News January 15, 2025

EX కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్‌లో పొలిటికల్ వార్

image

MP భోపాల్‌లో 2024 DEC 19న ఓ కార్ నుంచి 52KGల గోల్డ్, ₹10Cr నగదును IT అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. BJP ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని INC విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్‌నాథ్ సర్కార్ కరప్షన్‌కు మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.

News January 15, 2025

‘కుంభమేళా’పై స్టీవ్ జాబ్స్ లేఖ.. వేలంలో రూ.4.32 కోట్లు

image

భారత్‌లో జరిగే మహాకుంభమేళా అంటే యాపిల్ కో ఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్‌కు ఎంతో ఇష్టం. ఆయన 19 ఏళ్ల వయసు(1974)లో తన ఆధ్యాత్మిక, ఆత్మ పరిశీలనతోపాటు కుంభమేళాను సందర్శించాలనే ఆకాంక్షను ప్రస్తావిస్తూ స్నేహితుడు టిమ్ బ్రౌన్‌కు లేఖ రాశారు. తర్వాత స్టీవ్ భారత్‌లో దాదాపు 7 నెలలు గడిపారు. 50 ఏళ్ల కిందటి ఈ లెటర్‌ను వేలం వేయగా దాదాపు రూ.4.32 కోట్లు పలికింది. తాజాగా ఆయన సతీమణి పావెల్ కుంభమేళాకు వచ్చారు.

News January 15, 2025

అందుకే కేజ్రీవాల్‌కు మద్దతు: అఖిలేశ్ యాదవ్

image

ఢిల్లీలో BJPని ఓడించే స‌త్తా ఆప్‌కు మాత్ర‌మే ఉంద‌ని, అందుకే ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు అఖిలేశ్ యాద‌వ్ తెలిపారు. BJPకి వ్య‌తిరేకంగా పోరాడే ప్రాంతీయ పార్టీల‌కు INDIA కూట‌మి నేత‌లు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు. ఇండియా కూట‌మి ఏర్ప‌డిన‌ప్పుడే ప్రాంతీయ పార్టీలు బ‌లంగా ఉన్న చోట వాటికే అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. కూటమి పార్టీలు SP, TMC, NCP(SP)లు ఆప్‌కు మద్దతు ప్రకటించాయి.

News January 15, 2025

సంక్రాంతి సెలవులు రేపే లాస్ట్

image

తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు రేపటితో ముగియనున్నాయి. వీటికి ఈనెల 11 నుంచి 16 వరకు ఇంటర్ బోర్డు హాలిడేస్ ఇచ్చింది. పండగ సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు ఎల్లుండి నుంచి కాలేజీ బాట పట్టనున్నారు. ఇక రాష్ట్రంలోని స్కూళ్లకు 17 వరకు సెలవులు ఉన్నాయి. 18న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అటు ఏపీలోని స్కూళ్లకు 19 వరకు హాలిడేస్.

News January 15, 2025

మీరు గేమ్ నుంచి తీసేయొచ్చు.. కానీ నా వర్క్‌ను ఆపలేరు: పృథ్వీ షా

image

జాతీయ జట్టుతోపాటు దేశవాళీ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా పరోక్షంగా స్పందించారు. ‘మీరు నన్ను గేమ్ నుంచి తీసేయొచ్చు. కానీ నా వర్క్‌ను మాత్రం ఆపలేరు’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు అతను కొన్ని వారాలుగా మైదానం, జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా పృథ్వీని ఏ జట్టూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే.

News January 15, 2025

నన్ను దేవుడే రక్షిస్తాడు: కేజ్రీవాల్

image

ఖ‌లిస్థానీ వేర్పాటువాదుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌న్న వార్త‌ల‌పై కేజ్రీవాల్ స్పందించారు. దేవుడే త‌న‌ను ర‌క్షిస్తాడ‌ని, దేవుడు అనుమ‌తించినంత కాలం జీవిస్తాన‌ని పేర్కొన్నారు. దేవుడే ర‌క్షించే వారిని ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ల‌క్ష్యంగా ఖ‌లిస్థానీ మ‌ద్ద‌తుదారుల హిట్ స్క్వాడ్ ఏర్పడింద‌ని, ఢిల్లీ ఎన్నిక‌ల్లో వారు కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసుకున్న‌ట్టు నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి.

News January 15, 2025

ఇంటి వద్దకే టెక్నీషియన్లు.. తక్కువ ధరకే సర్వీస్: టీడీపీ

image

AP: వృత్తిదారులను ఆదుకునేందుకు CM CBN ఆదేశాలతో ‘హోమ్ ట్రయాంగిల్ యాప్’తో మెప్మా ఒప్పందం చేసుకుందని TDP వెల్లడించింది. ‘20వేల మంది టెక్నీషియన్లకు మెప్మా శిక్షణ ఇస్తోంది. TV, AC, ఫ్రిజ్, కంప్యూటర్ తదితర 30 రకాల డివైజ్‌లు పాడైతే టెక్నీషియన్లు ఇంటి వద్దకే వచ్చి తక్కువ ధరకే బాగుచేస్తారు. MAR నుంచి 123 పట్టణాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో టెక్నీషియన్‌కు ₹20-25వేల ఆదాయం వస్తుంది’ అని పేర్కొంది.

News January 15, 2025

త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణ టూర్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారుపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. త్వరలోనే రాహుల్ పర్యటన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అటు ఇవాళ ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

News January 15, 2025

ఆస్కార్ అవార్డులు రద్దు? 96 ఏళ్లలో ఇదే తొలిసారి

image

లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చును ఆర్పడం ఎవరివల్లా కావడం లేదు. ఇంతింతగా పెరుగుతున్న మంటల నుంచి ప్రజలను రక్షించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ కార్చిచ్చు ‘ఆస్కార్’ను తాకేలా కనిపిస్తోంది. దీనివల్ల ‘ఆస్కార్-2025’ ఈవెంట్ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్స్ ప్రకటన కూడా వాయిదా పడింది. ఒకవేళ రద్దయితే 96 ఏళ్లలో ఇదే తొలిసారి కానుంది.

News January 15, 2025

హైకోర్టులకు కొత్త జడ్జిలు.. TGకి నలుగురు, APకి ఇద్దరు

image

తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను ప్రతిపాదించింది. కాగా నిన్న హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులైన విషయం తెలిసిందే. అటు ఏపీ హైకోర్టుకు అవధానం హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు పేర్లను కొలీజియం రిఫర్ చేసింది.