India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రిటైరయ్యాక విరాట్ కోహ్లీ లండన్లో స్థిరపడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ తెలిపారు. ‘కుటుంబంతో కలిసి విరాట్ తన విశ్రాంత జీవనాన్ని UKలో గడుపుతారు. అందుకోసం ఆయన ఇప్పటికే అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. త్వరలోనే పూర్తిగా లండన్ షిఫ్ట్ అవుతారు’ అని వెల్లడించారు. కాగా.. ఇటీవలి కాలంలో కోహ్లీ విరామం దొరికినప్పుడు లండన్లోనే సమయం గడుపుతున్న సంగతి తెలిసిందే. వారి కుమారుడు అకాయ్ లండన్లోనే జన్మించాడు.
జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో గుర్తుతెలియని వింత వ్యాధి భయపెడుతోంది. ఈ మిస్టీరియస్ రోగంతో ఒకే గ్రామంలో 2 కుటుంబాల్లో 8 మంది మరణించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏంటో తెలియదు? ఎలా వస్తుందో తెలియదు? ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నా రోగులు చనిపోతుండటం, ఒకర్నుంచి మరొకరికి సోకుతుండటం కలవరపెడుతోంది. దీంతో ప్రభుత్వం హుటాహుటిన BSL-3 మొబైల్ లేబోరేటరీని అక్కడికి పంపించి పరిశోధనలు చేయిస్తోంది.
AP: జనవరిలో రాజధాని అమరావతి పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ పనులకు ఈ నెల 22 నుంచి టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. ‘హడ్కో రుణంతో చేపట్టే పనులు సంక్రాంతికి మొదలవుతాయి. అలాగే వరల్డ్ బ్యాంక్ నిధులతో చేసే పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
>క్యాబినెట్, ఆర్థిక శాఖల అనుమతి లేకుండా ₹45 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించాలని ఆదేశించి ప్రజాధనం దుర్వినియోగం చేశారనేది KTRపై ఆరోపణ
>మౌఖిక ఆదేశాలతో, RBI రూల్స్ ఫాలో కాకుండా నగదు బదిలీతో ₹8 కోట్లు ఫైన్గా అదనంగా నష్టం చేకూర్చారనేది IAS అర్వింద్, KTRలపై ఆరోపణ
>₹10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపునకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి ఉండాలన్న రూల్ బుక్ను HMDA ఫాలో కాలేదు- చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిపై అభియోగం
KTRపై అవినీతి <<14924408>>నిరోధక<<>> చట్టంలోని 13(1)(ఏ), 13(2), BNSలోని 409, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదైంది. 13(1)(ఏ): ప్రజాప్రతినిధి తన స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం లేదా తన అధీనంలోని వారికి లబ్ధి చేకూర్చడం. 13(2): ప్రజాప్రతినిధి నేరాలకు పాల్పడటం. 409: ఆస్తుల్ని సంరక్షించాల్సిన ప్రజాప్రతినిధి తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడం, 120(B): చట్టవిరుద్ధమైన పని చేసేందుకు కుట్ర పన్నడం
TG: ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన FIR కాపీని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో సమర్పించారు. ఆయనపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపారు. కాగా కేటీఆర్పై ఏసీబీ నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
BJPపై కాంగ్రెస్ కేసు నమోదు చేసింది. ‘బీజేపీ దౌర్జన్యం’ పేరుతో పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ‘సభలో అంబేడ్కర్ను అమిత్ షా అవమానించారు. దానిపై మేమీరోజు నిరసన చేపట్టాం. ఇండియా కూటమి ఎంపీలంతా మకరద్వారం వద్దకు వెళ్లాం. అప్పటికే అక్కడున్న బీజేపీ సభ్యులు మమ్మల్ని తోసేసి ఖర్గే, రాహుల్తో అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే బీజేపీ దాదాగిరీపై ఫిర్యాదు చేశాం’ అని కాంగ్రెస్ తెలిపింది.
TG: కేంద్రం తెచ్చిన ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంకు నినాదం ప్రకారం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన TG బ్రాంచులు విలీనం కానున్నాయి. జనవరి 1, 2025 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు తమ శాఖపరమైన, ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవని TGB తెలిపింది. 27వ తేదీలోపు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవాలని కోరింది.
రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ జియో పొలిటికల్ సమీకరణాలను పూర్తిగా మార్చేయనుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ వాణిజ్యాన్ని శాసించేది ఆయుధ, ఆయిల్, ఫార్మా రంగాలే. ఆరోగ్యం పేరుతో కోటాను కోట్ల వ్యాపారం సాగుతోంది. అందులో క్యాన్సర్పై పెట్టే ఖర్చు అపారం. దీనిని ముందుగా రష్యా క్యాపిటలైజ్ చేసుకొనే అవకాశం ఉండటంతో US సహా వెస్ట్రన్ కంట్రీస్కు మింగుడు పడటం లేదని సమాచారం. అవి కౌంటర్ స్ట్రాటజీ రచిస్తాయని అంచనా.
కాంగ్రెస్ అగ్రనేత, LOP రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీస్ స్టేషన్లో BJP కేసు పెట్టింది. దాడి చేశారని, దాడికి పురికొల్పారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. పార్లమెంటు మకర ద్వారం బయట ఏం జరిగిందో పోలీసులకు వివరించామని, శాంతియుతంగా నిరసిస్తున్న తమపై దాడి చేసినట్టు MP అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 109, 117, 125, 131, 351 సెక్షన్ల కింద కేసు పెట్టామన్నారు. 109 అటెంప్ట్ టు మర్డర్, 117 స్వయంగా గాయపరచడం కిందకు వస్తాయి.
Sorry, no posts matched your criteria.