News January 9, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 9, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.22 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు
✒ ఇష: రాత్రి 7.15 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 9, 2025

తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

image

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయం చేస్తామని మోదీ స్పష్టం చేశారు. అటు ఘటనపై ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు పురందీశ్వరి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

News January 9, 2025

తొక్కిసలాటపై టీటీడీ ఛైర్మన్ ఏమన్నారంటే?

image

తిరుపతి తొక్కిసలాట దురదృష్టకరమని TTD ఛైర్మన్ BR నాయుడు అన్నారు. విషయం తెలిసిన వెంటనే CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. తిరుపతిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు నాయుడు తెలిపారు.

News January 9, 2025

తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

image

తిరుపతి తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సీఎం, టీటీడీ ఛైర్మన్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

News January 9, 2025

కారులో ప్రేమజంట సజీవదహనం.. నిందితుడు అరెస్ట్

image

TG: హైదరాబాద్‌లో కారులో ప్రేమజంట సజీవ దహనమైన విషయం తెలిసిందే. వీరి మరణానికి కారణమైన నిందితుడు మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ్ (25), లిఖిత (17) ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో లిఖిత బంధువు మహేశ్ వీరి ప్రేమ గురించి ఇంట్లో చెబుతానని బెదిరించడంతో పలుసార్లు రూ.1.35 లక్షలు ఇచ్చారు. ఇంకా కావాలని ఒత్తిడి చేయడంతో వారు కారు అద్దెకు తీసుకుని అందులోనే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

News January 9, 2025

తీవ్ర ఆవేదనకు లోనయ్యా: పవన్ కళ్యాణ్

image

AP: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం ఇచ్చి, సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన నేపథ్యంలో తిరుపతిలోని టికెట్ కౌంటర్ల వద్ద అధికారులు, పోలీసులకు జనసైనికులు తోడ్పాటు అందించాలని పవన్ సూచించారు.

News January 9, 2025

కొందరు అధికారుల వల్లే ఈ ఘటన: చంద్రబాబు

image

AP: తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. కొందరు అధికారుల వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో వారిపై అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

News January 9, 2025

రద్దీ కారణంగానే ముందుగా టోకెన్లు జారీ: TTD ఈవో

image

AP: రేపు ఉ.5 గంటలకు జారీ చేయాల్సిన టోకెన్లను భక్తుల రద్దీ కారణంగా ముందుగానే ప్రారంభించినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. మరోవైపు ఎలాంటి బందోబస్తు లేకపోవడమే ఘటనకు కారణమని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించారు.

News January 9, 2025

అప్పుడే నా వివాహం: అనన్య పాండే

image

ఐదేళ్ల తర్వాతే తాను పెళ్లి పీటలు ఎక్కుతానని హీరోయిన్ అనన్య పాండే స్పష్టం చేశారు. ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘అందరిలాగే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. కొత్త ఇల్లు నిర్మించుకోవాలి. ఇంటి నిండా కుక్కలను పెంచుకోవాలి. ఆ తర్వాత వివాహం చేసుకుంటా’ అని తెలిపారు. కాగా మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో అనన్య డేటింగ్ చేస్తున్నట్లు టాక్. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి వీరిద్దరూ కలిసే హాజరయ్యారు.

News January 9, 2025

తొక్కిసలాట చాలా బాధాకరం: జగన్

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై YCP చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.