News March 23, 2024

బాలికపై సీఐ అత్యాచారం

image

TG: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భూపాలపల్లి వీఆర్ సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ PSలో ఎస్సైగా పనిచేశాడు. అప్పటినుంచి హనుమకొండకు చెందిన ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈక్రమంలోనే ఆమె కూతురుపై కన్నేసిన అతడు.. అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో సీఐపై పోక్సో కేసు నమోదైంది.

News March 23, 2024

ప్రణీత్ కేసులో కీలక మలుపు

image

TG: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబీ డీఎస్పీ తిరుపతన్న, HYD మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు.

News March 23, 2024

టీడీపీ రెబల్‌గా బరిలోకి శివరామరాజు

image

AP: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రెబల్‌గా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తనవైపే ఉన్నారని అన్నారు. విజయం సాధించి అధికార పార్టీతో కలిసి పని చేస్తానని తెలిపారు. తన వెనుక వైసీపీ ఉందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. కాగా ఈ సీటును మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే టీడీపీ అధిష్ఠానం కేటాయించింది.

News March 23, 2024

హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ రైళ్లు నడవనున్నట్లు పేర్కొంది. 23న హైదరాబాద్-ధనపూర్, 25న సంత్రాగచి-సికింద్రాబాద్, 26న ధనపూర్-హైదరాబాద్, 24న సంత్రాగచి-చెన్నై సెంట్రల్, 27న పట్నా-కోయంబత్తూర్ మధ్య రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.

News March 23, 2024

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 59,236 మంది భక్తులు దర్శించుకోగా 25,446 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు లభించింది.

News March 23, 2024

డ్రైఈస్ట్‌లో OPM, కొకైన్, హెరాయిన్ గుర్తింపు

image

AP: విశాఖ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. పోర్టులో పట్టుబడ్డ డ్రైఈస్ట్‌ నుంచి శాంపిల్స్ సేకరించిన CBI డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించింది. ఇందులో ప్రాథమికంగా OPM, కొకైన్, హెరాయిన్ ఉన్నట్లు గుర్తించింది. దీంతో మరింత లోతుగా విచారణ చేస్తోంది. సంధ్యా ఆక్వా, ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య మెయిల్‌లను పరిశీలిస్తోంది. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News March 23, 2024

‘ఆప్’‌ను నడిపించేదెవరు?

image

అవినీతిపై పోరాటంతో ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతి మకిలికి బలవుతోంది. ఆప్ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ తరహాలోనే కేజ్రీవాల్ కూడా ఇప్పట్లో జైలు నుంచి బయటికొచ్చేలా కనిపించడం లేదు. దీంతో బయట పార్టీని నడిపించడానికి నేతలు కరవయ్యారు. అతిశీ, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ పేర్లు వినిపిస్తున్నా.. వారికి పాలనా అనుభవం అంతంతే. రాజకీయంగానూ BJPకి ఎదురొడ్డి నిలబడటం కత్తి మీద సామే.

News March 23, 2024

ఉ.5.30 నుంచి 10.30 వరకే ఉపాధి పనులు: సీఎస్

image

AP: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని సీఎస్ జవహర్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎండలు విపరీతంగా ఉన్నందున కూలీలు అనారోగ్యానికి గురికాకుండా ఉదయం 5.30 నుంచి 10.30 వరకే పనులను నిర్వహించాలని సూచించారు. జూన్ నెలాఖరు వరకు కరవు మండలాల్లో తాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచినీటి పథకాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 23, 2024

కాంతార ప్రీక్వెల్‌లో రుక్మిణీ వసంత్?

image

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాంతార: చాప్టర్-1లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, లుక్ టెస్టులో ఆమె పాల్గొన్నారని తెలుస్తోంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాలో నటనతో ఆమె మెప్పించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ షూటింగ్ వేగంగా సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

News March 23, 2024

ఎల్లుండి మద్యం షాపులు బంద్

image

TG: హోళీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఎల్లుండి వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. రహదారులపై గుంపులుగా తిరిగినా కేసులు నమోదు చేయనున్నారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని పోలీసులు హెచ్చరించారు.