India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయవాడలో నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఈ గెస్ట్ హౌస్ను జనసేనాని సందర్శించారు. పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో కార్యాలయం, పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండటంతో పవన్ అంగీకరించినట్లు సమాచారం. అనంతరం అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. మరికాసేపట్లో సచివాలయానికి వెళ్లి తన పేషీని పవన్ పరిశీలించనున్నారు.
NEET-UG 2024 కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి మరింత హానికరమని వ్యాఖ్యానించింది. పరీక్షకు సిద్ధమైన పిల్లల కష్టాన్ని మరిచిపోవద్దని, 0.001% నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని కేంద్రం, NTAని ఆదేశించింది. NEET-UG, 2024లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అభ్యర్థనలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిస్పందించాలని నోటీసులు జారీ చేసింది.
AP: ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించాలంటూ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ‘మీకు 151 సీట్లు వచ్చినప్పుడు మీ విజయమా? మాకు 164 వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా? జగన్.. పులివెందులకు రాజీనామా చేసి ఉప ఎన్నికకు రండి. బ్యాలెట్ విధానంలో ఉప ఎన్నిక పెట్టాలని ఈసీని కోరదాం. మీకు కనీసం మొన్న వచ్చిన మెజారిటీ వస్తుందేమో చూద్దాం. ఇకనైనా చిలక జోస్యం ఆపండి’ అని సూచించారు.
నేడు స్టాక్ మార్కెట్లోకి ఇక్సిగో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఐపీఓలో ఇష్యూ ప్రైస్ రూ.93/షేర్ కాగా ఇప్పుడు NSEలో 48.5% లాభంతో రూ.138.10కు లిస్టింగ్ అయింది. మరోవైపు బీఎస్ఈలో 45.16% పెరిగి షేర్ విలువ రూ.135 వద్ద కొనసాగుతోంది. ఈనెల 10-12 మధ్య జరిగిన ఐపీఓలో ఇన్వెస్టర్లు 98.34 రెట్లు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ఇక్సిగో మాతృసంస్థ లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ వెల్లడించింది.
అఫ్గానిస్థాన్తో మ్యాచులో వెస్టిండీస్ బ్యాటర్ పూరన్ విధ్వంసం సృష్టించారు. అజ్మతుల్లా వేసిన 4వ ఓవర్లో ఏకంగా 36 రన్స్ వచ్చాయి. ఇందులో పూరన్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదారు. మిగతా 10 రన్స్ బైన్స్ రూపంలో వచ్చాయి. దీంతో T20 WCలో ఒక ఓవర్లో అత్యధిక రన్స్ సమర్పించుకున్న రికార్డ్ స్టువర్ట్ బ్రాడ్(యూవీ 6 సిక్సుల ఓవర్) ఓవర్ను అజ్మతుల్లా ఓవర్ సమం చేసింది. ఈ మ్యాచ్లో WI 104 రన్స్తో గెలిచింది.
నిన్న బెంగాల్ రైలు ప్రమాద సమయంలో ఆటోమెటిక్ సిగ్నల్ వ్యవస్థ పనిచేయలేదని తెలుస్తోంది. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి రాణిపత్ర-ఛత్తర్ హట్ స్టేషన్ల మధ్య సిగ్నల్ పడలేదని అధికారులు భావిస్తున్నారు. అటు రెండు రైళ్లు ఒకే లైన్పైకి వచ్చినప్పుడు ఆటోమెటిక్గా బ్రేక్ పడే వ్యవస్థ ‘కవచ్’ కూడా ఆ మార్గంలో అందుబాటులో లేదు. ఉంటే ప్రమాదం తప్పేదని అధికారులు చెబుతున్నారు.
పీఎం కిసాన్ డబ్బులను ప్రధాని మోదీ <<13460222>>ఇవాళ<<>> జమ చేయనున్నారు. ఈ-కేవైసీ చేయించుకున్న రైతులకే ఈ పథకం రూ.2వేలు జమ అవుతాయి. pmkisan.gov.in సైట్లో సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆ సైట్ ఓపెన్ చేసి కుడి వైపున ఉండే e-KYCపై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేస్తే చాలు ఈ కేవైసీ పూర్తి అయినట్లే. e-KYC కోసం ఇక్కడ <
నిధులు సమకూర్చుకునేందుకు ఎల్ఐసీ తన భూములు, భవనాలను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ముంబైతో మొదలుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో ఆస్తులను విక్రయించే అవకాశం ఉంది. దీని ద్వారా $6-7 బిలియన్లు సేకరించాలని సంస్థ భావిస్తోందట. ప్రైవేట్ సంస్థలకు దీటుగా మార్కెట్ షేర్ కాపాడుకునేందుకు LIC శ్రమిస్తున్న వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు టైర్-2,3 ప్రాంతాల్లోనూ విస్తరించేందుకు సంస్థ కృషి చేస్తోంది.
సామాన్య ప్రయాణికుల అవసరాలను పక్కనపెట్టి, గత కొన్నేళ్లుగా వందేభారత్పైనే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఆ రైలు సూత్రధారి సుధాంశు మణి అన్నారు. AC కోచ్ల తయారీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో NON AC కోచ్లు తగ్గాయని తెలిపారు. దీంతో రిజర్వేషన్ చేయించని ప్రయాణికులు సైతం AC కోచ్లలోకి ప్రవేశిస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. మణి రైల్వేలో మెకానికల్ ఇంజినీర్గా 38 ఏళ్లుగా సేవలందించారు.
AP ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల <<13460226>>ఫలితాలు<<>> మ.2 గంటలకు విడుదల కానున్నాయి. bie.ap.gov.in అధికారిక సైట్తో పాటు Way2News యాప్లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్లో హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క క్లిక్తో వాట్సాప్ సహా ఏ ప్లాట్ఫాంకైనా రిజల్ట్ను షేర్ చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.