India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపుతోంది. మర్రిపాడు(మ) వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తొలుత నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించగా, వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో చెన్నై తరలించారు. బాలుడి రక్త నమూనాలను పుణేలోని ల్యాబ్కు పంపారు. ముందు జాగ్రత్తగా వెంకటాపురంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. కొత్త ROR చట్టాన్ని తీసుకురానుండగా దానిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పేదల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామన్నారు. వాటిని భూములు లేని పేదలకు ఇస్తామని తెలిపారు.
స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా మొదలయ్యాయి. ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. నిఫ్టీ 24,309 (-26), సెన్సెక్స్ 80,606 (-74) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్కేర్, FMCG, IT సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. నిఫ్టీ ADV/DEC రేషియో 24:26గా ఉంది. RIL, TECHM, APOLLOHOSP టాప్ గెయినర్స్. POWERGRID, TRENT, BPCL టాప్ లూజర్స్.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3వ టెస్టు 2వ ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 89/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ ప్రకటించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి ఆసీస్ మొత్తం 274 రన్స్ లీడింగ్లో ఉంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే 275 రన్స్ చేయాలి. ఆసీస్ గెలవాలంటే 54 ఓవర్లలో భారత్ను ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. ఈలోగా వర్షం కురిసి మ్యాచ్ జరగకపోతే ఈ టెస్టు డ్రాగా ముగిసే ఛాన్సుంది.
TG: సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు సహా పలువురి ఫిర్యాదు మేరకు బన్నీ అభిమానులపై ఈ కేసులు నమోదయ్యాయి. కాగా అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ పలువురు ఫ్యాన్స్ సీఎం రేవంత్పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.
TG: కామారెడ్డి జిల్లాలో మరో నేషనల్ హైవే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత రోడ్డు ఇరుకుగా మారడం, కార్లు, బస్సులు, ఆటోలు, ఇతర గూడ్స్ వెహికల్స్ రాకతో నిత్యం రద్దీ నెలకొంటోంది. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం వరకు 4 లేన్లుగా మార్చాలని కేంద్రాన్ని కోరనుంది.
బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయింది. త్వరగా రన్స్ చేసి భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచాలనే తొందర్లో ఆసీస్ ప్లేయర్లు వికెట్లు కోల్పోతున్నారు. మెక్స్వీని, ఖవాజా, లబుషేన్, మిచెల్ మార్ష్, స్మిత్ ఔట్ అయ్యారు. బుమ్రా, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. క్రీజులో హెడ్, క్యారీ ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 33/5గా ఉంది.
TG: విద్యార్థినులు, మహిళలకు అండగా నిలిచేలా సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ‘పోలీస్ అక్క’ పేరిట ప్రతీ పీఎస్ నుంచి మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి మహిళల భద్రతకు సంబంధించిన విధులు కేటాయించారు. షీ టీమ్స్తో కలిసి వీరు పోక్సో, మహిళా చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై స్కూళ్లు, కాలేజీలకు తిరుగుతూ అవగాహన కల్పిస్తారు. మిగతా జిల్లాల్లోనూ దీన్ని అమలు చేస్తే?
AP: రాష్ట్రంలో 25ఏళ్లుగా జమిలి తరహా ఎన్నికలు జరుగుతున్నాయి. 1999- 2024 వరకు లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1952- 2024 వరకు లోక్సభకు 17 సార్లు, ఏపీలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. రెండింటికీ కలిపి 9సార్లు ఎలక్షన్స్ నిర్వహించారు. ముందస్తు ఎన్నికలు, తదితర కారణాల వల్ల కొన్నిసార్లు సాధ్యం కాలేదు. 1952నుంచి దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీలకు మొత్తం 430సార్లు ఎన్నికలు జరిగాయి.
ప్రపంచ పోలీసుగా బడాయికొట్టే అమెరికాలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. 7సార్లు ఆడిట్ చేసినా బడ్జెట్లో $824B డబ్బు ఏమైందో ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. అసలింత డబ్బు లెక్కలోకి రాకపోవడం ఆశ్చర్యమే. తాజాగా ప్రమాదకరమైన రేడియోయాక్టివ్ షిప్మెంట్ మిస్సైంది. న్యూఫీల్డ్లోని నాజా క్యాన్సర్ సెంటర్ నుంచి దీనిని న్యూజెర్సీ పంపిస్తుండగా కన్సైన్మెంట్ డ్యామేజై కనిపించింది. ఇప్పుడు దానికోసం సెర్చ్ మొదలైంది.
Sorry, no posts matched your criteria.