News June 10, 2024

రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ

image

కేంద్రమంత్రి పదవులను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైన టీడీపీకి ఇదే శాఖ కేటాయించారు. అప్పటి విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ కేబినెట్ మంత్రిగా పని చేశారు.

News June 10, 2024

BREAKING: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

image

* జేపీ నడ్డా – వైద్యశాఖ
* భూపేంద్రయాదవ్ – పర్యావరణశాఖ
* గజేంద్రసింగ్ షెకావత్ – సాంస్కృతికం&పర్యాటకం
* కిరణ్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాలు
* శ్రీపాదనాయక్ – విద్యుత్ శాఖ(సహాయ)
* ధర్మేంద్ర ప్రధాన్ – విద్య, మానవవనరుల అభివృద్ధి
* మన్‌సుఖ్ మాండవియా – కార్మికశాఖ, క్రీడలు
* సురేశ్ గోపీ – సాంస్కృతికం&పర్యాటకం(సహాయ మంత్రి)

News June 10, 2024

BREAKING: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

image

* అమిత్ షా – హోంమంత్రిత్వశాఖ
* జైశంకర్‌ – విదేశాంగశాఖ
* రాజ్‌నాథ్ సింగ్‌ – రక్షణ మంత్రిత్వ శాఖ
* నిర్మలా సీతారామన్‌ – ఆర్థిక శాఖ
* అశ్వినీ వైష్ణవ్ – రైల్వే శాఖ, సమాచార&ప్రసార శాఖ
* హర్దీప్ సింగ్ పూరి – పెట్రోలియం శాఖ
* పీయూష్ గోయల్ – వాణిజ్యం
* శివరాజ్‌సింగ్ చౌహాన్ – వ్యవసాయం
* జితన్‌రామ్ మాంజీ – MSME
* మనోహర్‌లాల్ ఖట్టర్ – హౌసింగ్&అర్బన్ డెవలప్మెంట్

News June 10, 2024

అమెరికాలో గుండెపోటుతో MCA అధ్యక్షుడు మృతి

image

ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే గుండెపోటుతో న్యూయార్క్‌లో కన్నుమూశారు. ఇండియాVS పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు MCA సెక్రటరీ అజింక్యా నాయక్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సూరజ్ సమత్‌తో కలిసి ఆయన న్యూయార్క్‌కు వెళ్లారు. ఇండియా గెలిచాక స్టేడియంలో ఆయన సంబరాలు చేసుకున్న ఫొటోలు వైరలవుతున్నాయి. కాలే 2022లో ఎంసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

News June 10, 2024

ఆ స్కూళ్లను మూసివేయొద్దు: సీఎం రేవంత్

image

TG: విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు మూసివేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News June 10, 2024

T20 WC: ఎమోషనల్ డ్యామేజ్ చేశారు: ఆనంద్ మహీంద్రా

image

T20WCలో పాక్‌పై భారత్ విజయం సాధించిన తీరుపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘టీమ్ఇండియా లోస్కోరుకే పరిమితం కావడంతో దాయాది చేతిలో ఓటమి తప్పదనే భావనను మాకు కలిగించింది. కానీ తీవ్ర ఒత్తిడిలో మన ప్లేయర్లు విజయాన్ని పాక్ నుంచి లాక్కొని వారికి ఘోర అవమానాన్ని మిగిల్చారు. రోహిత్ సేన ఎదురుదాడి దారుణం. ఆటలో మీరెప్పటికీ హీరోలుగా ఉండాలి. ఇదే నేను మీకు విధిస్తున్న శిక్ష’ అని పేర్కొన్నారు.

News June 10, 2024

కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు

image

AP: ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు కేబినెట్ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. జిల్లాలు, సామాజిక వర్గాలు, సీనియర్ MLAలు ఇలా పలు అంశాల వారీగా మంత్రులుగా అవకాశం కల్పించాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. తమకు అవకాశం కల్పించాలని పలువురు ఆశావహులు ఉండవల్లిలోని CBN ఇంటికి క్యూ కడుతున్నారు. అటు జనసేనకు 5 పదవులు దక్కే ఛాన్సుంది.

News June 10, 2024

త్వరలో ఇటలీకి ప్రధాని మోదీ!

image

మూడో టర్మ్‌లో తొలి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటలీలో ఈనెల 13-15 మధ్య జీ7 సదస్సు జరగనున్న నేపథ్యంలో మోదీ ఆ దేశంలో పర్యటించనున్నట్లు సమాచారం. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానాన్ని మోదీ స్వాగతించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. జూన్ 14న జరిగి సమావేశంలో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జీ7 దేశాల నేతలతో ప్రధాని సమావేశమయ్యే అవకాశం ఉంది.

News June 10, 2024

BREAKING: గడ్కరీకి రోడ్లు, రవాణాశాఖ

image

కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు మొదలైంది. గతంలో రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా పని చేసిన నితిన్ గడ్కరీకి మరోసారి అదే శాఖను కేటాయించారు. సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా, అజయ్ టమ్టా ఉండనున్నారు.

News June 10, 2024

TG BJP ఎంపీలను అభినందించిన తమిళి సై

image

తెలంగాణలో గెలుపొందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఈ ఎంపీల బృందం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో రెండు వారాల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని వీరి విజయంలో పాలుపంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. చెన్నై సౌత్ నుంచి బీజేపీ తరఫున MPగా పోటీ చేసి తమిళిసై ఓడిపోయారు.