News June 5, 2024

ప్రారంభమైన కౌంటింగ్

image

TG: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు <<13382331>>ప్రక్రియ<<>> ప్రారంభమైంది. ఈ స్థానంలో ప్రధాన అభ్యర్థులుగా రాకేశ్ రెడ్డి(BRS), తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్), ప్రేమేందర్ రెడ్డి(బీజేపీ), అశోక్(స్వతంత్ర) బరిలో ఉన్నారు. నిన్న వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.

News June 5, 2024

తప్పు చేసిన వారిపై చర్యలుంటాయ్: లోకేశ్

image

AP: ప్రభుత్వంలో తన పాత్ర ఏంటో చంద్రబాబు నిర్ణయిస్తారని నారా లోకేశ్ చెప్పారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. వైసీపీ చేసిన తప్పులు చేయకుండా రాష్ట్రాన్ని దారిలో పెడతామన్నారు. ఆస్తుల ధ్వంసం, వేధింపులు, దొంగ కేసులు పెట్టడం తమకు తెలియదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన, తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. విభజన హామీల అమలు కోసం కేంద్రాన్ని అడుగుతామన్నారు.

News June 5, 2024

సెలవుపై విదేశాలకు సీఐడీ బాస్

image

AP: చంద్రబాబుపై పలు కేసులు, ఆయన అరెస్టులో కీలక పాత్ర వహించిన CID అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై వెళ్తున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఆయన దరఖాస్తు చేసుకోగా.. సీఎస్ జవహర్ రెడ్డి వెంటనే అనుమతించడం గమనార్హం. ఇటు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన కీలక దస్త్రాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి.

News June 5, 2024

జగన్ సభలకు పోటెత్తిన జనం.. అయినా అంతుచిక్కని ఫలితం!

image

AP ఎన్నికల ప్రచారంలో భాగంగా YCP నిర్వహించిన సిద్ధం సభలకు లక్షల సంఖ్యలో జనం ఉప్పెనలా వచ్చారు. జగన్ బస్సుయాత్రలోనూ పోటెత్తారు. ఆ తర్వాత ప్రచార సభలకూ బ్రహ్మరథం పట్టారు. ఫలితాల్లో మాత్రం 11 MLA, 4 MP సీట్లతో YCPకి ఘోర ఓటమిని కట్టబెట్టారు. రాయలసీమలోని వైసీపీ కంచుకోటలనూ కూటమి బద్దలుకొట్టింది. తమ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా? అనేలా అంతుచిక్కని ఫలితాలు రావడంతో YCP శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.

News June 5, 2024

బీఆర్ఎస్‌కు ఇదే తొలిసారి

image

TG: BRS పార్టీ తొలిసారిగా లోక్‌సభ ప్రాతినిధ్యం కోల్పోయింది. పార్టీ ఏర్పడిన 23 ఏళ్లలో గులాబీ పార్టీకి ఇలాంటి ఘోర పరాభవం ఇదే తొలిసారి. 2004లో కాంగ్రెస్‌తో పొత్తుగా బరిలో దిగి 5 చోట్ల విజయం సాధించింది. 2009లో 2, 2014లో 11, 2019లో 9 చోట్ల గెలుపొందింది. ఈ ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు ప్రతిపక్ష హోదా కట్టబెట్టిన ఓటర్లు ఈ ఎన్నికల్లో మాత్రం తిరస్కరించారు.

News June 5, 2024

నీట్ ఫలితాలు.. కటాఫ్ ఎంతంటే?

image

నిన్న వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ నుంచి 43,858 మంది, తెలంగాణలో 47,371 మంది అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు వంద లోపు ర్యాంకుల్లో నిలిచారు. పరీక్ష 720 మార్కులకు నిర్వహించగా జనరల్ విభాగం కటాఫ్ 164, EWSకు 146, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 129గా నిర్ణయించారు. ఈ మార్కులు వస్తేనే ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో చేరడానికి అర్హత పొందుతారు.

News June 5, 2024

ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్

image

TG: ఇవాళ WGL-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. మే 27న జరిగిన పోలింగ్‌లో 72.44 శాతం ఓటింగ్ నమోదైంది. నల్గొండ(D) సమీపంలోని దుప్పలపల్లిలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. 3,36,013 బ్యాలెట్ ఓట్ల లెక్కింపును మొత్తం 96 టేబుళ్లపై చేపట్టనున్నారు. తీన్మార్ మల్లన్న(CONG), రాకేశ్ (BRS), అశోక్(స్వతంత్ర) ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.

News June 5, 2024

AP ఎన్నికలు.. భారీ మెజార్టీలు ఇవే

image

☞ గాజువాక- పల్లా శ్రీనివాస్(TDP)-95,235
☞ భీమిలి-గంటా శ్రీనివాస్(TDP)-92,401
☞ మంగళగిరి- లోకేశ్(TDP)-91,413
☞ పెందుర్తి- రమేశ్(JSP)-81,870
☞ నెల్లూరు(U)-నారాయణ(TDP)-72,489
☞ తణుకు- రాధాకృష్ణ(TDP)- 72,121
☞ కాకినాడ.R- నానాజీ(JSP)- 72,040
☞ RJY(U)- శ్రీనివాస్(TDP)-71,404
☞ ☞ పిఠాపురం- పవన్ కళ్యాణ్(JSP)-70,279

News June 5, 2024

5జీ స్పెక్ట్రమ్ వేలం మళ్లీ వాయిదా

image

టెలికాం రంగం ప్రతిష్ఠాత్మకంగా భావించే 5జీ స్పెక్ట్రమ్ వేలం మరోసారి వాయిదా పడింది. జూన్ 25న ఆక్షన్ నిర్వహించనున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ వెల్లడించింది. కాగా మే 20న జరగాల్సిన ఆక్షన్ ఈనెల 6కు తొలుత వాయిదా పడగా తాజాగా మరోసారి డేట్ మారింది. జూన్ 13, 14 తేదీల్లో మాక్ ఆక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా రూ.96వేలకోట్ల బేస్ ప్రైస్‌తో పలు 5జీ బ్యాండ్‌లకు వేలం జరగనుంది.

News June 5, 2024

ఏపీ ఎన్నికల్లో కుట్ర జరిగింది: ఎస్సీ కమిషన్ సభ్యుడు

image

APలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని రాష్ట్ర SC కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో EC కుట్ర చేసిందన్నారు. తక్షణమే ఎన్నికలను రీకాల్ చేసి తిరిగి బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. TDP నేతలకు వేలల్లో, BJP MP అభ్యర్థులకు లక్షల్లో మెజార్టీ, JSP 21 సీట్లలో గెలవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని మెజార్టీ సర్వేలు వెల్లడించాయన్నారు.