News June 8, 2024

రామోజీరావును ‘భారతరత్న’తో సత్కరించాలి: రాజమౌళి

image

రామోజీరావు మృతిపట్ల దర్శకధీరుడు రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు. తన కృషితో 50 ఏళ్లుగా ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన ఆయనను ‘భారతరత్న’తో సత్కరించాలని అన్నారు. అదే ఆయనకు మనమిచ్చే ఘననివాళి అని పేర్కొన్నారు. రామోజీరావు భారతీయ మీడియాలో విప్లవాత్మక కృషి చేశారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని నటుడు దగ్గుబాటి వెంకటేశ్ ట్వీట్ చేశారు.

News June 8, 2024

రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు

image

AP: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని పట్టణ, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు వసూళ్లు నిలిపివేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున వసూలు చేసిన సంగతి తెలిసిందే.

News June 8, 2024

గ్రూప్ టాపర్‌గా అమెరికా.. PAKకు ఝలక్?

image

తొలిసారి T20WC ఆడుతున్న USA రెండు మ్యాచుల్లోనూ గెలిచి ప్రస్తుతం గ్రూప్-ఏ టాపర్‌గా ఉంది. ఆ తర్వాత భారత్, కెనడా, పాకిస్థాన్, ఐర్లాండ్ ఉన్నాయి. PAKపై గెలుపుతో USAకు సూపర్8పై ఆశలు చిగురించాయి. ఆ జట్టుకు భారత్, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లున్నాయి. భారత్‌తో ఓడినా.. ఫామ్‌లో లేని ఐర్లాండ్‌ను ఓడించడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ అదే జరిగితే IND, USA సూపర్8 వెళ్లొచ్చు. పాక్ గ్రూప్ స్టేజీలోనే నిష్క్రమించక తప్పదు.

News June 8, 2024

రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్

image

మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.

News June 8, 2024

రామోజీ మృతిపై KTR, హరీశ్, షర్మిల సంతాపం

image

రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై పొలిటికల్ లీడర్లు KTR, హరీశ్, షర్మిల సంతాపం ప్రకటించారు. ‘రామోజీ మృతితో బాధపడ్డాను. రామోజీ స్వీయ నిర్మిత వ్యక్తి, ఆయన కథ స్ఫూర్తిదాయకం’ అని కేటీఆర్ అన్నారు. ‘అనేక రంగాల్లో అద్భుత విజయాలందుకుని, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు’ అని షర్మిల.. ‘రామోజీరావు తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

News June 8, 2024

వందేభారత్ రైళ్ల సగటు వేగం 76.25Kmphకి తగ్గింది: RTI

image

వందేభారత్ రైళ్ల సగటు వేగం గత మూడేళ్లలో 84.48Kmph నుంచి 76.25Kmphకి తగ్గిందని RTI కింద అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానమిచ్చింది. ఈ రైళ్ల గరిష్ఠ వేగం ఢిల్లీ-ఆగ్రా మార్గంలో 160KM ఉండగా, మిగతా ప్రాంతాల్లో 130km లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఆ పనులు పూర్తయిన తర్వాత రైళ్లు 250km వేగంతో వెళ్తాయని చెబుతున్నారు.

News June 8, 2024

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలుపు

image

టీ20వరల్డ్ కప్‌లో శ్రీలంకకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9వికెట్లకు 124 రన్స్ మాత్రమే చేసింది. ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఓటమితో శ్రీలంక సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

News June 8, 2024

ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

image

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ అక్కడి నుంచే సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.

News June 8, 2024

‘తెలుగు’ బతకాలని.. తెలుగీకరించి..

image

తెలుగు భాష నిత్యమై, నిఖిలమై వెలగాలని ఆకాంక్షించిన వారిలో రామోజీరావు ముందుంటారు. మన భాషలో ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ పదాలను తెలుగీకరించేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ‘తెలుగు వెలుగు’ మాసపత్రికకు శ్రీకారం చుట్టారు. ‘ఈనాడు’లోనూ ఆయన పరభాష పదాల నియంత్రణకు కృషి చేశారు. ప్రతి పదాన్నీ తెలుగీకరించే క్రమంలో విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. అయినా పట్టించుకోకుండా తెలుగుపై అభిమానాన్ని మాత్రం చంపుకోలేదాయన.

News June 8, 2024

బంగ్లాదేశ్‌ పోర్టుపై భారత్ కన్ను.. చైనాకు చెక్?

image

వ్యూహాత్మకంగా ఇరాన్‌లో చాబహార్, మయన్మార్‌లో సిట్వే పోర్టులను నిర్మించిన భారత్ ఇప్పుడు మరోసారి చైనాను దెబ్బకొట్టాలని భావిస్తోంది. బంగ్లాదేశ్‌లోని మోంగ్లా పోర్టులో కొత్త టెర్మినల్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. చైనా సైతం ఈ పోర్టు నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ భారత్ ఇందులో సక్సెస్ అయితే విదేశాల్లోని తమ ప్రమేయాన్ని విస్తరించాలన్న చైనా వ్యూహాలకు చెక్ పడినట్లు అవుతుంది.