India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో పలువురు సిట్టింగ్ ఎంపీలు ఈ ఎన్నికల్లోనూ బరిలో ఉన్నారు. మహబూబాబాద్ నుంచి BRS అభ్యర్థి మాలోత్ కవిత, చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి(గతంలో BRS), మహబూబ్నగర్లో మన్నె శ్రీనివాస్రెడ్డి(BRS) వెనుకంజలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్లో కిషన్రెడ్డి, నిజామాబాద్లో అర్వింద్, కరీంనగర్లో బండి సంజయ్ ఆధిక్యంలో దూసుకెళుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ కానున్నట్టు సమాచారం. ఎన్డీయేను 300 సీట్లు దాటనివ్వకుండా శాయశక్తులా కృషి చేస్తున్న ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగానే చంద్రబాబును వేణుగోపాల్ కలవనున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ భేటీకి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
మహారాష్ట్రలో NCP (SP) 10 స్థానాల్లో బరిలో నిలవగా 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు అజిత్ పవార్ సారథ్యంలోని NCP 5 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక్క స్థానంలో(రాయిగఢ్) ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇండియా కూటమి 28 స్థానాల్లో, ఎన్డీఏ 17 చోట్ల లీడింగ్లో కొనసాగుతున్నాయి.
AP: ఎస్టీ నియోజకవర్గాల్లో ఈసారి వైసీపీ చతికిలపడింది. రాష్ట్రంలో ఏడు ఎస్టీ రిజర్వుడు(పాలకొండ, కురుపాం, సాలూరు, అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం, పోలవరం) నియోజకవర్గాలున్నాయి. వీటిలో ప్రస్తుతం పాలకొండ, అరకు, పాడేరులో వైసీపీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. మిగతా చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. కాగా గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలను వైసీపీ గెలుచుకుంది.
AP ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ మంత్రి రోజా Xలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘భయాన్ని విశ్వాసంగా, ఎదురుదెబ్బలను మెట్లుగా, మన్నింపులను నిర్ణయాలుగా, తప్పులను పాఠాలుగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అని ఈ ఉదయం Xలో ఆమె చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో నగరి నుంచి ఆమె ఓటమి దిశగా పయనిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీలో మూడు రాష్ట్రాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో క్లీన్స్వీప్ దిశగా సాగుతుండగా, గుజరాత్లో 24 స్థానాల్లో లీడింగ్లో ఉంది. బిహార్లోనూ NDA కూటమి 30కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమిపై మెజారిటీలో ఈ రాష్ట్రాల్లోని ఆధిక్యమే(దాదాపు 80 స్థానాలు) కీలకంగా ఉంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మూడో విజయం దక్కింది. ఉమ్మడి ప.గో. జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 60వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. నిమ్మలకు వరుసగా ఇది మూడో విజయం. అటు ఇప్పటికే రాజమహేంద్రవరం రూరల్, సిటీల్లోనూ టీడీపీ గెలిచింది. వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు.
AP: ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 స్థానాలకుగానూ 11 సీట్లలో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అద్దంకి (TDP) 7318, చీరాల (TDP) 6440, దర్శి (TDP) 305, గిద్దలూరు(TDP) 447, కందుకూరు (TDP) 2729, కనిగిరి (TDP) 992, కొండపి (TDP) 3078, మార్కాపురం (TDP) 4559, ఒంగోలు (TDP) 4022, పర్చూరు (TDP) 2753, సంతనూతలపాడు (TDP) 17540, యర్రగొండపాలెంలో (YCP) 441 ఓట్ల లీడింగ్లో ఉన్నాయి.
గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై గెలిచిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈసారి విజయానికి దూరమవుతున్నారు. అమేథీలో ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ 50వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
TG: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీ దిశగా దూసుకెళుతున్నారు. నల్గొండలో 3,44,000 ఓట్ల ఆధిక్యంతో రఘువీర్రెడ్డి కొనసాగుతున్నారు. అటు ఖమ్మంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి 3,24,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.