News January 15, 2025

TODAY HEADLINES

image

✒ శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
✒ మహాకుంభమేళా: 3.5 కోట్ల మంది ప‌విత్ర స్నానాలు
✒ 26 నుంచి ఉత్తరాఖండ్‌లో UCC అమలు
✒ ఈ ఏడాదీ 10 శాతం పెరగనున్న రీఛార్జ్ ధరలు?
✒ 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం: సీఎం CBN
✒ కూతురి డిగ్రీ ప్రదానోత్సవం.. లండన్‌కు YS జగన్
✒ తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
✒ గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం: CM రేవంత్
✒ నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

News January 15, 2025

బంగ్లాదేశ్‌లో కంగనా ‘ఎమర్జెన్సీ’ బ్యాన్!

image

కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సరిహద్దు విషయంపై భారత్, బంగ్లా మధ్య వివాదం చెలరేగింది. ఈక్రమంలోనే ఎమర్జెన్సీపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇంతకుముందు పుష్ప-2, భూల్ భులయ్యా-3 సినిమాలను కూడా బంగ్లా ప్రభుత్వం నిషేధించింది. కాగా ఈనెల 17న ఎమర్జెన్సీ విడుదల కానుంది.

News January 15, 2025

యూపీలో తెలంగాణ బస్సుకు అగ్నిప్రమాదం

image

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో 50 మంది TGలోని భైంసా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పల్సికి చెందిన ప్రయాణికుడు మరణించాడు. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో బస్సుతో పాటు ప్రయాణికుల సామాగ్రి దగ్ధమైంది. వీరంతా కాశీకి వెళ్తున్నట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

News January 15, 2025

రేపు కనుమ.. ప్రత్యేకతలు ఇవే!

image

3 రోజుల సంక్రాంతి వేడుకల్లో రేపు కీలకమైన కనుమ. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను ఈ రోజున అలంకరించి పూజించడం ఆనవాయితీ. ఏడాదంతా శ్రమించే వాటికి రైతులు ఇచ్చే గౌరవం ఇది. అలాగే కనుమనాడు మినప వడలు, నాటుకోడి పులుసుతో భోజనం తప్పనిసరి. కనుమ రోజు కాకులు కూడా కదలవని నానుడి. అందుకే పండక్కి వచ్చిన వారు రేపు తిరుగు ప్రయాణం చేయకూడదంటారు. 3 రోజులు పండుగను ఆస్వాదించిన తర్వాతే తిరిగెళ్లాలనేది సంప్రదాయం.

News January 14, 2025

తుది దశకు హమాస్-ఇజ్రాయెల్ వార్!

image

హమాస్-ఇజ్రాయెల్ మధ్య 15 నెలలుగా సాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గాజాలో శాంతి స్థాపన కోసం కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు. బందీల విడుదలకు హమాస్ ఓకే చెప్పిందని మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతర్ పేర్కొంది. 2023 OCT 7న హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 47వేల మంది మరణించారు.

News January 14, 2025

నిద్రలో కింద పడిపోతున్నట్లు అనిపిస్తోందా?

image

చాలామంది నిద్రలోకి జారుకోగానే కిందపడిపోతున్నామనే ఫీలింగ్ వచ్చి జెర్క్ ఇస్తారు. దీన్నే హిప్నిక్ జెర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని అంటారు. నిద్రపోతుండగా శరీర కండరాల్లో కదలికల వల్లే ఈ ఆకస్మిక కుదుపులు సంభవించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి, ఆందోళన, అలసట కూడా కారణాలేనట. అయితే నిద్ర డిస్టర్బ్ కావడం, తరచూ దీనికి గురైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News January 14, 2025

ఐకానిక్ చిత్రం స్థానంలో ‘కర్మ క్షేత్ర’.. సమర్థించుకున్న ఆర్మీ చీఫ్

image

1971 వార్‌లో పాక్ ఆర్మీ లొంగుబాటు సందర్భంగా తీసిన పిక్చర్‌ వెరీ ఫేమస్. న్యూఢిల్లీ రైసీనా హిల్ ఆఫీస్‌లో ఉన్న ఆ ఫొటో స్థానంలో ‘కర్మ క్షేత్ర’ పెయింటింగ్‌‌ను ఉంచడాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర సమర్థించుకున్నారు. ‘ఆర్మీలో జనరేషన్ల మార్పును సూచిస్తూ కల్నల్ థామస్ దీన్ని రూపొందించారు’ అని తెలిపారు. ‘దేశ విలువలు, ధర్మాన్ని రక్షించే పాత్రలో సైన్యం, టెక్నాలజీని ఇది ప్రతిబింబిస్తుంది’ అని ఆర్మీ పేర్కొంది.

News January 14, 2025

జనవరి 26 నుంచి ఉత్తరాఖండ్‌లో UCC అమలు

image

రిపబ్లిక్ డే నాటి నుంచి ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడానికి అక్క‌డి ప్ర‌భుత్వం సన్నాహాలు చేస్తోంది. పెళ్లి, విడాకులు, వారసత్వం విషయాల్లో అన్ని మతాలకు ఉమ్మడి చట్టం అమలు కోసమే UCC తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. లివ్-ఇన్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న జంట‌లు త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవడంతో పాటు సాక్షుల వీడియోల‌ను రికార్డు చేయాల్సి ఉంటుంది. కామన్ పోర్టల్ ఉంటుంది.

News January 14, 2025

మహా కుంభమేళాలో విషాదం

image

మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన NCP(SP) నేత, షోలాపూర్ మాజీ మేయర్ మహేశ్ కొతె గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఉదయం త్రివేణి సంగమం వద్ద నదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. గమనించి తోటి భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News January 14, 2025

హ‌రియాణా BJP చీఫ్‌పై గ్యాంగ్ రేప్ కేసు

image

హ‌రియాణా BJP చీఫ్ మోహ‌న్ లాల్ బ‌డోలీపై హిమాచ‌ల్ పోలీసులు సామూహిక అత్యాచారం కేసు న‌మోదు చేశారు. HPలోని కసౌలిలో ఉన్న హోట‌ల్‌లో July 3, 2023న మోహ‌న్ లాల్, సింగ‌ర్ రాఖీ మిట్ట‌ల్ తనపై అత్యాచారం చేశార‌ని ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆరోపించారు. ప్ర‌భుత్వ ఉద్యోగం ఇప్పిస్తాన‌ని, మ్యూజిక్ వీడియోలో అవ‌కాశం ఇస్తాన‌ని నమ్మించిన వీరిద్దరూ దారుణానికి ఒడిగట్టారన్నారు. అయితే ఆమె ఎవరో తెలియదని మోహన్ లాల్ అన్నారు.