India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
T20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టై అయిన రెండు మ్యాచ్లలో ఓడిన తొలి జట్టుగా నిలిచింది. 2007లో భారత్ చేతిలో ‘బౌల్ ఔట్’లో పాక్ ఓడిపోగా, నిన్న పసికూన అమెరికా కూడా ఆ జట్టుపై సూపర్ ఓవర్లో సంచలన <<13394149>>విజయం<<>> సాధించింది. 2012లో కివీస్పై శ్రీలంక, విండీస్పై న్యూజిలాండ్, ఈ ఏడాది ఒమన్పై నమీబియా సూపర్ ఓవర్లో గెలిచాయి.
AP: టీడీపీ గూండాలు మాజీ మంత్రి కొడాలి నాని ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారని వైసీపీ చేసిన ట్వీట్కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ‘వైసీపీది ఫేక్ న్యూస్. రోడ్డు మీద కార్లో వెళ్తూ.. టీడీపీ మహిళలపై గుట్కా ఊసి కారు దిగి పారిపోయిన గుట్కా నానిపై కోడి గుడ్లు వేసి తమ భావ ప్రకటనా స్వేచ్ఛ తెలియజేశారు’ అంటూ టీడీపీ పోస్ట్ పెట్టింది.
దక్షిణాఫ్రికాలో నిర్వహించే SA20 లీగ్ మూడో సీజన్ తేదీలు వెల్లడయ్యాయి. 2025 జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన రెండు సీజన్లలోనూ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్గా నిలిచింది. SRH ఓనర్ కావ్య మారన్ ఈ జట్టుకు కూడా యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి.
సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్ డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించినందుకు బాలయ్యను డైరెక్టర్లు గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ కలిసి అభినందించారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే గోపీచంద్ డైరెక్షన్లో వీరసింహారెడ్డి, అనిల్ దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రాల్లో ఆయన నటించారు.
TG: ఎన్నికల కోడ్ వల్ల కాళేశ్వరంపై ఇన్నాళ్లూ సమీక్షలు చేయలేదని, ఇకపై మరమ్మతులు వేగవంతం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన సుందిళ్ల బ్యారేజీ వద్ద పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన రూ.94వేల కోట్ల అప్పునకు వడ్డీ కడుతున్నాం. BRS హయాంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పగుళ్లతో ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది’ అని పేర్కొన్నారు.
AP: మాజీ CM జగన్ వైఖరి వల్లే ఎన్నికల్లో YCP ఘోరంగా ఓడిపోయిందని TDP నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ చేసిన అరాచకాలే ఆ పార్టీని నాశనం చేశాయని చెప్పారు. ‘బటన్లు నొక్కినంత మాత్రాన మీరు చేసిన నేరాలు-ఘోరాలు ప్రజలు మర్చిపోరు. YCP పాలనలో దళితులపై దాడులు, అరాచకాలు పెరిగిపోయాయి. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారు’ అని ఆయన జగన్పై మండిపడ్డారు.
TG: కాసేపట్లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని GHMC హెచ్చరించింది. అత్యవసరం అయితే 040-21111111 లేదా 9000113667కు కాల్ చేయాలని సూచించింది. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్తో పాటు నగరంలోని మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబం మొత్తం కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు నటి పూనమ్ కౌర్ తెలిపారు. ‘గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలది కీలకపాత్ర. వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పారు. ఇప్పుడు వారంతా కలిసుండాలని కోరుకుంటున్నా’ అని కౌర్ ట్వీట్ చేశారు.
కౌంటింగ్ రోజున దారుణ నష్టాలను చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 3 రోజులు పైకెగిశాయి. ఇవాళ సెన్సెక్స్ ఒకదశలో 1,620 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి 76,795కు చేరింది. చివరకు 76,694 వద్ద ముగిసింది. నిఫ్టీ 446 పాయింట్లు ఎగసి 23,267 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు రూ.7 లక్షల కోట్లు లాభపడ్డారు. రెపో రేట్లలో <<13395338>>RBI<<>> మార్పులు చేయకపోవడం, మోదీ 3.Oకు చేరువవడం మార్కెట్లకు కలిసి వచ్చినట్లు నిపుణుల అంచనా.
టీ20 వరల్డ్కప్లో తమపై వివక్ష చూపుతున్నారని శ్రీలంక క్రికెట్ ICCకి ఫిర్యాదు చేసింది. సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఒక్కో జట్టును ఒక్కోలా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించింది. 4 మ్యాచ్లు 4 వేదికల్లో ఉండటం వల్ల ప్రయాణానికే సమయం సరిపోతోందని వాపోయింది. హోటల్ దూరంగా ఉండడంతో ప్రాక్టీస్ గ్రౌండ్కు వెళ్లలేకపోతున్నామని పేర్కొంది. తమకు న్యాయం చేయాలని కోరింది.
Sorry, no posts matched your criteria.