News June 8, 2024

రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు

image

రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేసింది. సంతాప సూచికగా రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. RFCలో ఆయన పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

News June 8, 2024

మోదీ ప్రమాణ స్వీకారానికి 7 పొరుగు దేశాల లీడర్లు

image

రేపు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాల లీడర్లు రానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అఫీఫ్, మారిషస్ PM ప్రవింద్, నేపాల్ PM పుష్ప కమల్ దహల్, భూటాన్ PM షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ PM షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు హాజరుకానున్నారు. కొన్ని నెలలుగా భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ముయిజ్జు రానుండటం ఆసక్తికరంగా మారింది.

News June 8, 2024

పదేళ్ల తర్వాత J&Kలో అసెంబ్లీ ఎన్నికలు!

image

J&Kలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. చివరగా 2014లో J&K అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు BJP-PDP కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగా ముఫ్తీ మహ్మద్ సయ్యద్ CMగా ఎన్నికయ్యారు. 2016లో ఆయన మరణానంతరం కూతురు మెహబూబా ముఫ్తీ CM అయ్యారు. అయితే 2016లో PDPకి BJP మద్దతు ఉపసంహరించుకోవడంతో J&Kలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.

News June 8, 2024

ఎన్నికల్లో విజయం.. లోకేశ్‌కు రూ.237 కోట్ల ఆదాయం

image

కేంద్రంలో బీజేపీకి మెజారిటీ రాకపోవడం, 16 స్థానాలు సాధించిన టీడీపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు భారీగా పెరిగాయి. జూన్ 3న రూ.424గా ఉన్న హెరిటేజ్ షేర్ ఇప్పుడు రూ.661కి చేరింది. దీంతో 5 రోజుల్లోనే నారా లోకేశ్ రూ.237.8 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్‌కు 1,00,37,453 షేర్లు ఉన్నాయి.

News June 8, 2024

మీడియా, వినోద రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది: ముర్ము

image

రామోజీరావుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. ‘భారత మీడియా, వినోద రంగం రామోజీలాంటి దిగ్గజాన్ని కోల్పోయింది. వ్యాపారవేత్త, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ న్యూస్ నెట్‌వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీతో సహా అనేక సంస్థలకు ఆయన మార్గదర్శకుడు. పద్మవిభూషణుడు. ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని Xలో పోస్ట్ చేశారు.

News June 8, 2024

ఉత్తమ జర్నలిస్టులను అందించిన అక్షర యోధుడు

image

మీడియా మొఘల్ రామోజీరావు తెలుగు సమాజానికి ఎంతో మంది నిఖార్సైన జర్నలిస్టులను అందించారు. ‘ఈనాడు జర్నలిజం స్కూల్’ ద్వారా వేలాది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడున్న టీవీ ఛానల్స్, పత్రికల్లో పనిచేసే ఎడిటర్లు, రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల్లో ఎక్కువ శాతం మంది EJSలో ట్రైనింగ్ పొందినవాళ్లే. ఇక్కడ శిక్షణ పొందారంటే క్రమశిక్షణ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లక్షణాలు అలవడుతాయని ప్రతీతి.

News June 8, 2024

T20WCలో సంచలనాలు.. ఆ మ్యాచ్‌పై ఆసక్తి

image

టీ20 వరల్డ్ కప్‌లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. పసికూనలుగా అడుగుపెట్టిన జట్లు బలమైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నాయి. జూన్ 5న PNGపై ఉగాండా గెలవగా, జూన్ 6న పాకిస్థాన్‌ను USA ఓడించింది. నిన్న ఐర్లాండ్‌ను కెనడా ఓడించగా, తాజాగా న్యూజిలాండ్‌ను అఫ్గానిస్థాన్ చిత్తు చేసింది. నేడు నెదర్లాండ్స్, సౌతాఫ్రికా మ్యాచ్ ఉంది. ఇప్పటికే వరల్డ్ కప్‌ టోర్నీల్లో SAను NED రెండుసార్లు ఓడించింది. ఈరోజు ఏమవుతుందో?

News June 8, 2024

ప్రజల హృదయాల్లో రామోజీరావు చెరగని ముద్రవేశారు: కిషన్ రెడ్డి

image

రామోజీరావు మృతి పట్ల TBJP చీఫ్ జి.కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘చిత్తశుద్ధి, అంకితభావంతో కష్టించి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి రామోజీరావు జీవితం ఒక చక్కటి ఉదాహరణ. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన చెరగని ముద్రవేశారు. జర్నలిజానికి ఓ గొప్ప గుర్తింపును కల్పించారు. ఆయన రాసిన ప్రతి అక్షరం, వేసిన ప్రతి అడుగూ తెలుగుదనమే’ అని పేర్కొన్నారు. రామోజీరావు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.

News June 8, 2024

రామోజీ రావుకు నివాళులర్పిస్తున్న ప్రముఖులు

image

రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచగా నటుడు జూ.ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి నివాళులర్పించారు. ఆయనకు నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ సిటీకి పయనమయ్యారు.

News June 8, 2024

రామోజీరావును ‘భారతరత్న’తో సత్కరించాలి: రాజమౌళి

image

రామోజీరావు మృతిపట్ల దర్శకధీరుడు రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు. తన కృషితో 50 ఏళ్లుగా ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన ఆయనను ‘భారతరత్న’తో సత్కరించాలని అన్నారు. అదే ఆయనకు మనమిచ్చే ఘననివాళి అని పేర్కొన్నారు. రామోజీరావు భారతీయ మీడియాలో విప్లవాత్మక కృషి చేశారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని నటుడు దగ్గుబాటి వెంకటేశ్ ట్వీట్ చేశారు.