India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ తప్పుపట్టారు. ఈ స్పైవేర్ను యాపిల్ డివైజ్లలోకి తీసుకురావొద్దని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్కు సూచించారు. ఒకవేళ ఐఓఎస్లో ఓపెన్ఏఐ వస్తే తన సంస్థల్లో యాపిల్ డివైజ్లను బ్యాన్ చేస్తానని హెచ్చరించారు. ‘ఓపెన్ఏఐతో యూజర్ల ప్రైవసీకి భంగం కలగదని యాపిల్ నమ్ముతోంది. కానీ ఓపెన్ఏఐ చేతికి డేటా వెళ్తే ఏమవుతుందో ఆ కంపెనీకి తెలియదు’ అని పేర్కొన్నారు.
TG: ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తన పాత్ర ఏంటో వివరించాలని మాజీ సీఎం కేసీఆర్కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్తో ఒప్పందంపై ఈ నెల 30లోపు వివరణ ఇవ్వాలని సమన్లలో పేర్కొంది. కాగా జులై 30 వరకు తాను విచారణకు రాలేనని కేసీఆర్ తెలిపారు.
AP: సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి స్టేట్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. ఇవాళ సాయంత్రానికే ఆయన విజయవాడ చేరుకుని అక్కడే బస చేయనున్నారు. కాగా ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరవుతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
AP: ఎన్డీఏ కూటమి నేతలు అచ్చెన్నాయుడు, పురందీశ్వరి, నాదెండ్ల గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. తమ సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ అందించారు. దీంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఎన్డీఏను ఆహ్వానించనున్నారు. రేపు సీఎంగా చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
చంద్రబాబు కేబినెట్లో జనసేనాని పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన గౌరవం తగ్గకుండా మరెవరికీ ఈ పోస్టు ఇవ్వటం లేదని సమాచారం. ఆయన ఒక్కరికే ఈ పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. 2014లో టీడీపీ హయాంలో ఇద్దరు, 2019లో వైసీపీ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా కొనసాగారు. అటు టీడీపీకి 19, జనసేనకు 3, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే అవకాశముంది.
నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు వెస్టిండీస్ శుభవార్త చెప్పింది. తమ ప్రాంతంలో నేపాల్ ఆడే మ్యాచుల్లో సందీప్ పాల్గొనవచ్చని విండీస్ ప్రకటించింది. దీంతో నేపాల్ ఆడబోయే చివరి రెండు మ్యాచుల్లో ఆయన బరిలోకి దిగనున్నారు. కాగా తొలుత ఎంపిక చేసిన నేపాల్ జట్టులో సందీప్కు చోటు దక్కింది. కానీ అత్యాచార ఆరోపణలు ఉన్నాయన్న కారణంతో ఆయనకు USA వీసా నిరాకరించింది. దీంతో నేపాల్ ఆడిన తొలి మ్యాచులో ఆయన పాల్గొనలేదు.
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చిరు తప్పిదాలకు శిక్షలను తగ్గించాలని కేంద్రం భావిస్తోందట. ఉదాహరణకు ప్రస్తుతం టీడీఎస్ చెల్లింపు ఆలస్యమైతే మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో సంస్థల యాజమాన్యాలు సైతం చిక్కుల్లో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చిరు తప్పిదాలకు శిక్షను జరిమానాకు పరిమితం చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందట.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ మూడో సీజన్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. జులై 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఫస్ట్ సీజన్ 2018 నవంబర్లో రిలీజవగా రెండో సీజన్ 2020 అక్టోబర్లో స్ట్రీమింగ్ అయింది. ఈ రెండు సీజన్లు అత్యధిక మంది చూసిన ఇండియన్ సిరీస్ల్లో టాప్ ప్లేస్లో నిలిచాయి.
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కాంబోలో మరో సినిమా ప్రారంభమైంది. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్తో భాను భోగవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడనున్నట్లు టాక్. భీమ్స్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. కాగా గతంలో రవితేజ, శ్రీలీల కలిసి ‘ధమాకా’ సినిమాలో నటించారు. ఈ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
నిన్న అంపైర్ తప్పుడు నిర్ణయం, ICC రూల్స్ వల్ల బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. సౌతాఫ్రికాపై 16.2వ బంతికి బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లాను అంపైర్ LBWగా ప్రకటించారు. ఆ బంతి ప్యాడ్కు తగిలి బౌండరీకి వెళ్లింది. బంగ్లా రివ్యూకు వెళ్లగా అది నాటౌట్ అని తేలింది. రూల్స్ ప్రకారం అంపైర్ నిర్ణయం తీసుకోగానే అది డెడ్ బాల్గా మారుతుంది. దీంతో బౌండరీ వెళ్లినా ఫోర్ ఇవ్వలేదు. చివరికి బంగ్లా 4 రన్స్ తేడాతో ఓడింది.
Sorry, no posts matched your criteria.