India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సీఎం, టీటీడీ ఛైర్మన్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
TG: హైదరాబాద్లో కారులో ప్రేమజంట సజీవ దహనమైన విషయం తెలిసిందే. వీరి మరణానికి కారణమైన నిందితుడు మహేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ్ (25), లిఖిత (17) ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో లిఖిత బంధువు మహేశ్ వీరి ప్రేమ గురించి ఇంట్లో చెబుతానని బెదిరించడంతో పలుసార్లు రూ.1.35 లక్షలు ఇచ్చారు. ఇంకా కావాలని ఒత్తిడి చేయడంతో వారు కారు అద్దెకు తీసుకుని అందులోనే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
AP: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం ఇచ్చి, సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన నేపథ్యంలో తిరుపతిలోని టికెట్ కౌంటర్ల వద్ద అధికారులు, పోలీసులకు జనసైనికులు తోడ్పాటు అందించాలని పవన్ సూచించారు.
AP: తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. కొందరు అధికారుల వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో వారిపై అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
AP: రేపు ఉ.5 గంటలకు జారీ చేయాల్సిన టోకెన్లను భక్తుల రద్దీ కారణంగా ముందుగానే ప్రారంభించినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. మరోవైపు ఎలాంటి బందోబస్తు లేకపోవడమే ఘటనకు కారణమని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించారు.
ఐదేళ్ల తర్వాతే తాను పెళ్లి పీటలు ఎక్కుతానని హీరోయిన్ అనన్య పాండే స్పష్టం చేశారు. ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘అందరిలాగే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. కొత్త ఇల్లు నిర్మించుకోవాలి. ఇంటి నిండా కుక్కలను పెంచుకోవాలి. ఆ తర్వాత వివాహం చేసుకుంటా’ అని తెలిపారు. కాగా మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో అనన్య డేటింగ్ చేస్తున్నట్లు టాక్. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి వీరిద్దరూ కలిసే హాజరయ్యారు.
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై YCP చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
MH బుల్దానాలోని బోర్గాం, కల్వాడ్, హింగానా గ్రామాల ప్రజలను జుట్టు రాలుడు సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే చాలా మందికి జుట్టు రాలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామాల్లోని నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. దాదాపు 50 మంది ఈ సమస్యతో వైద్యులను సంప్రదించగా బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. కాగా కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తిరుపతి తొక్కిసలాటలో భక్తురాలి మృతిపై VHP రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు వైకుంఠ దర్శన టికెట్ల కోసం వస్తే ఏకంగా వైకుంఠానికి పంపే దుస్థితి TTDలో ఉందని ధ్వజమెత్తారు. 5 లక్షల మంది హాజరైన హైందవ శంఖారావం చక్కగా జరిగితే, నేడు TTD 75 వేల మంది వస్తేనే ఇలా చేసిందన్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మొదట కూతురు పుట్టాలనే తాను అనుకున్నట్లు హీరో రామ్ చరణ్ చెప్పారు. అదే సమయంలో ఒకటే సినిమా చేయడంతో క్లీంకారతో గడిపే సమయం దొరికిందన్నారు. షూటింగ్ ఉన్నా లేకున్నా రోజు రెండు గంటలు తనతో ఉంటానని పేర్కొన్నారు. ఒక్క ముద్ద తినేందుకు కిలోమీటర్ పరిగెడుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో బర్త్ డే వీడియో ప్లే చేయగా ఆయన ఎమోషనల్ అయ్యారు. క్లీంకారకు ప్రైవసీ ఇవ్వడమే తాను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.