక్-2లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ సహా ఏడుగురికి ఛాంబర్లు అప్పగించింది. బ్లాక్-3లో ఐదుగురు, బ్లాక్-4లో ఎనిమిది మంది, బ్లాక్-5లో ఐదుగురికి కేటాయించింది.
AP: రాష్ట్రంలో 12వ వేతన సవరణ సంఘం(PRC) కమిషనర్ మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తనను రిలీవ్ చేయాలంటూ సీఎస్ నీరభ్ కుమార్కు లేఖను పంపారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఈయనను ప్రభుత్వం 2023 జులైలో పీఆర్సీ కమిషనర్గా నియమించింది.
టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్ పేరును BCCI ఎల్లుండి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ KKR మెంటార్ గౌతమ్ గంభీర్ను BCCI ఇంటర్వ్యూ చేసింది. ఆయనతోపాటు WV రామన్నూ ప్రశ్నించింది. రేపు ఓ విదేశీయుడితోపాటు గంభీర్ను మరోసారి ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం. అనంతరం షార్ట్ లిస్ట్ చేసి కోచ్ పేరును ప్రకటించనుంది. వీరు ముగ్గురూ పోటీలో ఉన్నా గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
AP: ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్నారు. ఎల్లుండి పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కాగా రేపటి నుంచి 21 వరకు పులివెందులలో పర్యటించి, 22న తాడేపల్లిలో నేతలతో జగన్ సమావేశమవుతారని వైసీపీ వర్గాలు తొలుత వెల్లడించిన విషయం తెలిసిందే.
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా దీపికా పదుకొణె అగ్రస్థానంలో నిలిచారు. ఆమె ఒక్కో సినిమాకు ₹15-30 కోట్లు తీసుకుంటున్నట్లు IMDB-ఫోర్బ్స్ డేటా వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో కంగనా(₹15-27cr), ప్రియాంకా చోప్రా(₹15-25cr), కత్రినా(₹15-25cr), అలియా(₹10-20cr), కరీనా(₹8-18cr), శ్రద్ధా కపూర్(₹7-15cr), విద్యాబాలన్(₹8-14cr), అనుష్క శర్మ(₹8-12cr), ఐశ్వర్యారాయ్(₹8-10cr) ఉన్నారని పేర్కొంది.
భారత సారథి రోహిత్శర్మ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. 2007 T20WC విజేత జట్టులో సభ్యుడైనప్పటికీ 2011 WC జట్టులో చోటు దక్కలేదు. పుండు మీద కారంలా అప్పుడే అతడి ఫిట్నెస్పై తీవ్ర విమర్శలొచ్చాయి. వెంటనే ఔటవుతాడనే కారణంతో ‘మ్యాగీ మ్యాన్’ అని కామెంట్స్ వినిపించాయి. నిజానికి హిట్ మ్యాన్ అసలైన ప్రయాణం అప్పుడే మొదలైంది. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తూ ఇప్పుడు అత్యధిక T20WC మ్యాచ్లు ఆడిన క్రికెటరయ్యారు.
Sorry, no posts matched your criteria.