News June 5, 2024

ఐక్యత వల్లే ఏపీలో కూటమి విజయం: నారాయణ

image

ఏపీలో కూటమి విజయానికి కూటమి పార్టీల మధ్య ఐక్యతే కారణమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. APలో ఓట్లే లేని BJPకి సీట్లు రావడానికి ఈ ఐక్యతే కారణమని వ్యాఖ్యానించారు. ఇదే లోపించి తెలంగాణలో కాంగ్రెస్‌కు MP సీట్లు తగ్గాయని చెప్పారు. సీట్లు, ఓట్లు లేవని పార్టీలను పక్కన పెట్టడం వల్లే కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను సాధించలేదని.. ఈ విషయంలో డీఎంకే స్టాలిన్‌ను కాంగ్రెస్ ఆదర్శంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు.

News June 5, 2024

చంద్రబాబు మాటలతో స్టాక్ మార్కెట్లో జోష్

image

‘మేం NDAతోనే ఉంటాం’ అన్న చంద్రబాబు మాటలు స్టాక్ మార్కెట్లో జోష్ పెంచాయి. మరోసారి బలమైన మోదీ ప్రభుత్వాన్ని చాలామంది ఆశించారు. అంచనాలు తప్పి BJPకి 240 సీట్లే రావడం, బాబు, నితీశ్‌పై సందేహాలతో మార్కెట్లు క్రాష్ అయ్యాయి. నేటి ఉదయం ప్రెస్‌మీట్లో NDAకు చంద్రబాబు జైకొట్టడంతో పాజిటివ్ సెంటిమెంటుతో సూచీలు పెరిగాయని ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాశ్ గోరక్షకర్ అన్నారు. దీనిపై మీ స్పందనేంటి?

News June 5, 2024

లోక్‌సభ రిజల్ట్: అమెరికా స్పందన ఏంటంటే!

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అమెరికా తటస్థ వైఖరి ప్రదర్శించింది. విజేతలు, పరాజితులపై మాట్లాడబోమని తెలిపింది. ‘అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా ముగించినందుకు భారత ప్రభుత్వం, ప్రజలకు అభినందనలు. ఆరు వారాల్లో వివిధ దశల్లో ఓటింగ్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ విన్నర్స్, లూజర్స్ గురించి మేం స్పందించం. ఇక్కడా అంతే’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.

News June 5, 2024

పల్నాడులో రక్తచరిత్ర.. ఇకనైనా ఆగేనా?

image

AP: గతంలో ఫ్యాక్షనిజం అంటే రాయలసీమ పేరు వినిపించేంది. ఇప్పుడు పల్నాడు పేరు మారుమోగుతోంది. ఈ ప్రాంతం చాన్నాళ్లు ప్రశాంతంగానే ఉన్నా.. ఐదేళ్లలో ఫ్యాక్షన్ పడగ విప్పింది. పార్టీలు, ఆధిపత్య పోరులో కుత్తుకలు తెగాయి. TDP కార్యకర్త చంద్రయ్యను నడిరోడ్డుపై చంపిన తీరు చూసి రాష్ట్రం ఉలిక్కిపడింది. పోలింగ్ రోజున చెలరేగిన హింసను చూసి దేశం నివ్వెరపోయింది. మరి కొత్త ప్రభుత్వంలోనైనా పల్నాడు చల్లబడుతుందేమో చూడాలి.

News June 5, 2024

ఓడినా.. తగ్గేదేలే అంటున్న స్మృతి

image

ఓటమి తర్వాత ‘హౌ ఈజ్ ద జోష్ అంటే హై సర్’ అనే అంటానని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. అమేథీలో కేఎల్ శర్మ ఆమెపై 1.6 లక్షల ఓట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ‘జీవితమంటే ఇంతే. పదేళ్లలో గ్రామగ్రామాన తిరిగాను. రోడ్లు, కాలువలు, బైపాస్‌లు, మెడికల్ కాలేజీలు, ఇళ్లు కట్టించాను. ఏదేమైనా గెలుపు, ఓటముల్లో నాకు అండగా ఉన్న అందరికీ రుణపడి ఉంటాను. వేడుకలు చేసుకుంటున్న వారికి అభినందనలు’ అని ఆమె అన్నారు.

News June 5, 2024

ఒడిశా సీఎం రేసులో ఎవరంటే?

image

ఒడిశాలో తొలిసారిగా అధికారం చేపట్టనున్న BJP నుంచి పలువురు అభ్యర్థుల పేర్లు CM రేసులో వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ జువల్ ఓరమ్, పార్టీ ప్రతినిధి సంబిత్ పాత్ర, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వైజయంత్ పాండా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం గమనార్హం. దీంతో అధిష్ఠానం ఎవరికి అధికారం కట్టబెడుతుందో త్వరలోనే స్పష్టత రానుంది.

News June 5, 2024

400 సీట్ల మార్క్‌ను చేరింది ఒక్కసారే..

image

ప్రధాని మోదీ 400 సీట్లు గెలుచుకోవాలనుకున్న కోరిక నెరవేరలేదు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఇది సాధ్యమైంది. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు గెలుచుకుంది. అప్పుడు ఆ పార్టీ 48.12శాతం ఓట్లు పొందింది. సీపీఐ 22 సీట్లు సాధించి 5.71శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. 7.4శాతం ఓట్లతో బీజేపీకి 2 సీట్లు వచ్చాయి.

News June 5, 2024

రాజ్యాంగాన్ని కాపాడేందుకు చంద్రబాబు NDAను వీడాలి: సిన్హా

image

చంద్రబాబు, నితీశ్ కుమార్ తక్షణమే NDAని వీడి INDIA కూటిమిలో చేరాలని కేంద్ర
మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కోరారు. ‘భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వీరు నిర్ణయం తీసుకోవాలి. దేశ భవిష్యత్తును మోదీ నాశనం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను బయపెట్టేందుకు ED, CBI, IT ఏజెన్సీలను వాడుకున్నారు. దేవుడి బిడ్డగా పిలుచుకునే ఈ వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు’ అని Xలో పోస్ట్ చేశారు.

News June 5, 2024

చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు: జగన్ మేనమామ

image

AP: EVMలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని జగన్ మేనమామ, కమలాపురం మాజీ MLA <<13377622>>రవీంద్రనాథ్<<>> రెడ్డి ఆరోపించారు. ‘సింగపూర్‌లో కూర్చొని టెక్నికల్‌గా ట్యాంపరింగ్ చేశారు. బార్‌కోడ్‌ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నాం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగింది. దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.

News June 5, 2024

ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు, పవన్

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయల్దేరారు. మోదీ నివాసంలో జరిగే ఎన్డీఏ సమావేశంలో వీరిద్దరు పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. మరోవైపు అమరావతిలో జరిగే తన ప్రమాణస్వీకారానికి మోదీని చంద్రబాబు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.