India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజస్థాన్లో బీజేపీ ఖాతా తెరిచింది. జైపూర్లో ఆ పార్టీ అభ్యర్థి మంజు శర్మ భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ సింగ్పై ఆమె 3,31,767 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించినట్లు ఈసీ ప్రకటించింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. 56,777 ఓట్ల భారీ మెజారిటీతో విజయదుందుభి మోగించారు. అక్కడ వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మి నరసింహరాజుకు 60,125 ఓట్లు రాగా, RRRకు 1,16,902 ఓట్లు పోలయ్యాయి.
ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఆప్ మరోసారి ఘోర పరాజయం దిశగా సాగుతోంది. 7 స్థానాల్లో ఒక్క చోట కూడా మెజారిటీలో లేదు. ఆప్ CM కేజ్రీవాల్తో సహా మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్ బెయిల్పై వచ్చి ప్రచారం నిర్వహించినా ప్రయోజనం చూపలేదని కౌంటింగ్ సరళిని చూస్తే అర్థమవుతోంది. 2019 ఎన్నికల్లోనూ ఈ పార్టీ ఘోర ఓటమి పాలైంది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ BJP అభ్యర్థి శంకర్ లల్వానీ 8.4లక్షల ఓట్ల ఆధిక్యంతో రికార్డు సృష్టించారు. LS ఎన్నికల చరిత్రలో ఓ అభ్యర్థి ఈ స్థాయిలో లీడింగ్లో ఉండటం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు BJP నేత ప్రీతమ్ ముండే(6.9L) పేరిట ఉండేది. కాగా ఈసారి ఇండోర్లో INC అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ నోటా 1.8లక్షల ఓట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.
జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పవర్ స్టార్ ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా అమరావతి శాసనసభకు వెళ్లడమే మిగిలింది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
మంత్రి అమర్నాథ్ గాజువాకలో ఓటమి పాలయ్యారు. TDP అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచిన అమర్నాథ్ ఈసారి గాజువాక నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే. కాగా, APకి పెట్టుబడుల విషయంలో అమర్నాథ్ చేసిన ‘కోడిగుడ్డు’ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. దీంతో ‘గుడ్డు’ పగిలింది అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపు లాంఛనమవడంతో మెగా ఫ్యామిలీ సంబరాలకు సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో జరిగే వేడుకలకు కుటుంబసభ్యులంతా హాజరవుతారని సినీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముందే తమ్ముడు పవన్కి చిరు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటు పిఠాపురం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి నాగబాబు కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తున్నారు.
నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్రెడ్డి రికార్డు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా చివరి దశ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా… ప్రస్తుతం 5.18లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణలో అత్యధిక మెజార్టీ సాధించే అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి రికార్డు నెలకొల్పనున్నారు.
యూపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ – ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంబో సత్ఫలితాలు సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. రాజ్పుత్లు, మైనారిటీలు, యాదవ్ వర్గాల మద్దతు, రైతులు, పేపర్ లీక్ వల్ల నష్టపోయిన లక్షలాది యువత మద్దతును ఇండియా కూటమికి కూడగట్టడంలో రాహుల్ – అఖిలేష్ ద్వయం సక్సెస్ అయింది. ఇవి ఓట్లుగా మారడంతో UPలో ఇండియా కూటమి 43, ఎన్డీయే 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
AP: ఈ ఎన్నికల్లో పులివెందులలో జగన్కు భారీగా మెజారిటీ తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 10 రౌండ్లు పూర్తి కాగా 37 వేలకుపైగా మెజారిటీతో ఆయన కొనసాగుతున్నారు. మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 60 వేల నుంచి 70 వేల మెజారిటీ రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో జగన్కు 90 వేలకుపైగా మెజారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.