News June 13, 2024

మరి మా ప్రత్యేక హోదా సంగతి?: రఘువీరా రెడ్డి

image

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు కేంద్రంలోని ఇతర పెద్దలు హాజరయ్యారు. ఈక్రమంలో ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటు స్పెషల్ ప్యాకేజీపై వారిని ప్రశ్నించాలంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు సూచించారు. తాజాగా ‘ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రత్యేక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం’ అని మోదీ చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి రిప్లై ఇచ్చారు. ‘మరి మా ప్రత్యేక హోదా సంగతి?’ ఏంటి అని ప్రశ్నించారు.

News June 13, 2024

వాట్సాప్‌లో చాట్ ట్రాన్స్‌ఫర్ కోసం కొత్త ఫీచర్!

image

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘ట్రాన్స్‌ఫర్ చాట్ హిస్టరీ’ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. దీని ద్వారా యూజర్లు గూగుల్ డ్రైవ్‌ను యూజ్ చేయకుండానే పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యాప్ సెట్టింగ్స్‌లో QR కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉండగా, త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

News June 13, 2024

మార్చి 1న మరో హై ఓల్టేజ్ మ్యాచ్?

image

క్రికెట్‌లో మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భాగంగా వచ్చే ఏడాది మార్చి 1న లాహోర్‌లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నట్లు సమాచారం. PCB తయారు చేసిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌‌లో ఇది ఖరారైనట్లు తెలుస్తోంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లో జరగనుంది. కానీ అక్కడ ఆడేది లేదని భారత్ తెగేసి చెబుతోంది. ఎలాగైనా తమ దేశానికి భారత్‌ను రప్పించాలని PCB గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

News June 13, 2024

ఎర్రన్నాయుడు కుటుంబానికి CBN ప్రాధాన్యం

image

దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు పార్టీలో, ప్రభుత్వంలో విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడును కేంద్రమంత్రిని చేశారు. ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ TDP అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఎర్రన్నాయుడు అల్లుడు (కూతురు భవాని భర్త) వాసు ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. భవాని సైతం MLAగా పనిచేశారు.

News June 13, 2024

న్యూజిలాండ్‌కు షాక్.. సూపర్-8కు చేరిన విండీస్

image

టీ20WC: NZపై వెస్టిండీస్ విజయం సాధించింది. ఆ జట్టు 13 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. 150 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 136/9కే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ (40), అలెన్ (26) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4, మోతీ 3 వికెట్లతో చెలరేగారు. అంతకుముందు రూథర్‌ఫర్డ్ (68) వీరవిహారంతో విండీస్ 149/9 పరుగులు చేసింది. ఈ విజయంతో WI సూపర్-8కి చేరగా, NZకు బెర్త్ కష్టంగా మారింది.

News June 13, 2024

నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

image

ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాసేపట్లో తిరుపతి నుంచి బయల్దేరి ఉ.11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్లి దర్శించుకుంటారు. అనంతరం ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు. సా.4.41 గంటలకు సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. మెగా డీఎస్సీ సహా 5 ఫైళ్లపై సంతకాలు చేస్తారు.

News June 13, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు కొమురం భీం, MNCL, JGL, SDPT, సంగారెడ్డి, గద్వాల, WNP, నారాయణ పేట, PDPL, KNR, BPL, SRCL, MDK, MHBR, HMK, NGKL, WGL జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. అటు ఏపీలో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, గుంటూరు, బాపట్లతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

News June 13, 2024

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు?

image

AP: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంతోపాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఈ పదవి కోసం కొందరు TDP సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పీకర్ రేసులో కళా వెంకట్రావ్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రఘురామకృష్ణరాజు, ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.

News June 13, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ విడుదల

image

TG: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ని TGPSC విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను ఈనెల 17 వరకు స్వీకరించనుంది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ను సందర్శించండి.

News June 13, 2024

సూపర్-8లో అడుగుపెట్టడం బిగ్ రిలీఫ్: రోహిత్

image

టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8కు చేరుకోవడం బిగ్ రిలీఫ్ అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ‘న్యూయార్క్ పిచ్‌పై ఆడటం తేలికేమీ కాదు. ఇలాంటి పిచ్‌పైన 110+ స్కోరైనా ఛేదించడం కష్టమే. ఏ క్షణంలోనైనా ఫలితం తారుమారయ్యే ఛాన్స్ ఉంది. సూర్య, దూబే రాణించడంతో మ్యాచ్ గెలిచాం. లీగ్‌ దశలో మూడు మ్యాచుల్లో విజయం సాధించాం. దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో సూపర్-8లో ఆడతాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.